Sunday, July 4, 2021

Imported post: Facebook Post: 2021-07-04T09:51:02

పెన్నారచయితల సంఘం వారు ప్రతి ఏటా ఇచ్చే పెన్నా సాహిత్య పురస్కారాన్ని 2020 సంవత్సరానికిగాను నేను రచించిన "మూడో కన్నీటి చుక్క" కవిత్వ సంపుటానికి ప్రకటించారు. న్యాయనిర్ణేతగా వ్యవహరించిన ప్రముఖ కవి శ్రీ కొప్పర్తి గారు "హృదయమే వాహికగా ఆంతరిక ప్రపంచాన్నీ... అందులోని సున్నితమైన కలవరపాట్లనీ... ఉలికిపాట్లనీ కవిత్వీకరించి అంతర్లోకాలను తేజోమయం చేసినందుకు శ్రీ బొల్లోజు బాబా గారి "మూడో కన్నీటి చుక్క" కవిత్వ సంపుటిని, శ్రీ మెట్టా నాగేశ్వరరావు "మనిషొక పద్యం' కవిత్వ సంపుటిని ఎంపికచేస్తున్నట్లు తెలియచేసారు. సోదరుడు శ్రీ నాగేశ్వరరావుకు అభినందనలు. ఎంతో ప్రతిష్టాత్మకమైన పెన్నా సాహిత్యపురస్కారం అందుకోవటం ఆనందంగా ఉంది, పెన్నారచయితల సంఘ కార్యదర్శి శ్రీ అవ్వారు శ్రీధర్ బాబుకు, , న్యాయనిర్ణేత శ్రీ కొప్పర్తి గారికి హృదయపూర్వక ధన్యవాదములు. బొల్లోజు బాబా

No comments:

Post a Comment