Wednesday, March 6, 2024

ద్వారక గ్రాఫిక్స్

ఇటీవలి ద్వారకా పేరుమీద వచ్చిన ఒక వీడియో చూసి నిజంగా సముద్రగర్భంలో ఇన్ని నిర్మాణాలు ఉన్నాయా అని ఆశ్చర్యం కలిగింది. కొంచెం వెతకగా అవన్నీ ఫేక్ వీడియోలు, చిత్రాలు అని అర్ధమైంది.

 
అబద్దాలు పునాదులుగా రాజకీయాలు నడుస్తున్నాయి. నిజానికి వీటిని ప్రచారంలో పెట్టేవారందరూ రాజకీయ ఐటి సెల్ ఉద్యోగులు కావొచ్చు. వాళ్ళకు ఇది జీతాలు ఇచ్చే వ్యాపకం. కానీ ఈ ఉచ్చులో సామాన్యులు, కాస్తో కూస్తో ఆలోచనకలిగిన విద్యాధికులు కూడా పడటం శోచనీయం.
ద్వారక ఒకనాటి గొప్ప అంతర్జాతీయ ఓడరేవు. అరవైయ్యవ దశకంలో అక్కడ తవ్వకాలు జరిగాయి. సముద్రగర్భంలో మానవనిర్మిత రాతిదిమ్మలు, గోడలతాలూకు రాతి ఇటుకలు లభించాయి. ఇవి ఓడరేవులో పడవలను కట్టటానికి ఉపయోగించే రాతి లంగరులుగా గుర్తించారు. (చూడుడు ఫొటో)
నేలపై జరిపిన తవ్వకాలలో 9 వ శతాబ్దానికి చెందిన విష్ణుమూర్తి ప్రతిమలు కనిపించాయి. బాగా లోతుగా చేసిన తవ్వకాలలో క్రీస్తుపూర్వపు రెండువేలకు చెందిన కుండపెంకులు లభించాయి. ఇంతకు మించిన పురోగతి లేదు.
 
ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఫొటోలు గ్రాఫిక్ వి. మోసపూరితమైన ఒక నేరేటివ్ ని నిర్మించటానికి సృష్టించినవి.

ద్వారక సముద్రగర్భ పురావస్తుశోధనలో పాల్గొన్న శ్రీ పుట్టస్వామి గుడిగర్ అనే శాస్త్రవేత్త - సోషల్ మీడియాలో, న్యూస్ చానెల్స్ లో ప్రచారం అవుతున్న ద్వారకా ఫేక్ ఫొటోలు వీడియోల పట్ల ఇలా అన్నారు--

"మాతవ్వకాలలో ఏరకమైన ఆలయ శిథిలాలు కనిపించలేదు. ఈ దేశం అబద్ధాల ఊబిలో కూరుకుపోవడం చూస్తుంటే చాలా బాధగా ఉంది. దీన్ని రాజకీయాల కోసం ఉపయోగించడం మరింత దారుణంగా ఉంది".
 
బొల్లోజు బాబా






No comments:

Post a Comment