Saturday, February 25, 2023

"ఫ్రెంచి ఇండియా స్వాతంత్ర్య సమర యోధుడు శ్రీ దడాల రఫేల్ రమణయ్య" పుస్తకావిష్కరణ



నిన్న యానాంలో నేను రచించిన "ఫ్రెంచి ఇండియా స్వాతంత్ర్య సమర యోధుడు శ్రీ దడాల రఫేల్ రమణయ్య" పుస్తకావిష్కరణ జరిగింది.
శ్రీ పొనుగుమట్ల విష్ణుమూర్తి గారు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సభకు శ్రీ దాట్ల దేవదానం రాజు గారు అద్యక్ష్యత వహించారు. శ్రీ ముమ్మిడి చిన్నారి సభను నిర్వహించారు. యానాం మున్సిపల్ కమీషనర్ శ్రీ ఖండవిల్లి రామకృష్ణగారు, యానాం సర్వశిక్షఅభయాన్ అధికారి శ్రీ కమిడిప్రభాకరరావు, ఇంకా మిత్రులు శ్రీ కె. శివశేషుబాబు, శ్రీ వెంకటరమణ, కోలా సత్య ప్రసాద్, నల్లం రాము, కేదార్ నాథ్, అశోక్ కుమార్, శ్రీ మధునా పంతుల చలపతి, శ్రీ దడాల కుటుంబసభ్యులు ఇతర మిత్రులు ఈ సభలో పాల్గొన్నారు.
ఇది నా పదకొండవ పుస్తకం- వీటిలో మూడుపుస్తకాలు, యానాం విమోచనోద్యమం (2006), ఫ్రెంచి పాలనలో యానాం 2012, శ్రీ దడాల రఫేల్ రమణయ్య (2023) యానాం చరిత్రకు సంబంధించినవే కావటం నాకు దక్కిన ఒక అరుదైన అవకాశంగా భావిస్తాను.
నా సాహితీ యానంలో నన్ను చేయిపట్టుకొని నడిపించిన గురువుగారు శ్రీ శిఖామణి గారిని, నాకు నేటికీ స్పూర్తిని ఇచ్చే శ్రీ దాట్ల రాజుగారిని నిత్యం స్మరించుకొంటాను.
.
ఈ పుస్తకాన్ని శ్రీ పల్లవి పబ్లికేషన్స్ వారు ప్రచురించారు. శ్రీ ఎస్. వి నారాయణ కాంటాక్ట్/pay phone number: 9866115655, వెల 100 రూపాయలు, పేజీలు 80. దయచేసి ఆదరించండి.

 
బొల్లోజు బాబా














































No comments:

Post a Comment