Showing posts with label ఆకుపచ్చని తడిగీతం పుస్తక ఆవిష్కరణ. Show all posts
Showing posts with label ఆకుపచ్చని తడిగీతం పుస్తక ఆవిష్కరణ. Show all posts

Tuesday, December 22, 2009

ఆకుపచ్చని తడిగీతం - పుస్తకావిష్కరణ



నేను ఇంతవరకూ రాసిన కవితలతో కూడిన సంకలనాన్ని “ఆకుపచ్చని తడిగీతం” పేరిట తీసుకురావటం జరిగింది.


ఈ పుస్తకావిష్కరణ 21-12-2009 న యానాం డిప్యూటీ కలక్టరు గారైన శ్రీ నామాడి అప్పారావు గారి చేతులమీదుగా జరిగింది.

ఇది నా రెండవ పుస్తకం. మొదటిది మా యానాంలో జరిగిన విమోచనోద్యమం గురించి.

ఈ కవితలను పుస్తకంగా తీసుకురమ్మని సూచించిన బ్లాగ్మిత్రులకు ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను. గత రెండు సంవత్సరాలుగా మీరందరూ ఇచ్చిన ప్రోత్సాహమే నన్నిలా ముందుకు నడిపించిందని భావిస్తున్నాను.

ఈ పుస్తకానికి మా గురువుగారు శిఖామణి గారు మరియు దాట్ల దేవదానం రాజుగారు పరిచయవాక్యాలు వ్రాసారు. అఫ్సర్ గారు, దార్ల వెంకటేశ్వరరావు గారు అట్ట వెనుక భాగంలో వేసిన ఆత్మీయ వాక్యాలు వ్రాసారు.

పుస్తకం దొరికు చోటు bollojubaba@gmail.com

హైదరాబాద్ లో జరుగుతున్న బుక్ ఫెస్టివల్ లో పాల పిట్ట పబ్లికేషన్స్ వారి స్టాలులో ఉంచమని కొన్ని కాపీలు పంపాను.

ఈ సభయొక్క పత్రికా క్లిప్పింగులు ఇక్కడ చూడవచ్చును

భవదీయుడు
బొల్లోజు బాబా