Tuesday, July 14, 2020

"మెకంజి కైఫియ్యతులు - తూర్పుగోదావరి జిల్లా " పుస్తకం దాదాపు పూర్తయింది.



ఆంధ్రప్రదేష్ కు చెందిన 13 జిల్లాలలో పది జిల్లాలకు సంబంధించిన కైఫియ్యతులను ఎపి ఆర్చైవ్స్, సిపి బ్రౌన్ సంస్థల వారు ఇప్పటికే ముద్రించారు. కడప జిల్లా ఏడు సంపుటాలు, గుంటూరు జిల్లా మూడు సంపుటాలు, మిగిలిన జిల్లాలకు సంబంధించి ఒక్కొక్కటి చొప్పున వెలువరించారు. కృష్ణా దాటాక ఈ కైఫియ్యతుల సేకరణ పెద్దగ జరగలేదు.
ఇక మిగిలిపోయిన మూడు జిల్లాలలో తూర్పుగోదావరి ఒకటి. ఆ లోటు ఈ పుస్తకంతో తీరుతుందని భావిస్తాను. ఈ జిల్లాకు సంబంధించి పది కైఫియ్యతులు మాత్రమే లభిస్తున్నాయి.


దీనికి సంబంధించిన మెటీరియల్ చాలామట్టుకు బొమ్మూరు తెలుగు విశ్వవిద్యాలయంలో, గౌతమి లైబ్రేరీలో దొరికింది. ఎపి. ఆర్చైవ్స్ వారి సమాచారం శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారు ఇచ్చారు.
ఇప్పుడున్న పరిస్థితులలో పుస్తకరూపంలో రావటానికి మరో 6 నెలలు పట్టొచ్చు.
ఇది ఇండెక్స్ పేజీ ఇంకా కొన్ని ఫొటోలు

 
బొల్లోజు బాబా








No comments:

Post a Comment