హైందవేతరమతాలకు చెందిన వారిని శత్రువులుగా చూపించటం లేదా హేళనచేయటం ఇటీవల ఎక్కువగా జరుగుతోంది.
***
“ఆ అమ్మాయి తన క్రికెట్ విజయానికి తను నమ్మే దేవుడు కారణమని చెప్పటం తప్పు కాదు కానీ ఆ మాటలు చూపించి మతమార్పిడులు చేస్తారు” అంటాడొకడు ఆ మొత్తం ట్రోలింగ్ కు ప్రధాన వాదనగా.
ఒకరి విశ్వాసాలను మరొకరు మార్చుతారు అనే ఆలోచనే నీచమైనదనుకొంటాను. ఎవరు ఎవరిని మార్చగలరు?. ఇలా ఆలోచించేవారికి సాటి మనిషి స్వేచ్ఛ, చేతన, ఐచ్ఛికతల పట్ల ఎంత తక్కువ అభిప్రాయం ఉందో కదా! అనిపిస్తోంది. వీరికే తప్ప ఇతరులకు సొంత అభిప్రాయాలుండకూడదు, వీరికి నచ్చినట్లే వీరి కనుసన్నల్లోనే ప్రపంచం ఉండాలి కాబోలు.
"ఒక వ్యక్తి ఏమి మాట్లాడాలి, ఎలా విశ్వసించాలి అనేదానిని మేము నిర్దేశిస్తాము; మీరు మమ్మల్ని అనుసరించాలి" అనే ఈ పద్ధతి, పౌరులందరికీ సమాన విచక్షణ శక్తి ఉందని నమ్మకుండా, కొంతమంది సవర్ణులు చెప్పినట్లే అవర్ణులు వినాలి, లోబడి ఉండాలి అని చెప్పే మనుస్మృతి సూత్రాలను అమలు చేయడమే.
ఇది అప్రజాస్వామికము, ఫాసిజము అనే స్పృహకూడా ఉండదు చాలామందికి.
“మనచుట్టూ ఉన్న సమాజం అంతలా పాడయిపోయిందా?”
బొల్లోజు బాబా

No comments:
Post a Comment