Monday, October 10, 2022

థేరీగాథలు

 thank you somuch Durgaprasad Avadhanam gaaru for your kindwords and crisp comments sir.

.
థేరీగాథలు
.
తొలితరం బౌద్ధ సన్యాసిల కవిత్వం
అనుసృజన:-బొల్లోజు బాబా
ముద్రణ:-chaaya Resources Center
.
థేరీ! అంటే అర్థం సన్యాసిని/భిక్షుణి/ రెండువేల ఐదువందల అరవై అయిదు సంవత్సరాల కింద బుద్ధుడు మహా పరినిర్వాణం పొందిన తర్వాత బిక్షువులు మహాకాశ్యాపథేరుని అధ్యక్షతన మగధ దేశపు రాజధాని రాజగృహనగర సమీపంలో సప్తపర్ణికా గుహలో సమావేశమై సుత్త, వినయాలను సంగ్రహించారు. సుత్త మపీటకలో బుద్ధుని బోధనలు ఉన్నాయి. వినయములు భిక్షుసంఘ నిర్మాణం, భిక్షువులు,భిక్షువులు, పాటించవలసిన నియమాలు ఉన్నాయి. సుత్తపిటకలో,దీఘనికాయ,మజ్జినికాయ,సంయుత్తనికాయ,అంగుత్తర నికాయ ,ఖుద్ధకనికాయలోని 18గ్రంథాలలో థేరీగాథులు ఒకటి.
ఈ పుస్తకం చదువుతున్నప్పుడు బుద్ధుడికి సంబంధించిన చాలా విషయాలు చాలా తేలికగా అర్థమవుతాయి బౌద్ధం భౌతికంగా లేకపోయినా భారతీయ సంస్కృతిలో అంతర్లీనంగా బౌద్ధమత ప్రభావం ఉంది, ఎక్కువగా
సోషల్ మీడియాలో బుద్ధ మతాన్ని ఖండిస్తూ వైదిక మతస్తులు, వైదిక మతాన్ని ఖండిస్తూ బౌద్ధ మతస్తులు ,వాళ్లు వినిపించే వాదనలు మనకి కనిపిస్తాయి బహుశా దీని వెనక వాళ్ళ జాతి ,మత ,కుల, రాజకీయ, వ్యాపారాల, లాభాలు అవసరాలు కోసం వాళ్లు అలా ఒకరిని ఒకరు ఖండించుకుంటారు, ఎవరి శాఖలలో ధర్మాలని వాళ్ళు మోస్తూ ఉంటారు!
గొప్ప విషయం ఏమంటే వివిధ విరుద్ధ నేపథ్యాల నుండి వచ్చిన ఆ స్త్రీలంతా ఒక సంఘంగా ఒక సోదర సమాజంగా మారగలటం మానగలటం. ఈ పుస్తకం లోని ప్రతి కవితలను ప్రతి కవియిత్రీ తాము మూడు విషయాలు తెలుసుకోగలిగాను అని ప్రకటిస్తుంది.
బుద్ధసారాన్ని తెలుసుకుంటానికి చాలా సులువైన మార్గం ఈ పుస్తకంలో ఉంది అందరూ చదవండి చదివించండి
దుర్గాప్రసాద్ అవధానం, నల్గొండ

No comments:

Post a Comment