Saturday, February 26, 2011

నగరంలో చిరుత

నగరంలో చిరుత

జనావాసంలోకి చిరుత ప్రవేశించింది.
పాపం అది దారి తప్పి కాదు ఇటువస్తా.
తను పుట్టిన ప్రదేశాన్ని చూసుకొందామని వచ్చింది.
ఎటెళ్లాలో తెలియక ఓ ఇంటి బాత్ రూం లో దూరింది.

లక్షల విలువచేసే దాని మచ్చల చర్మం మెరుస్తోంది.
ఆ నిగారింపు తెలియకూడదని కామోసు
అది చీకటి మూలల్లోకి నక్కుతోంది.

తన ఒక్కో గోరు మూడేసి వేలని విన్నట్లుంది
గోళ్లనన్నీ లోనకు లాగేసుకొంది.

తన ఎముకలపొడి తులం వెయ్యి రూపాయిలని వినగానే
దానికి వెన్నులోంచి చలి మొదలైంది.
రక్షించండి, రక్షించండీఅని అరచింది దీనంగా.
జనాలు భయంతో పరుగులు తీసారు.

ఓ అత్యుత్సాహి దానికి కొంచెం దగ్గరగా నుంచొని
సెపియా టోన్ లో ఫొటోలు తీయించుకొంటున్నాడు.

మీడియావాడొకడు ఎక్స్ క్లూసివ్ కవరేజ్ కోసమని
దానిని కర్రతో పొడిచి కెమేరా ఆన్ చేస్తున్నాడు.
కర్రతో పొడిచి కెమేరా ఆన్ చేస్తున్నాడు .........

ఆ హడావిడిలో బాత్ రూం తలుపు గడియ ఊడింది.
ఒక ఉరుకులో అది బయటపడి
ఇక వెనక్కు తిరిగి చూడకుండా పరిగెట్టింది.
మానవ మృగాలకు దూరంగా ...  చెట్లు నరికిన అడవి వైపు.

 బొల్లోజు బాబా

Monday, February 14, 2011

ఫ్రెంచి పాలనలో యానాం..... 10


ఫ్రెంచి యానాం లో జరిగిన బానిస వ్యాపారం
  పంతొమ్మిదవ శతాబ్దం చివరవరకూ జరిగిన బానిస వ్యాపారం మానవజాతి ఎన్నటికీ చెరుపుకోలేని మరక. స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం అనే అంశాల ఆవశ్యకతను ప్రపంచానికి తెలియచెప్పిన ఫ్రాన్స్ ఒకానొక సమయంలో బానిస వ్యాపారంలో ప్రధాన పాత్ర వహించటం ఆశ్చర్యం కలిగించే విషయం1794 లోనే ఫ్రెంచి రిపబ్లిక్ బానిస వ్యాపారాన్ని నిషేదించిందికానీ 1802 లో నెపోలియన్ ఆ నిషేదాన్ని ఎత్తివేసాడుఈ వెసులుబాటువల్ల, 1830 లోలూయిస్ ఫిలిప్ బానిస వ్యాపారాన్ని నేరమని చట్టం తీసుకువచ్చేవరకూ, అది చట్టబద్దంగానే కొనసాగిందిఇక అనధికారికంగా 1850ల వరకూ కూడా అక్కడక్కడా నడిచిందిబానిస వ్యాపారాన్ని 1772 లోనే ఇంగ్లాండ్ నిషేదించి ఫ్రాన్స్ కంటే ముందుండటం గమనార్హంఈ విషయంలో ఫ్రెంచి వారిపై బ్రిటిష్ వారు ఆకాలంలో ఒక విధమైన “మోరల్ పోలీసింగ్” పాత్ర పోషించారు.

ఫ్రాన్స్ కు స్థానికంగా ఈ అనాగరీకమైన బానిస వ్యాపారంపట్ల ఎంతో వ్యతిరేకత ఉన్నప్పటికీ, దానిని నిషేదించలేకపోవటానికి – ఫ్రెంచి కాలనీలైన రీయూనియన్ లో (మడగాస్కర్ సమీపంలో ఫ్రెంచి వారు ఆక్రమించుకొన్న ఒక ద్వీపం) మంచి లాభాల్నిచ్చే చెరకుతోటల సాగుకు వేల సంఖ్యలో కూలీలు అవసరం కావటంఆ తోటలు సమకూర్చే ఆర్ధికవనరులు ప్రత్యక్ష్యంగానో, పరోక్షంగానో సుమారు యాభైలక్షల ఫ్రెంచి వారికి జీవనోపాధి కలిగించటం (1763 నాటికి) వంటివి ప్రధాన కారణాలుఅందుకనే ఫ్రెంచి ప్రభుత్వం బానిస వ్యాపారానికి సబ్సిడీలు ఇచ్చి మరీ ప్రోత్సహించవలసి వచ్చేదిఈ కారణాల దృష్ట్యా1672 లో 10 లీవ్ర్ లు ( లీవ్ర్= ప్రాచీన ఫ్రెంచ్ కరన్సీ. ఒక లీవ్ర్ సుమారు 450 గ్రాముల వెండి విలువతో సమానం) ఉండే ఒక బానిస వెల,  1730 లో 100 లీవ్ర్ లకు, 1787 నాటికి 160 లీవ్ర్ లకు క్రమంగా చేరింది.

ఫ్రెంచి వారు తమ బానిసలను మొదట్లో ఆఫ్రికానుంచి సేకరణ జరిపినా కాలక్రమేణా ఇండియాలోని తమ కాలనీల నుంచి కూడా తరలించటం మొదలెట్టారు1760 లో ఏడాదికి సగటున 56 షిప్పులలో బానిసల ఎగుమతి జరిగేదిఒక్కో షిప్పులో మూడునుంచి నాలుగొందలమంది బానిసలు పట్టే సామర్ధ్యం కలిగుండేవి. 1767 లో చక్కెర ఉత్పత్తిలో ఫ్రెంచ్ వారు ప్రపంచంలో అగ్రగామిగా నిలిచారురీయూనియన్ లో చెరకుతోటల్లో పనిచేసే బానిసల జీవనం కడు దయనీయంగా ఉండేదివారు రోజుకు దాదాపు ఇరవైగంటలు పనిచేసేవారుస్త్రీలు కొద్దిసంఖ్యలో ఉండేవారుకుటుంబాలు ఉండేవి కావుఆ కారణాలవల్ల మరణ రేటు అధికంగా ఉండటంతో నిరంతరం బానిసలకొరత ఉండేదిబానిసలను చేరవేసే నౌకలు  Amity”, Liberte వంటి గొప్ప పేర్లు కలిగిఉండటం దురదృష్టకరం.

యానాంలో ఫ్రెంచి వారు జరిపిన బానిస వ్యాపారానికి ఆధారాలు 1762 లో యానాం సమీపంలో కల ఇంజరం అనే గ్రామంలో నివసించే Mr.Yates అనే ఓ బ్రిటిషర్, పాండిచేరీలోని ఫ్రెంచి జనరల్ (Colo De Frene) కి వ్రాసిన ఓ లేఖ లో దొరుకుతాయి.  (Ref: Asiatic Jour. Vol. 26 No.156 –  printed in 1828 -  Chapter Slavery in India,  Page Nos 665 to 670).

యేట్స్ ఎపిసోడ్ (1762) బానిసలను  ఎక్కించుకొనే ఫ్రెంచి నౌకలు కోరంగి నుంచి బయలుదేరే తారీఖు దగ్గర పడేకొద్దీ,   బానిసలను సరఫరా చేసే మధ్యవర్తులు రకరకాల పద్దతులకు పాల్పడేవారుకొంతకాలం క్రితం ఈ ప్రాంతంలో కరువు విలయతాండవం చేయటం వల్ల తిండిలేక చచ్చిపోవటం కంటే బానిసగా బతకడమే మేలనే ఉద్దేశ్యంతో ప్రజలుండేవారుకానీ ప్రస్తుతం కొద్దో గొప్పో తిండి గింజలు దొరికే పరిస్థితి ఉండటంచే, బానిసల సేకరణ వారికి కష్టమై హింసాత్మక పద్దతులకు పాల్పడటం మొదలెట్టారుయానాం వీధులలో తిరిగే యాచకులను, యానాంలో సరుకుల కొనుగోలు కోసం వచ్చిన ఇతర గ్రామస్థులను పట్టి బంధించి, రహస్య ప్రదేశాలకు తరలించి అక్కడి నుంచి రాత్రివేళలలో ఫ్రెంచి నౌకలలోకి ఎక్కించేవారుఈ వ్యక్తులను వారికుటుంబాలనుండి అతి కిరాతకంగా విడదీయటం అనేది ఆయా ఫ్రెంచి నౌకల యజమానులైన కొద్దిమంది ఫ్రెంచి వారి కనుసన్నల్లో జరిగేది.

అలా సాగిన యేట్స్ అభియోగాలను సమర్ధిస్తూ అయిదుగురు ఇంజరం వాస్థవ్యులు లిఖిత పూర్వకంగా దృవీకరించారువీరిలో బొండాడ వెంకటరాయలు అనే ఓ వైశ్యుడు వ్రాసిన లేఖ ఈ ఉదంతంపై మరింత వెలుగును ప్రసరింపచేస్తుంది.

బొండాడ వెంకటరాయలు, ఫ్రెంచి ఈస్ట్ ఇండియా కంపెనీచే గుర్తింపుపొందిన ఒక యానాం వ్యాపారిఈయన తన ఉత్తరంలో, M. de Mars, M. La Blanche  మరియు M. Ellardine అనే ముగ్గురు ఫ్రెంచినౌకల యజమానులు, యానాం నుంచి బానిసలను కొనుగోలు చేయటానికి మధ్యవర్తులను ఏర్పాటుచేసుకొని వారిద్వారా యానాంలోని ముష్టివారిని, పొరుగూరివారిని బలవంతంగా నిర్భందించి కోరంగి రేవులో నిలిపిన వారి నౌకలలోకి ఎగుమతి చేయిస్తున్నారని -  అంతే కాక యానాం చుట్టుపక్కల గ్రామాలకు మనుషులను పంపించి, అక్కడి కూలీలకు, దర్జీలకు  పని ఇప్పిస్తానని నమ్మబలికి వారిని యానాం తీసుకువచ్చి బంధించి, రాత్రివేళలలో ఎవరికీ తెలియకుండా వారిని నౌకలలోకి తరలిస్తున్నారనీ -   ప్రతిఘటించే వారి నోటిలో గుడ్డలు కుక్కి లేదా సారాయిని బలవంతంగా తాగించి ఆ నిస్సహాయస్థితిలో వారిని నౌకలలోకి మోసుకుపోవటం జరిగుతుందనీ...... అంటూ ఆనాటి సంఘటనలను వర్ణించాడు.

ఆతేరు గ్రామానికి చెందిన ఒక బ్రాహ్మల అబ్బాయినినీలపల్లి చెందిన ఒక భోగం పిల్లని, ఏ వూరో తెలియని ఓ బ్రాహ్మణ అమ్మాయిని కూడా ఈ విధంగానే కిడ్నాప్ చేసి నౌకలోకి తరలించారుఈ ముగ్గురి విషయం తన మిత్రుల ద్వారా తెలుసుకొన్న యానాం పెద్దొర (సొన్నరెట్) ఆ నౌక కెప్టైన్ కు ఆదేశాలు జారీ చేసి వారిని విడుదల చేయించాడు
అలా  ఆ ఫ్రెంచి నౌక ఎక్కి తిరిగొచ్చిన ఆ ముగ్గురూ, ఆ నౌకలో అనేకమంది కూలీలు, కుటుంబ స్త్రీలు, కొద్దిమంది బ్రాహ్మణులు ఉన్నారని చెప్పటంతో ఆగ్రహించిన స్థానికులు  ఆ మిగిలిన వారిని కూడా విడిపించమని సొన్నరెట్ ను అడగడం జరిగిందికానీ సొన్నరెట్ ఏ రకమైన హామీ ఇవ్వకపోవటంతో, నౌక బయలుదేరే తారీఖు దగ్గరపడుతుండడంతో, పొరుగునే ఉన్న బ్రిటిష్ అధికారులను వారు ఆశ్రయించారు.
ప్రజలవద్దనుండి వచ్చిన విజ్ఞప్తులపై విచారణ నిమిత్తం యేట్స్ యానాం వెళితే చాలామంది యానాం వాస్థవ్యులు ఆయనను చుట్టుముట్టి, సుమారు మూడువందలకు పైగా వారి బంధువులను ఎత్తుకుపోయారని గగ్గోలు పెడుతూ తమ గోడును వెళ్లబోసుకొన్నారుచిన్నపిల్లలను కూడా విడిచిపెట్టలేదని కన్నీరు మున్నీరై విలపించారుఈ మొత్తం ఉదంతంపై సొన్నరెట్ ను వివరణ కోరగా అలాంటిదేం లేదని మొదట్లో వాదించి, చివరకు కావాలంటే నౌకను తనిఖీ చేసుకోవచ్చునని అనుమతినిచ్చాడు. దరిమిలా ఒక ఫ్రెంచి అధికారి, స్కోబీ అనే ఒక ఇంగ్లీషు అధికారి పర్యవేక్షణలో ఒక కమిటీ ఏర్పడి నౌక తనిఖీ కి కోరంగి వెళ్ళారుకానీ నౌక కెప్టైన్ వీరిని లోనికి రాకుండా అడ్డుకొని, ఏవిధమైన వివరణలు ఇవ్వకుండా కమిటీని వెనక్కు పంపించేసి కోరంగి రేవునుండి నౌకతో సహా జారుకోవటం జరిగింది.  

యానాం పెద్దొర తన విచక్షణాధికారాలను ఉపయోగించి నౌకను నిలుపు చేసి ఉన్నట్లయితే ఆ స్థానికుల తరలింపు నివారింపబడి ఉండేదని యేట్స్, Major Wynch అనే బ్రిటిష్ అధికారికి వ్రాసిన లేఖలో పేర్కొన్నాడు.

పాండిచేరీలోని ఫ్రెంచి గవర్నర్ (M.De Fresne) ఈ విషయాలనన్నీ బ్రిటిష్ గవర్నర్ జనరల్  (Lord Cornwallis) ద్వారా తెలుసుకొని, ఇలాంటి వ్యవహారాలకు పాల్పడే వారిని అరష్టు చేసి పాండిచేరీ పంపవలసినదిగా ఆదేశాలు జారీ చేసాడుఅంతే కాక వీటిని నియంత్రించలేని తన నిస్సహాయతను కూడా (సరైన పర్యవేక్షణా యంత్రాంగం లేకపోవటం చే) తెలియ చేసాడుఅలాంటి అనుమతులకోసమే ఎదురుచూస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం వెంటనే కోరంగి, భీమిలిపట్నం ల వద్ద సిపాయిలను నియమించి, తీరప్రాంతంలో ఫ్రెంచి వారు జరిపే దారుణ బానిసవ్యాపారాన్ని అరికట్టటానికి పూనుకొంది.

యానాం పెద్దొర సొన్నరెట్ మాత్రం ఒక లేఖలో “ఇంగ్లీషు వారు కూడా ఈ బానిసవ్యాపారంలో ఉన్నారనీఒకసారి ఓ ఇంగ్లీషు నౌకలో బానిసలుగా తరలింపబడుతున్న 12 మంది యానాం వాసులను తాను విడిపించానని” చెప్పటం ఈ మొత్తం ఉదంతానికి కొసమెరుపు.

1793 నుండి1816 వరకు యానాం బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండటం వల్ల, ఆ కాలంలో యానాంలో జరిగిన విషయాలు తెలియరావు.
  ఫ్రెంచి వారు చేసే ఈ బానిస వ్యాపారంపై బ్రిటిష్ వారి పహారా ఎంతెలా ఉండేదో 1820 లో జరిగిన ఒక సంఘటన తెలియచేస్తుంది.

La Jeune Estele అనే ఫ్రెంచి నౌకను, బ్రిటిష్ గస్తీ పడవలు వెంబడించగా ఆ నౌక కెప్టైన్ కొన్ని పీపాలను సముద్రంలోకి విసిరేయటం మొదలెట్టాడుఅలా విసిరేసిన ఒక్కో పీపాలో 12 నుండి 14సంవత్సరములు వయసుకలిగిన బానిసలు ఉండటం పట్ల యావత్ ప్రపంచం నివ్వెర బోయిందిఈ సంఘటన తరువాత బ్రిటిష్ వారి కాపలా మరింత ఉదృతమైంది.

అయినప్పటికీ ఈ కాలంలో 3211 మంది కూలీలలు పంతొమ్మిది నౌకలలో యానాం నుంచి  రీయూనియన్ కు పంపించటం జరిగిందివీరిలో అధికశాతం ఇంగ్లీషు టెరిటరీనుంచే కావటం గమనార్హం  (Article of Mr Jacques Weber: “L’emigration indienne vers les colonies francaises”)

ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నడుమ ఫ్రెంచి ప్రభుత్వం పాత పద్దతులకు స్వస్థి పలికి కార్మికుల సేకరణ కొరకు కొత్తవిధానాన్ని ప్రవేశపెట్టింది.

యానాంలో కాంట్రాక్టు పద్దతిపై కార్మికుల ఎగుమతి

రీయూనియన్ లోని చెరుకు తోటలలో పని చేయటానికి కార్మికుల అవసరం రోజు రోజుకూ పెరగటం, ఇండియానుంచి కార్మికులను తీసుకోవటానికి పొరుగు రాజ్యాన్నేలే బ్రిటిష్ వారు ఎక్కడికక్కడ అనేక ఆంక్షలు విధించటం వల్ల ఫ్రెంచి ప్రభుత్వం 1828 లో కాంట్రాక్టు పద్దతి ద్వారా కార్మికులను రిక్రూట్ చేసుకోవటం మొదలెట్టిందిఫ్రెంచి ప్రభుత్వం నియమించిన ఏజెంటుకు, ఇక్కడి కార్మికునకు మధ్య జరిగే  కాంట్రాక్టు లో ఈ క్రింది హామీలుండేవి
1.       కాంట్రాక్టు కాలపరిమితి మూడు సంవత్సరాలు
2.       ప్రతి కూలీకి నెలకు ఏడు రూపాయిల జీతం ఉంటుంది.
3.       తిండి వసతి ఆరోగ్య సదుపాయాలు కల్పించబడతాయి.
4.       వారి వారి ఆచారాలను, మతపరమైన సాంప్రదాయాలను గౌరవించటం జరుగుతుంది.
5.       రాను పోను ఖర్చులను మరియు కాంట్రాక్టు ముగియకముందే అనారోగ్య లేదా ఇతర కారణాలవల్ల స్వదేశానికి వెళ్లాలనుకొనేవారి తిరుగుప్రయాణం ఖర్చులను కూడా యజమానే భరిస్తాడు.
6.       ప్రతీ కార్మికునకు ముందుగా మూడు నెలల జీతం అడ్వాన్సు గా ఇవ్వబడుతుంది.
7.       పనిలో చేరాకా ఇచ్చే జీతంలో మూడు రూపాయలకు కార్మికుని చేతికి, మిగిలిన నాలుగు రూపాయిలు ఇక్కడ అతని కుటుంబసభ్యులకు నెల నెలా అందించబడుతుంది.

కాంట్రాక్టు లోని చివరి రెందు హామీలకు యానాం వాసులేకాక పొరుగు ప్రాంతాల వారు కూడా ఆకర్షితులై అధిక సంఖ్యలో ముందుకొచ్చారు. ఆ విధంగా కంట్రాక్టు కుదుర్చుకొన్న మొత్తం 268 మంది కార్మికులు 7 ఆగష్టు, 1829 న యానాం నుంచి రీయూనియన్ కు నౌకలో బయలు దేరారు. వారిలో 197 మంది దళితులు, 27 మంది ముస్లిములు, పదముగ్గురు చేనేతకారులు, పదముగ్గురు రైతులు, అయిదుగురు ఫిషర్ మెన్, ఇద్దరు అగ్రకులస్థులు, (మిగిలిన వారి వివరాలు తెలియవు) ఉన్నారు. (రిఫరెన్స్: Personal state of Indians embarking at Yanam for Bourbon (రీయూనియన్ కు మరో పేరు) from 16 March 1828 to 6 August 1829, COR.GLE, India V.29)

యానాంలోని వీరి కుటుంబాలకు నెల నెలా ఇచ్చే చెల్లింపులను, రీయూనియన్ లోని వీరి యజమాని అయిన Mr.Argand  తరపున చెల్లిస్తానని, యానాంలో ఉండే ఫ్రెంచి ఏజెన్సీ De.Courson and Co వారు హామీ ఉంటారుమొదటి వాయిదా డిశంబరు 1829 నాటికి చెల్లించవలసి ఉందికానీ జనవరి వచ్చేసిన వారికి ఒక్కపైసా కూడా ముట్టదువారందరూ యానాం పెద్దొర అయిన Mr. De. Lesparda వద్దకు వచ్చి విన్నవించుకొంటారు.  “ఆర్గాండ్ నుంచి మాకేమీ డబ్బులు ముట్టలేదు కనుక మేము వీరికి ఏ రకమైన చెల్లింపులు చేయలేము” అని కుర్ సన్ అండ్ కో వారు చేతులెత్తేయడంతో- ఎనిమిదిరోజులుగా పస్తులతో పెద్దొర గారి బంగ్లా వద్ద ఎదురుచూస్తున్న ఆ కార్మికుల కుటుంబాలకు యానాం పెద్దొరే 17 జనవరి, 1930 నుండి కొద్దిపాటి చెల్లింపులు చేయటం మొదలెడతాడు.

ఇదిలా ఉండగాఅక్కడ రీయూనియన్ లోని చెరుకు తోటలు ఆ సమయంలో భారీ నష్టాలను ఎదుర్కోవటంతో, ఈ కార్మికులు సంతృప్తి కరంగా లేరనే సాకు చూపి ఇక్కడ కుదుర్చుకొన్న ఆర్ధిక ఒప్పందాలను నెరవేర్చలేమని తెగేసి చెప్పి, వీరిని  తిరిగి ఇండియా పంపించివేసారు అక్కడి తోటల యజమానులుఆవిధంగా యానాం లో జరిగిన కాంట్రాక్టు కార్మికుల ఎగుమతి వ్యవహారం అర్ధాంతరంగా ముగిసిపోయిందికంట్రాక్టు పద్దతి లో కల అమోదయోగ్యమైన అంశాలకు ఆశ్చర్యపడిన  బ్రిటిష్ వారు, ఈ రకపు కూలీల తరలింపును ఏవిధంగానూ ఆటంక పరచలేకపోయారు. అయినప్పటికీ ఈ పద్దతి విజయం సాధించలేక పోవటంతో మరలా మరో ఇరవై ఏళ్ల వరకూ యానాం నుంచి ఏవిధమైన వలసలూ జరిగినట్లు తెలియరాదు

కూలీల సేకరణలో ఫ్రెంచ్ వారి పై  బ్రిటిష్ వారి ఆంక్షలు: 1849
కూలీల సేకరణ, వారి తరలింపు అనేది అత్యంత లాభదాయకమైన వ్యాపారంగా మారటంతో పాండిచేరీ, కారైకాల్ చాంబర్ ఆఫ్ కామర్స్ లలో ఇదొక ప్రధాన పాత్రను వహించటం మొదలైందిఫ్రెంచ్ ప్రభుత్వం కూడా " సొసైటీ ఫర్ ఎమిగ్రేషను" అనే సంస్థకు ఈ విషయంలో సర్వాధికారాలు కట్టబెట్టింది. ఈ సొసైటీ అధిపత్ ఐన జూల్స్ బెడియర్ ప్రెయరీ ఈ వ్యాపారంలో విపరీతమైన లాభాలార్జించి  అప్పటి ఫ్రెంచ్ ఇండియాలో అత్యంత ధనికుడిగా పేర్గాంచాడు. ఒకానొక దశలో పాండిచేరీ, కారైకాలలో కూలీలు ఇక దొరకని పరిస్థితి రావటంతో, బెడియర్ కళ్ళు యానాం పై పడతాయిదరిమిలాయానాం లో కూలీల సేకరణ జరుపుకోవటానికి అనుమతిస్తూ ఫ్రెంచ్ ప్రభుత్వం  1 సెప్టెంబర్ 1849 ఉత్తర్వులు జారీ చేసి, అప్పటి యానాం పెద్దొర, జోర్డైన్ కు రెండువేల పాస్ పోర్ట్ లను పంపిస్తుంది. (రిఫరెన్స్: India card 464, D.591, and the article of Jacques Weber)
లె పికార్డ్ అనే ఫ్రెంచ్ నౌక లో బెడియర్  తన మంది మార్బలంతో11 సెప్టెంబర్ 1849 న పాండిచేరీలో బయలుదేరి  14 సెప్టెంబరుకు యానాం చేరుకొన్నాడుఈ ప్రాంతమంతా ఘోరమైన వరదలవల్ల జనజీవనం అస్తవ్యస్థమైన్ ఉండటం వల్ల   వారికి కూలీల సేకరణ పెద్ద కష్టం కాలేదు30 సెప్టెంబరు కల్లా మొదటి దఫా కూలీల సేకరణ పూర్తయ్యింది.   వారికి (అరవై మంది) యానాం పెద్దొర  జోర్డైన్  సంతకం చేసిన పాస్ పోర్టులు  జారీ చేయబడ్డాయి. వీరందరినీ కోరంగి రేవులో ఉన్న ఫ్రెంచ్ నౌకపైకి చేరుస్తుండగా మొదలైంది అసలు కధ.
1 సెప్టెంబర్ న బ్రిటిష్ అధికారి ఒక కానిస్టేబుల్ ని వేసుకొని వచ్చి ఈ కూలీలు స్వచ్చందంగా వెళుతున్నారా లేక బలవంతంగా తరలించబడుతున్నారా అన్న విషయం తెలుసుకురమ్మని  రాజమండ్రి కలక్టరు జారీ చేసిన ఒక ఉత్తర్వును చూపి, ఆ అరవైమంది కూలీలను ఒక్కక్కరినీ విచారించటం మొదలెట్టాడు.  2 సెప్టెంబరున కలక్టరు ప్రెన్ డెర్గాస్త్ గారే స్వయంగా వచ్చి కూలీలను ప్రశ్నించి, వారందరూ మేము ఇష్టపూర్వకంగానే వెళుతున్నామని చెపుతున్నా  సంతృప్తి చెందకబ్రిటిష్ పౌరులకు   కోరంగి రేవు నుండి విదేశాలకు వెళ్లే అనుమతి లేదన్న కారణంచే బెడియర్ తో సహా అందరినీ జగన్నాయకపురం తరలించి, అరెష్టు చేయించాడువారిని 10 సెప్టెంబరు న బ్రిటిష్  ప్రభుత్వం విడుదల చేసింది.
అవమానభారంతో పాండిచేరి వెనుతిరిగిన బెడియర్ఫ్రెంచి ప్రభుత్వం కూలీలకు జారీ చేసిన  పాస్ పోర్టులను, మరియు ఇతర చట్టపరమైన అనుమతులను బ్రిటిష్  కలక్టరు పట్టించుకోకపోవటం వల్ల తనకు జరిగిన నష్టానికి 180,000 ఫ్రాంకుల పరిహారాన్నిప్పించమని ఫ్రెంచి ప్రభుత్వాన్ని కోరతాడు.   కోరంగి రేవును తటస్థ రేవుగా(బ్రిటిష్ మరియు ఫ్రెంచి నౌకల ప్రయాణానికి) ఉంచాలని పూర్వం ఫ్రెంచి మరియు బ్రిటిష్ వారు చేసుకొన్న ఒప్పందాలను బ్రిటిష్ వారు ఉల్లంఘించారని  ఆరోపిస్తాడు కూడా.  ( దీనికి స్పందిస్తూ ఆ ఒప్పందాలేమిటి అని బ్రిటిష్ వారు అడిగినప్పుడు ఫ్రెంచి వారు ఏమీ చూపలేకపోవటం వల్ల కోరంగి రేవు పూర్తిగా బ్రిటిష్ వారి ఆధీనంలోకి పోవటం ఆ తరువాత జరిగిన ఒక దురదృష్టకర పరిణామం ఫ్రెంచివారికి సంబందించి).
బెడియర్ వంటి పెద్ద వ్యాపారస్తుడికే అంత అవమానం జరిగిన తరువాత, పాండిచేరీలోని మరే ఇతర వర్తకులు యానాం లో కూలీల సేకరణ జరపటానికి  సాహసించలేదు మరో పదేళ్లవరకూ

బ్రిటిష్-ఫ్రెంచ్ ప్రభుత్వాల ఒప్పందం 1861
బెడియర్ అవమానోదంతం ఫ్రెంచి ప్రభుత్వాన్ని కుదిపివేసింది. ఫ్రెంచి రాజ్యానికి గౌరవభంగం జరిగినట్లు భావించింది.   దీనితో ఫ్రెంచి వారు బ్రిటిష్ ప్రభుత్వంతో పై స్థాయిలో చర్చలు జరిపి 1 జూలై 1861 న ఒక ఒప్పందాన్ని చేసుకొన్నారుదీనిప్రకారం బ్రిటిష్ వారి అన్నిపోర్టులనుంచీ ఫ్రెంచి వారికి కూలీలను పంపించుకొనే అధికారం పొందిందిఆయా సెంటర్లలో ఒక బ్రిటిష్ అధికారి ఉండి కూలీలను బలవంతంగా తరలించటం జరుగుతుందా అనే విషయాన్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు. (రిఫరెన్స్: Year book of India 1866, Pondy, Govt. printing)
ఆ విధంగా 1861 నుండి యానాంలో చట్టబద్దంగా  కూలీల తరలింపునకు మరలా తెరలేచింది1861 నుండి 1870 ల మధ్య యానాం నుండి సుమారు 3500 మంది కూలీలు రి యూనియన్ లోని చెరకుతోటలలో పనిచేయటానికి పంపించబడ్డారు. యానాం నుంచి బయలు దేరిన నౌకల కొన్నింటి వివరాలను ఈ క్రింది టేబుల్ లో చూడవచ్చు.

సంవత్సరం
నౌక పేరు
యానాం నుండి బయలుదేరిన తారీఖు
తీసుకెళ్లిన కూలీల సంఖ్య
1862
జియాన్నె అల్బెర్ట్
డిసెంబర్ 1862
382
1863
సుజెర్
ఏప్రిల్ 1863
354
 
కానోవా
ఆగష్టు 1863
421
1864
లోర్మెల్
2 ఫిబ్రవరి 1864
255
 
లోర్మెల్ 
6 జూన్ 1864
207
1865
సుజేర్
20 జనవరి 1865
226
1866
డాగుర్రే
8 జనవరి 1866
317
 
నార్తుంబ్రియన్
5 నవంబరు 1866
418

యానాం నుంచి బయలు దేరిన నౌకల వివరాలలో పైన ఉదహరించినవి కొన్ని మాత్రమేమొత్తంమీద ఇరవై సంవత్సరాల కాలంలో యానాం నుంచి బయలుదేరిన పద్నాలుగు నౌకలలో సుమారు 3500 మంది, (ఒక్క 1866 లోనే 1264 మంది),  పాండిచేరీ నుంచి 13000 మంది కలకత్తానుంచి 9000 మంది కూలీలు రీయూనియన్ కు ఎగుమతి అయినట్లు రికార్డుల ద్వారా తెలుస్తుంది.  (రిఫరెన్స్:Mme. Mazard in her memoire de Maitrise “L’emigration indienne vers les colonies francaises from 1860 to 1880)
ఈ కాలంలో కూలీల సేకరణ  మేస్త్రీల  ద్వారా జరిగేదివీరు యానాంలోనుంచే కాక చుట్టు పక్కల ప్రాంతాలనుంచి కూడా కూలీలను తీసుకువచ్చి, యానాంలో కల ఏజెంట్లకు అప్పచెప్పేవారు.   అలా తీసుకురాబడ్డ కూలీలకు ముందుగా మెడికల్ చెక్ అప్ జరిగేది. చిన్నచిన్న వ్యాధుల మందులు ఇచ్చేవారువృద్దులను, పిల్లలను తీసుకొనేవారు కాదుఈ ప్రక్రియ అంతా ఒక ఇంగ్లీషు అధికారి సమక్షంలో జరిగేది. ఆయనకు ఇలా ఎంపిక చేయబడిన కూలీలు తాము ఐచ్చికంగానే జీవనోపాధి కొరకు  రీయూనియన్ కు వెళుతున్నట్లు ఒక అంగీకార పత్రాన్ని రాసిచ్చేవారు. తదుపరి ఆకూలీలకు రెండునెలల జీతం (నెలకు అయిదు రూపాయిల చొప్పున మొత్తం పది రూపాయిలు) ముందుగా చెల్లించి, నౌక బయలు దేరే తారీఖు వరకు తిండి వసతులు కల్పించటం జరిగేదిఈ మొత్తం వ్యవహారంలో ఏ రకమైన నిర్భందాలు లేవని నిర్ధారించే బ్రిటిష్ అధికారికి, నెలకు రెండువందల యాభై రూపాయిల జీతం, సరఫరా చేసిన  ఒక్కొక్క కార్మికునకు మూడురూపాయిల చొప్పున మేస్త్రీలకు, ఇరవై నాలుగు రూపాయిల చొప్పున  ఫ్రెంచ్ ఏజెంటుకు ముట్టేది
1830  లోని కాంట్రాక్టు పద్దతిలో ఒక్కొక్క కార్మికునకు నెలకు ఏడు రూపాయిల జీతం కాగా, 1860 లో మాత్రం నెలకు అయిదురూపాయిలు మాత్రమేస్త్రీలకు పిల్లలకు నెలకు రెండురూపాయిల యాభై పైసల జీతం. అప్పటి కూలీ అడ్వాన్సుగా ఇరవై ఒక్క రూపాయిల నగదు (మూడునెలల జీతం) అది 1860 లో పది రూపాయిలేఅయినప్పటికీ ఈ పద్దతిన వెళ్లటానికి యానాం వాసులే కాకశ్రీకాకుళం, ఏలూరు, మచిలీపట్నం వంటి దూరప్రాంత వాసులు కూడా వచ్చేవారు1862 లో యానాంలో Quillet, Victor de Possel et Cie" పేరుగల  ఒక ఫ్రెంచ్ ఏజెన్సీ ద్వారా ఈ కూలీల లావాదేవీలు జరిగేవి
  ఇదేసమయంలో ఇంగ్లీషువారు చేపట్టిన  రైలు మార్గాల ఏర్పాటు, సాగునీటికాలువల తవ్వకం, (దవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం చివరిదశకు చేరుతుంది), బీడుభూముల్ని సాగులోకి తీసుకురావటం వంటి పనులకు తీవ్రమైన కూలీల కొరత ఏర్పడటంతో ఫ్రెంచి వారు సాగిస్తున్న ఈ కూలీల ఎగుమతి కి అనేక విధాలైన ఆటంకాలను కలిగించటం మొదలు పెడతారు.   మేస్త్రీలపై ఏడాదికి పది రూపాయిల టాక్స్ విధించటం, మేస్త్రీలకు లైసన్సులు జారీ చేసి వాటిని ప్రతి సంవత్సరం మద్రాసులో ఉండే బ్రిటిష్ ఉన్నతాధికారి కౌంటర్ సైన్ చేయాలన్న నిబంధన విధించటం వంటివి వాటిలో ముఖ్యమైనవి
1866 లో యానాం నుంచి ఆఖరు సారిగా కూలీలు పంపబడతారుతరువాత అలాంటి వ్యాపారం జరగదు. 1863 లో 775మంది,   1864 లో 621 మంది,   1865 లో 184 మంది కూలీలను తరలించగా, 1865 లో మాత్రం సుమారు  1500 మంది యానాంనుంచి  పంపించబడ్డారుదీనికి కారణం 1866-67 లలో ఒరిస్సాలో  భయంకరమైన కరువు విలయతాండవం చేయటం వల్ల చాలా మంది ప్రజలు, ఇలా వలసపోవటానికి సిద్దపడినట్లు భావించవచ్చు.
 ముగింపు
ఫ్రెంచి వారు తమ అవసరాల దృష్ట్యా కూలీలను తరలించటంలో, మొదట కొన్ని అనాగరిక పద్దతులను పాటించినా (యేట్స్ ఉదంతం), కాలానుగుణంగా మానవీయ దృక్పధంతో వ్యవహరించినట్లే కనపడుతుందిమరీ ముఖ్యంగా వీరు1828 లో ప్రతిపాదించిన కాంట్రాక్టు పద్దతి ఈనాటికీ ఆదర్శప్రాయమే అనటం అతిశయోక్తి కాదు. ఫ్రెంచ్ మరియు  బ్రిటిష్ వారు భారతదేశంలో వ్యాపారం చేయటానికి వచ్చారుఇరువురికీ మధ్య జరిగిన అనేక కలోనియల్ రాజకీయాలలో భాగంగా ఈ కార్మికుల ఎగుమతి విషయంలో ఫ్రెంచి వారిని బ్రిటిష్ వారు సమర్ధవంతంగా ఇరుకున పెట్టగలిగారు. యానాం నుంచి ఫ్రెంచి వారు కార్మికులను తరలించటం  అనేది ఈ ప్రాంతపు ఒక చారిత్రిక సత్యం
ఫ్రెంచి కరీబియన్ ద్వీపకల్పంలోని Sucre Island జజాభా ఏర్పడటంలో యానాం నుంచి 1849-1889 ల మధ్య ఎగుమతి చేయబడిన కూలీలు ప్రధాన పాత్రవహించినట్లు ఫ్రొ. జాబ్స్ వీబర్ అభిప్రాయపడ్డాడు. (రి. GHC Bulliten, 16 May, 1990, P.No. 134) అలా తరలించబడ్డ వారిలో ఎంతమంది తిరిగి వచ్చారో, ఎంతమంది అక్కడే స్థిరపడిపోయారో ........