Tuesday, July 23, 2024

Stray thoughts...



రాణి శివశంకర గారి వాల్ పై ఒక చర్చలో నేను చేసిన కామెంట్లు ఇవి. ఒక చోట ఉంటాయని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.
 
1.దైవం మంత్రాధీనం, మంత్రం బ్రాహ్మనాదీనం అనే భావాన్ని అందరిలో ప్రవేశపెట్టి, రాజుతో సహా అందరినీ అధీనంలోకి తెచ్చుకొన్న బ్రాహ్మణుని పాత్ర చరిత్రలో అత్యంత ప్రభావశీలమైనది
2.అజ్ఞాతంలోంచి రామానుజుడు బయటకు వచ్చిన తరువాత లోకాన్ని ఆధీనంలోకి తెచ్చుకొని, ఎన్నో ఆలయాలని విష్ణ్వాలయాలుగా మార్చాడుగా..... ఏవేవో స్థానిక న్యుయాన్సెస్ ఉంటాయి వాటిని పరిగణలోకి తీసుకోవాలి అనే వాదనలు స్థూలంగా జరిగిన బ్రాహ్మణాధిపత్యాన్ని చరిత్రలోంచి చెరిపేయలేవు.

3. గుడి క్షత్రియ ప్రదానం. శూద్రులకు చెందినది కూడా. ఎగ్జాక్ట్లీ ఇదే జరిగింది.
రాజుని, ఇతర శూద్ర కులీనుల్ని ఆధీనం లోకి తీసుకోవటానికి గుడిని ప్రధానం చేసారు. దానిలోనికి ఇతరుల ప్రవేశం శాస్త్రాల ద్వారా నిషేదించారు. ఇది ఎంతెలా అంటే విగ్రహాన్ని సృజించిన శిల్పిని కూడా బయటే నిలబెట్టారు.
ఇది కాదా చరిత్రలో బ్రాహ్మణులు పొందిన ప్రాధాన్యత.

4. ఇప్పుడు నడుస్తున్న హిందుత్వా అంతా వైష్ణవమే. నిజానికి చరిత్రలొ కూడా అగ్రెస్సివ్ గా ఉన్నది వైష్ణవమే. శైవం సింధులోయనాగరికత నుంచీ ఉన్నప్పటికీ 5/6 శతాబ్దాలలో రూపుదిద్దుకొన్న వైష్ణవం ధాటికి నిలబడలేకపోయింది. ఎంత వీరశైవం పేరుతో ప్రతిహింస చేసినప్పటికీ.
బౌద్ధ, జైనాల స్థానాన్ని వైష్ణవం తీసుకొంది.

స్థూలంగా జరిగే ఒక క్రమం ఉంటుంది. ఇది చరిత్ర నడిచిన మార్గంగా అనుకోవచ్చు. దీనిలో బ్రాహ్మణ తంత్రం చే ఒక రకమైన హిందూ ఆధిపత్యం నడిచింది. ఇప్పటికీ నడుస్తూ ఉంది.
ఇక అంచులలో న్యుయాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు తెలివిగా హిందుత్వ చరిత్రకారులు, ఆ న్యుయాన్సెస్ చూపుతూ అదే నిజంగా మెయిన్ స్ట్రీమ్ చరిత్ర అని వాదిస్తున్నారు. మీరు కూడా చూడండి...గర్భాలయంలోకి ఎవరూ వెళ్ళరాదు (ఎందుకు ఆ రూలు వచ్చిందో ఆలోచించకుండా) అయినా శివాలయాల్లో వెళతారుగా అంటూ మినహాయింపులు చెబుతున్నారు.
శూద్రులు ఆలయాల్లో ఉండేవారు అని మరో వాదన తెచ్చారు. శూద్రుల ఆలయాలు నేడు బ్రాహ్మణీకరణ ఎందుకు జరుగుతున్నాయో మాట్లాడుతున్నారా?
మీరు చెబుతున్న న్యుయాన్సెస్ అంచులలో ఉంటాయి తప్ప ప్రధాన స్రవంతి చరిత్రను (బ్రాహ్మణాధిక్యత చరిత్ర) ప్రభావితం చేసినట్లు భావించలేం. వాటిని చూపి చరిత్ర ఇలా జరిగింది అని చెప్పబూనటం నా దృష్టిలో వక్రీకరణ.
నాకేమీ ఉద్యమశీలత లేదు. ఎవరూ మాట్లాడటానికి ఇష్టపడని విషయాలు నేను మాట్లాడతాను. అంతే. ఇదేమీ ఉద్యమం కాదు.
 
5. ఆ పార్టీ బలహీనపడినప్పాటికీ అది చొప్పించిన ద్వేషం, హింస ప్రజల బుర్రల్లోంచి తొలగిపోవటానికి కనీసం రెండు తరాలు పడతాయనిపిస్తోంది. నేటి యువతతో మాట్లాడండి. (నేను డిగ్రీ పిల్లలతో నిత్యం సవాసం చేస్తుంటాను) వాళ్ళు ఈ వాట్సప్ అబద్దాలను ఎలా విశ్వసిస్తున్నారో అర్ధమౌతుంది. ఇంత చిన్న వయసులో వాళ్ళు ఏర్పరుచుకొన్న అబిప్రాయాలు చాలబలమిన ముద్ర వేస్తాయి వారి జీవితాలపై.
ముస్లిమ్ ద్వేషం, హిందూ ఔన్నత్యం, మతం ప్రమాదంలో ఉంది అనే విషబీజాలు అంత తొందరగా నమసిపోతాయని అనుకోను.
 
ఇవన్నీ రాజకీయ ప్రేరేపితాలు అని చెప్పటంలో మనతరం విఫలమైంది.

బొల్లోజు బాబా

Saturday, July 13, 2024

ఈ క్షణం - Now by K. Satchidanandan


ఎక్కడో ఒక వ్యక్తి వేణుగానాన్ని వింటో
గొప్ప భావోద్వేగానికి గురవుతాడు
ఒక స్త్రీ నేలకు ఒంగి గడ్డి కోస్తుంది
ఒక చెట్టు రాలిపడే ఆకును చూస్తూ జాలిపడుతుంది
ఒక ఆవు అప్పుడేపుట్టిన దూడను తన ప్రేమనిండిన నాలుకతో
శుభ్రం చేస్తుంది.
ఒక సాలీడు తదుపరి ఎక్కడకు వెళ్ళాలి అనుకొంటు
గాలిలో తడుముకొంటుంది
కూర్చున్న నేను ఖాళీ పేజీని అలా చూస్తూ ఉంటాను

విడివిడి సంఘటనలే
ఈ ప్రపంచాన్ని ఉనికిలోకి తీసుకొస్తాయి.
ప్రేమ, రక్తం, యుద్ధం లతో చరిత్ర లిఖించబడినట్లు.
కానీ ప్రతీది దాని మూలాలవద్ద ఎక్కడో చిక్కువడి ఉంటుంది
రక్తము, భాష
పర్వతాలు, గిట్టలు,
నదులు పక్షులు
నక్షత్రాలు దేహాలు లా .

హొటల్ బేరర్ ప్లేట్లు, స్పూన్లు, ఫోర్కులు
మృత్యువనే డైనింగ్ టేబుల్ పై పడకుండా
ఎలా అయితే ఒంటిచేత్తో పట్టుకొంటాడొ అలాగే
ఎవరోఒకరు ఈ భూమిని ఆకాశాన్ని
పడిపోకుండా పట్టుకొంటూ ఉంటారు.
నా రాలిపడిన వెంట్రుకలు
గురుగ్రహం వైపు ఎగిరిపోతున్నాయి.
 
మూలం: Now by K. Satchidanandan
అనువాదం: బొల్లోజు బాబా

Sunday, July 7, 2024

On the branch of my Heart, by K.Satchidanandan

(రేప్ కు గురయి ఆత్మహత్య చేసుకొన్న ఇద్దరు బాలికల జ్ఞాపకాలతో )
.
ఆకులు కత్తిరించబడిన నా హృదయ తరుశాఖపై
రెండు చిట్టి మృతదేహాలు వేలాడి గాలికి ఊగుతున్నాయి
వాటి చిరిగిన గౌనులు పరాజితుల జెండాల వలే
చిరిగిపోయి, ముడుతలు పడి ఉన్నాయి.
లేతరక్తంతో నా అన్నం కంచం ఎర్రబడింది
నా హ్రుదయం వసంతకాల కలలను
కనటం మానేసింది.
ఎర్రగాకాల్చిన ఈటెలతో దానికి చేసిన రంద్రాలలోంచి
ఆ రేపిస్టులను చూసాను నేను:
అందరూ నా ముఖాన్నే కలిగి ఉన్నారు

On the branch of my Heart, by K.Satchidanandan
 
తెలుగు: బొల్లోజు బాబా