Wednesday, November 2, 2022

ఇలతో అల చేసిన సంభాషణ – మణిబాబు “నేనిలా…తానలా” దీర్ఘకవిత

 ఇలతో అల చేసిన సంభాషణమణిబాబునేనిలాతానలాదీర్ఘకవిత

కొన్ని కవితావస్తువులు కవి జీవితంతో మమేకమైపోతాయివాటితో కవి సుదీర్ఘమైన ఆత్మైక ప్రయాణం చేసి ఉంటాడు. వస్తువుతో కవికి ఉన్న అనుభవాలతో అతని హృదయంనిండి పొంగిపొర్లుతూ ఉంటుందిఅలాంటి స్థితిని అనువదించటానికి  పాతిక ముప్పై పాదాలు సరిపోవుఇలాంటి నేపథ్యంలో కవి తన ఉద్వేగాలను దీర్ఘకవితగా మలుస్తాడుఅదొక అనివార్యమైన వ్యక్తీకరణ రూపంతీసుకొన్న వస్తువును దాని భిన్నపార్శ్వాలతో కవిత్వీకరించితనదైన ఒక దృక్కోణాన్ని వస్తువుకు ఆపాదిస్తూ  వ్రాసిన విస్త్రుతమైన రచననే దీర్ఘకవితగా నిర్వచించుకోవచ్చును.

కవి, విమర్శకులు శ్రీ అవధానుల మణిబాబు  సముద్రంతో తనకున్న అనుభంధాన్ని ఒక దీర్ఘ కవితగా మలచినేనిలాతానలాపేరుతో ఇటీవల వెలువరించారు. దీర్ఘకవితను వ్రాసేటపుడు ప్రణాళిక అవసరంలేనట్లయితే అతివిస్తరణ, శాఖాచక్రభ్రమణం కావ్యాత్మను పాడుచేస్తాయిమణిబాబు దీర్ఘకవితను చక్కని ప్రణాళికతో నడిపించాడు దీర్ఘకవితను మూడుభాగాలుగా విభజించుకొంటే మొదటి భాగంలో తన బాల్యంనుండి సముద్రంతో  తనకు ఉన్న జ్ఞాపకాలను తలపోసుకొంటాడురెండవ భాగంలో వర్తమానంలో సముద్రంతో చేసిన తాత్విక సంభాషణ ఉంటుందిమూడవ భాగంలో సముద్రం కవితో చేసిన సంభాషణలో పలికించిన పర్యావరణ స్పృహ చదువరిని ఆలోచింపచేస్తుంది.   నాస్టాల్జియా, సమకాలీనత, అన్యాపదేశంగా చెప్పిన హెచ్చరికా దీర్ఘకావ్యానికి సమగ్రతను తెచ్చిపెట్టాయిదీర్ఘకవితలకు సమగ్రత ఆత్మవంటిది

దండి తనకావ్యాదర్శంలో కావ్యంలో అష్టాదశవర్ణనలు ఉండాలంటాడు.  “నేనిలాతానలాదీర్ఘకవితలో వివిధ సందర్భాలలో చేసిన - నగరం, సముద్రం, రుతువు, సూర్యోదయం, సలిలక్రీడ, విప్రలంభం, వివాహం, కుమారోదయం, దూత్యం, నాయకాభ్యుదయం అనే పదిరకాల వర్ణణలను పోల్చుకోవచ్చును. సముద్రాన్ని వస్తువును స్వీకరించి రచనలు చేసిన శ్రీ అద్దేపల్లి, శ్రీ గరికపాటి, శ్రీ రామకృష్ణ శ్రీవత్స, శ్రీ గనారా వంటి తనపూర్వకవుల ప్రస్తావనకూడా చేయటం గమనించవచ్చుఇవి కాక ఆధునిక కావ్య లక్షణాలైన సామాజిక చైతన్యం,  పర్యావరణ కాలుష్యం పట్ల వ్యాకులత, చారిత్రిక స్పృహలు అద్భుతంగా పలికాయివీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొన్నప్పుడునేనిలాతానలాదీర్ఘకవిత అటు సాంప్రదాయక, ఇటు ఆధునిక లక్షణాలను పొదువుకొన్న ఒకమిని కావ్యంగా అనిపించక మానదు. . 

***

నేనిలాతానలాకావ్యంలో పైకి కవి తన ఎదుటగా ఉన్న సముద్రంతో చేసిన సంభాషణలా కనిపిస్తున్నప్పటికీ అది మానవజాతికి, ఆద్యంతరహితమైన సాగరానికి ఉన్న అనాది అనుబంధానికి అక్షరరూపం.  

ఎందుకు నీవంటే అపేక్షఅని కవి సముద్రాన్ని ప్రశ్నించినపుడు సముద్రం ఇలా సమాధానం ఇచ్చిందట

వెర్రివాడా!

నువ్వు నా సంక్షిప్త రూపానివి

నేను నీ సమగ్ర స్వరూపాన్ని

నేను అర్ణవం

నువ్వు అక్వేరియం.

నీ భాషలో

త్వమేవాహం- అంతే.
మనిషి సముద్రానికి సంక్షిప్తరూపం అనటం నవ్యమైన ఊహపడిలేచే లేదా లేచిపడే కెరటాలు, బడబాగ్నులు, ఉప్పెనలు, నిర్జన ఒంటరితనాలు, నిగూఢతా, నిర్మలతా మనిషి లేదా మానవజాతి లక్షణాలు కూడాను


సముద్రఘోషను కవులు భిన్న సందర్భాలకు భిన్నరకాలుగా భాష్యం చెప్పి తమ ఊహలకు ఊతంగా, ఆయా సందర్భాలను ఉన్మీలనం చేసేలా వాడుకొన్నారు.  ఈ దీర్ఘకవితలో “మేము తీరంపై రాసిన రాతల్ని, ముద్రల్ని ఎందుకు చెరిపేస్తావు నువ్వు” అని సముద్రాన్ని ప్రశ్నించినపుడు సముద్రం ఇలా బదులిచ్చిందట  


చెరిపిపోవటం కాదు

వాటిని నాలో దాచుకోవటం

భాషతెలియక ఘోషనుకొంటారు గానీ

నా శబ్దాలన్నీ మీ రాతల కలవరింతలే

మీ ఆటల తలపోతలే. ---    ఇదొక నవ్యమైన ఊహ. సముద్రఘోష అనేది, సముద్రతీరంపై మనం రాసుకొన్న రాతలు, ఆడుకొన్న ఆటలే అనటం చక్కని సందర్బోచిత నిర్వచనం.  చెప్పే విషయాలలో అన్వయసారళ్యత ఎంత తేటగా ఉంటే ఆ కవిత అంత బిగిగా ఉంటుందనటానికి చక్కని ఉదాహరణ ఇది.


ధనుష్కోటిలో

తేలుతున్న రాయిని చూసి

ప్రత్యేకత రాయిదా? నీటిదా?

ఆలోచిస్తూ

కిటికీలోంచి చీకటిని చూస్తూ

నిదరోతున్న రైలులో

ఒక్కడినే మెలకువగా ఉన్నపుడు

సాంద్రమైనదేదో వీడగలిగితే

తేలడం నీకైనా సాధ్యమే

బెండులా తేలిక కావాలంటే

గుండె మెత్తబరచుకో

చెవి దగ్గరకొచ్చి చెప్పిపోయావ్ గుర్తుందా…! … అంటూ సముద్రం తనతో చేసిన సంభాషణను తలపోసుకొంటాడు కవి ఒకచోట.  హృదయకాఠిన్యాన్ని తొలగించుకొంటే తేలికపడతాం, మార్ధవంగా మారతాం అనే ఒక గొప్ప ప్రాపంచిక సత్యాన్ని చెప్పటానికి “ధనుష్కోటిలో తేలుతున్న రాయి” అంటూ అంతే గొప్ప సాదృశ్యాన్ని తీసుకొన్నాడిక్కడ కవి. ప్రభోధాలను నేరుగా కాక పరోక్షంగా చెప్పటం సమకాలీన కవిత్వలక్షణం. అందుకే పాఠాన్ని వాచ్యంగా కాక ప్రతీకాత్మకంగా సముద్రం బోధపరచినట్లుగా చెపుతున్నాడు. చక్కటి శిల్పవ్యూహం ఇది


నువ్వో వ్యాపార కేంద్రం

రణరంగం

కార్య క్షేత్రం

విలాస స్థానం

ఏం కావాలో పట్టుకెళ్లడం వచ్చినవాడి సత్తా

చెంబుడు నీళ్లా

ఇన్ని గులకరాళ్ళా?

ఖనిజాలా? ఇంధనాలా?

మరో దేశంపై పెత్తనమా?//

నాడైనా నేడైనా

నీటిని నెగ్గినవాడే

నేలకు రాజు  --   పై వాక్యాలలో కవి చారిత్రిక దృష్టి ద్యోతకమౌతుంది. అవి చదివినపుడు అనేకానేక దృశ్యాలు మదిలో మెదులుతాయి.   జలగండానికి భయపడి చెంబుడునీళ్ళు తీసుకొని ఒడ్డునే పవిత్రస్నానం చేసే భక్తుడో; //గజఈతగాళ్ళు ముత్యాలను శోధిస్తూంటారుఓడల్లో  వ్యాపారం జరుతూంటుంది. పిల్లగాండ్రు  మాత్రం  గులకరాళ్ళను  సేకరించి మరలా విసిరేస్తూంటారు// అనే టాగూర్ వాక్యాలో; ఓడలు సముద్రాలమీద రహదార్లను గీస్తాయిఅంటూ భారతదేశానికి బ్రిటిష్ వారి రాకను వర్ణించిన కొప్పర్తి వాక్యాలో; భవిష్యత్తులో నీటికొరకు యుద్ధాలు జరుగుతాయన్న హెచ్చరికలో  గుర్తుకు రాకమానవుతక్కువ ఖర్చుతో లవణజలాల్ని త్రాగునీరుగా మార్చే ఆవిష్కరణకు నోబుల్ బహుమతి ఇవ్వటానికి ప్రపంచమిపుడు ఎదురుచూస్తుంది.  “నీటిని నెగ్గినవాడే నేలకు రాజువాక్యాలు కవి చారిత్రిక అవగాహనకు, సమకాలీన వాస్తవాలకు,  భవిష్యత్ దర్శనానికి అద్దంపడతాయి.  


కడుపులో ప్లాస్టిక్ నింపుకున్న

షార్క్ మృతదేహాలు

వలల నిండా జీవంలేని తాబేళ్ళు//

వేల అడుగుల క్రింద చేరిన

వ్యర్ధాలను తొలగించేది ఎవరు?

సరిదిద్దుకోలేని నీకు 

తప్పుచేసే హక్కెవరిచ్చారు?అంటూ సముద్రం పలికిన మాటలు మొత్తం దీర్ఘకావ్యానికి ఆయువుపట్టునేడు తెలుగులో పర్యావరణ విధ్వంసంపై వచ్చే కవిత్వం చాలా తక్కువ. దీర్ఘకవితలకు సంబంధించి కొల్లేరు విధ్వంసం పై ఎస్.ఆర్. భల్లం వ్రాసినకొల్లేరుదీర్ఘకవిత, అంతరించిపోతున్న పక్షులపై అద్దేపల్లి ప్రభు వ్రాసినపిట్టలేని లోకం సందర్భంలో ప్రస్తావించుకోదగినవిమణిబాబు వ్రాసిననేనిలాతానలాదీర్ఘకావ్యంలో సింహభాగం సాగర కాలుష్యాన్ని దానివల్ల కలిగిన దుష్పరిణామాలను శక్తివంతంగా ఆవిష్కరించింది. కనుక దీర్ఘకావ్యాన్ని పర్యావరణ కవిత్వంగా  భావించవచ్చు. 


ఆధునిక మానవుడు చేస్తున్న కాలుష్యం వలన మానవజాతి మనుగడ ప్రమాదంలో పడింది.  గ్లోబల్ వార్మింగ్ వలన హిమశిఖరాలు కరిగి, సముద్రమట్టాలు పెరిగి, భూమి అంతా జలమయం అయ్యే అవకాసం ఉందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.  ఇదొక సాంకేతిక అంశం.  ఇలాంటి వాటిని కవిత్వీకరించటం సులభం కాదు.  ఈ అంశాన్ని ఇలా అక్షరీకరిస్తాడీ కవి.


ఇదే కొనసాగితే

నా నుండి విడివడిన భూమి

మళ్ళీ నాలో కలవడం

మరెంతో దూరంలో లేదు

అపుడు

వేదన వినిపించేందుకు

నాకు మనిషి దొరకడు

తలబాదుకొనేందుకు

ఒడ్డు మిగలదు. --- ఒక ప్రాచీన మహాఖండం కాంటినెంటల్ డ్రిఫ్ట్ వల్ల నేడు ఉన్న భిన్న ఖండాలుగా విడిపోయిందని పాంజియా సిద్ధాంతం చెపుతుంది.  ఆ సిద్ధాంతాన్ని రేఖామాత్రంగా  స్పృశిస్తున్నాడిక్కడ కవి.  మానవులు ఇలాగే పర్యావరణ విధ్వంసాన్ని కొనసాగించినట్లయితే నానుండి విడిపడిన భూమి నాలో కలిసిపోతుంది అని హెచ్చరిస్తున్నాడు.  ఇంతవరకూ వ్రాసి వదిలేస్తే అదేమంత గొప్పవిషయం కాబోదు.  ఆ తరువాతి వాక్యాలే మణిబాబుని ఉత్తమకవి అని నిరూపిస్తాయి.  జలప్రళయం జరిగాకా సముద్రం మాట్లాడుకోవటానికి మనిషి ఉండడట, ఒడ్డూ మిగలదట. ఈ మాటల్ని సముద్రంతో అనిపించటం లోతైన కల్పన.  ఇక్కడ సముద్రాన్ని కవి ఎలా ఊహించుకొంటున్నాడు అని  ఆలోచిస్తే - ఒక తల్లి, ఒక స్నేహితుడు, ఒక గురువు ఇంకా ఒక నైరూప్య అనంత స్వరూపునిగా భిన్నరూపాల్లో దర్శనమౌతుంది. 

***


మొత్తం రచనను

ఇదంతా

నీలో దోసెడు నీళ్ళు తీసి

మరలా నీలోనే విడిచిపెట్టటంఅంటాడు కవి ఒకచోట. ఇది పైకి వినయంగా అనిపించినా త్వమేవాహం అని మొదట్లో అన్నమాటకు అందమైన ముక్తాయింపు.  “నేనిలాతానలాఅనే శీర్షికలో నేను ఇలను, తాను అల అనే గడుసైన శ్లేష ఉంది.

శ్రీ అవధానుల మణిబాబు కవిత్వంలో గహనమైన సిద్ధాంతాల చట్రాలుండవు. నిత్యం తనను జ్వలింపచేసే మానవానుభవాలకు తాత్విక పరిమళాలు అద్ది కవిత్వంగా మార్చటం ఇతని కవిత్వరహస్యం. జీవితానుభవాలను గ్రహించటంలో- సున్నితత్వం, కరుణ, అమితమైన ప్రేమ, హృదయ నైర్మల్యం ఇతని కవిత్వాన్ని హృద్యమైన అనుభవంలా మార్చుతాయి

రచయిత ఫోన్: 9948179437


బొల్లోజు బాబా



No comments:

Post a Comment