Tuesday, March 8, 2022

పెన్నా సాహిత్య పురస్కారం 2020

 పెన్నారచయితల సంఘం వారు ప్రతి ఏటా ఇచ్చే పెన్నా సాహిత్య పురస్కారాన్ని 2020 సంవత్సరానికిగాను నేను రచించిన "మూడో కన్నీటి చుక్క" కవిత్వ సంపుటానికి ప్రకటించారు. ఈ అరుదైన గౌరవానికి పాత్రుణ్ణి చేసిన పెన్నారచయితల సంఘం వారికి కృతజ్ఞతలు.

18 డిసెంబరున ఏర్పాటు చేసిన వారిసభకు నెలకొని ఉండిన పరిస్థితుల కారణంగా ప్రయాణాలు చేసే ధైర్యం సరిపోక వెళ్ళలేకపోయాను. వారికి క్షమాపణలు చెప్పుకొన్నాను.
నెల్లూరు, పెన్నారచయితల సంఘంవారు నా కొరకు తయారుచేసిన మెమెంటో, అభినందనపత్రం, శాలువాలను ఈరోజు కాకినాడ వచ్చిన డా.సుంకర గోపాల్ ద్వారా అందచేసారు.
సభకు వెళ్లకుండా వాటిని తీసుకోవటానికి సిగ్గుగా అనిపించినా, వారి అభిమానానికి, ప్రేమకు నేను పాత్రుడిని కావటం చాలా సంతోషంగా అనిపించింది.
శ్రీ మోపూరు పెంచల నరసింహం, శ్రీ అవ్వారు శ్రీధర్ బాబు, శ్రీమతి తోట సులోచన, శ్రీ సుంకర గోపాల్ మరియు కార్యవర్గం అందరకూ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాను.
సన్మానపత్ర రచన చేసిన శ్రీ నల్లు రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదములు.
ఇప్పుడిప్పుడే ప్రపంచం కలుగులోంచి బయటపడి సమూహాల్లోకి తెరుచుకొంటోంది... వీరందరినీ భౌతికంగా కలిసే అవకాశం భవిష్యత్తులో కలుగుతుందంది ఆశిస్తున్నాను
భవదీయుడు
బొల్లోజు బాబా




No comments:

Post a Comment