Tuesday, July 14, 2020

ఒక మిత్రుని వాల్ పై చేసిన కామెంటు


మంచి అంశం.
కులాన్ని మనం చారిత్రికంగా కూడా చూడాలి
1. రెండువేల సంవత్సరాల క్రితంనాటి గాథాసప్తశతిలో కులం ప్రస్తావన లేదు.
2. పన్నెండో శతాబ్దం వరకూ శూద్రులు చతుర్ధాన్వయులుగానే శాసనాలులో చెప్పబడ్డారు కులాలుగా కాదు.
3. కుల వ్యవస్థ అనేది ఒకప్పుడు ఒక ఇంటర్ లింక్డ్ వ్యవస్థగా ఉండేది. నిచ్చెనమెట్లలో క్రిందివాని అవసరం పైవారి కి తప్పని సరిగా ఉండేటట్లు సాంస్కృతికంగా ముడివేయబడ్డారు. అన్ని కులాల ఇండ్లలో (బ్రాహ్మణులతో సహా) శుభ, అశుభకార్యాలకు ఇతరకులస్థుల ప్రమేయం లేనిదే జరపించలేని ఒక వ్యవస్థ అది. అదంతా ఒక క్లోజ్ నెట్ వర్క్. ఒకరి అవసరం ఒకరికి పడే అతిచిన్న లోకం ఎక్కడికక్కడ. పారిశ్రామిక విప్లవంతో అది విచ్చిన్నమైంది మంచికో చెడుకో ఎవరూ చెప్పలేం. (హరారె సెపియన్ పుస్తకం)
4. ఇక నిచ్చెనమెట్ల వ్యవస్థలో ఉండే "ఆధిపత్యభావన" అనేది ఒక సార్వజనీన మానవలక్షణం/ఇన్ స్టింక్ట్. రకరకాల ప్రాంతాలలో, సందర్భాలలో రకరకాల పేర్లు. ఇది ప్రతిఒక్కరి మనుగడకూ చాలా సందర్భాలలో అవసరపడుతుంది. నేను వాడికన్నా తెలివైనవాడిననో, మర్యాదస్తుడననో, విశాలహృదయం కలిగినవాడిననో అనుకోకుండా ఎవరూ ప్రశాంతంగా బ్రతకలేరు. ఆ వీక్ పాయింటుమీద ఆధారపడి పనిచేస్తుంది కులవ్యవస్థ. దీన్ని కొట్టటం అంత సులభం కాదు. ఆలోచనాక్రమంలోనే సమూలమైన మార్పు రావాలి.
5. ఇక ఆధునిక కాలానికి వచ్చేసరికి పీష్వాల పాలనలో జరిగిన క్రౌర్యాలను, కుల దాష్టీకాలను భారతదేశం అంతటా జరిగినట్లు చెప్పటం వల్ల చాలా నష్టం జరిగింది. అప్పటికి 60 శాతం భూభాగాన్నికలిగి ఉన్న బ్రిటిష్ ప్రాంతాలలో వివక్ష ఉండేది కానీ చెవుల్లో సీసాలు వేసేంత, ముంతలు, తాటాకులు కట్టేంత లేదు. (ఎవరైనా చెపితే సవరించుకోగలవాడను). బ్రిటిష్ ప్రాంతాలలో చట్టాలు బలంగా ఉండేవి. సమాన హక్కులను వాడుకొని చాలామంది నిమ్నవర్గీయులు వివక్షను తప్పించుకోలేకపోయినా ప్రతిభ ఆధారిత గౌరవాలను పొందారు.
6. నిజానికి హిందూ మతం చాలా తెలివైన మతం. అన్నింటిని తనలో కలుపుకోగలగటం దాని లక్షణం. ఒకప్పటి శాక్తేయం, కాపాలికం, సౌర, గాణాపత్య, పశుపతిఆరాధన, చార్వాక లాంటి శాఖలను తనలో కలిపేసుకొంది. బౌద్ధ, జైన సిక్కు సంప్రదాయాలను తన అనుయాయి శాఖలుగా మార్చుకొంది.
ఈ రోజు మనకళ్లముందే గ్రామదేవతలు, వనదేవతలు కూడా హైందవీకరణ చెందుతున్నారు క్రమక్రమంగా.... హిందూ మతం పరిణామ శీలత అది. ఇప్పటికే చూస్తున్నాం శ్రీరామ నవమికి మజ్జిగలు పంచిపెడుతున్న ముస్లిములు అంటూ, వెసులుబాట్లు ఎక్కడపోతాయో అని హిందూ పేర్లతో కొనసాగే క్రిష్టియన్లు అంటూ .... ఇదే ధోరణులు సాగితే కొంతకాలానికి వీరిని కూడా హిందూ మతం తనలో కలిపేసుకొని అల్లాని పదకొండో అవతారంగానూ, జీసస్ ని పన్నెండో అవతారం గానూ సముచిత స్థానం ఇచ్చినా ఇచ్చీగల్దు...... ఓ వెయ్యేళ్ళకు.... 

No comments:

Post a Comment