Saturday, August 28, 2021

పరిచయాలు, సమీక్షలు, ప్రసంగాలు - బొల్లోజు బాబా, సాహిత్యవ్యాసాలు

నేను ఇంతవరకూ చేసిన పుస్తక పరిచయాలు, సమీక్షలు, ప్రసంగ పాఠాలు అన్నీ ఒక చోట... .... .. మొత్తం 84 వ్యాసాలు, 450 పేజీలు

ఇక్కడ నుంచి డౌన్ లోడ్ చేసుకొనవచ్చును





Friday, August 27, 2021

తెరిగాథ –బౌద్ధ భిక్షుణిల ప్రాకృత గాథలు - పార్ట్ 6

 తెరిగాథ –బౌద్ధ భిక్షుణిల ప్రాకృత గాథలు - పార్ట్ 6

.
సాధారణ జీవనం సాగించే స్త్రీలు బౌద్ధమతం పట్ల ఆకర్షించబడటానికి కారణాలు వివిధ రకాలుగా ఉన్నాయి. స్వేచ్ఛ, జన్మరాహిత్యాన్ని కోరుకోవటం అనేక గాథలలో ప్రధానంగా కనిపిస్తుంది. ఆ తరువాత దుఃఖం, వియోగం నుండి విముక్తినొందటానికి కొందరు, ఐహిక సుఖాలపట్ల వైముఖ్యం పొంది మరికొందరు, క్రతువులు వ్రతాల పట్ల అయిష్టతతో ఇంకొందరు అంతవరకూ పాటిస్తున్న జైన లేదా వైదిక సాంప్రదాయాలను త్యజించి బౌద్ధాన్ని ఎన్నుకొన్నట్లు ఈ గాతలద్వారా తెలుస్తుంది.
బౌద్ధమతంవైపు ప్రజలు ఆకర్షితులవటం ఒకరకంగా గొప్ప చారిత్రిక చిక్కుముడి. మిత్తా, నందుత్తరలు చెప్పిన ఈ గాథలు ఆ చిక్కుముడిని కొంత విప్పే ప్రయత్నం చేస్తాయి.
మిత్తా
ఈమె క్షత్రియ కుటుంబంలో జన్మించింది. ఈమెకు మహాప్రజాపతి గౌతమి ఈమెకు దీక్ష ఇచ్చింది. కఠోర సాధనతో ఈమె అనతికాలంలోనే గొప్ప భిక్షుణిగా పేరుతెచ్చుకొంది.
ఉత్తమ జన్మ కొరకు
ఎన్నో ఉపవాసాలు ఉన్నాను
అష్టమి, ఏకాదశి, చతుర్ధశి, పౌర్ణమి
ఇంకా అన్ని పర్వదినాలలోను
కఠోరమైన ఉపవాసాలు ఉండేదాన్ని
ఈ రోజు
శిరోముండనం గావించుకొని
కాషాయవస్త్రాలు ధరించి,
ఒక పూటే తింటున్నాను
ఉత్తమ జన్మ పట్ల నా మనసులో
ఏ బెంగా లేదిక . (31-32)
***
ఇదే మోక్షమార్గమని వైదిక ధర్మం ఎన్నో క్రతువులను నిర్ధేశించింది. వాటిని పాటించకపోతే ఏమౌతుందో అనే ఆందోళన, భయం సహజం. పై గాథలో ముత్తకు అలాంటి ఆందోళనలనుండి ఉపశమనం దొరికింది. నిజానికి ఒకపూటే తింటూ మునుపటికన్నా ఎక్కువ నిరాహారంగా ఉన్నది మిత్త. బౌద్ధం జీవన్ముక్తి పేరుతో చెప్పిన జన్మరాహిత్యభావన మిత్తలాంటి విశ్వాసులను ఆకర్షించి ఉంటుంది. పరలోకం కాదు అన్నీ ఇక్కడే అనే ఆలోచనతో వారు బెంగ, ఆందోళనా లేని జీవనాన్ని సాగించి ఉంటారు.
***
.
నందుత్తర
నందుత్తర ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఈమె మొదట జైన మతాన్ని స్వీకరించి దేశమంతా తిరుగుతూ ఆధ్యాత్మిక చర్చలు చేస్తూ ఎంతో మందిని ఓడించింది.. ఒకరోజు బుద్ధుని ప్రియశిష్యుడైన మొగ్గల్లన తో చర్చల్లో పాల్గొని వాదనలో ఓడిపోయి బౌద్ధాన్ని స్వీకరించి అనతికాలంలోనే సంఘంలో గొప్ప సన్యాసినిగా పేరుతెచ్చుకొన్నది
.
అగ్నిని, సూర్యచంద్రులని
దేవతలను భక్తితో ఆరాధించాను
పవిత్రనదులలో స్నానమాచరించాను
ఎన్నో పూజలూ వ్రతాలు చేసాను
నేలపై పడుకొన్నాను
రాత్రిపూట ఉపవాసం ఉండేదానను
మరోపక్క
ఆభరణాలు ధరిస్తూ,
సుగంధద్రవ్యాలు పూసుకొంటూ
శరీరానికి తైలమర్ధనాలు చేయించుకొంటూ
విషయభోగాసక్తిని త్యజించలేదు
ఎప్పుడైతే సన్యసించానో
ఎప్పుడైతే ఈ దేహ నిజస్వరూపాన్ని దర్శించానో
కోర్కెలు, వాంఛలు, లాలసలు అన్నీ నశించాయి
సంకెళ్ళన్నీ తెంచబడ్డాయి
హృదయం ప్రశాంతంగా ఉంది. (87-97)
.
Satipatthana-Sutta లో మానవదేహం మరణించాకా ఏ విధంగా కుళ్ళిపోతుందో దశలుగా వర్ణించబడింది. కొత్తగా సన్యసించిన వారిని కుళ్ళిపోతున్న శవాలను మధ్య కూర్చుబెట్టి ధ్యానం చేయించే వారట. దాని వల్ల ఈ దేహంపై మమకారం, అనురక్తి నశించి కోర్కెలను జయించగలరని విశ్వాసం. పై గాథలో నందుత్తర “ఎప్పుడైతే ఈ దేహ నిజస్వరూపాన్ని దర్శించానో” అన్న వాక్యం బహుశా ఆ విధంగా క్రుళ్ళిపోతున్న మానవదేహాన్ని పరిశీలించి నా దేహమూ కూడా కొంతకాలానికి ఇంతే కదా అని వైరాగ్యాన్ని పొంది థేరీగా మారి ఆథ్యాత్మిక శాంతిని పొంది ఉంటుంది
గాథల అనువాదం, వ్యాఖ్యానం
బొల్లోజు బాబా
.
Ref.
Poems of the first Buddhist women by Charles Hallsey
THE FIRST BUDDHIST WOMEN By Susan Murcot

Monday, August 23, 2021

makineedi meeting

 శ్రీ మాకినీడి సూర్యభాస్కర్ బహుముఖీన ప్రజ్ఞకలిగిన వారు. కవిగా, కథకునిగా, విమర్శకునిగా, చిత్రకారునిగా వారు చేసిన సాహిత్యప్రయాణం ఎంతో ఫలవంతమైనది.

శ్రీ మాకినీడి సుమకవితాంజలి నుండి “అనేకులుగా” వరకూ చేసిన కవిత్వ ప్రయాణంలో -సామాజిక స్పృహ, మానవసంబంధాలు, తన లోలోపలకి చేసుకొన్న తవ్వకం- అనే మూడు అంశాలను ఒక అంతర్లయలా చేసుకొని వీరు మంచి కవిత్వాన్ని సృజించారు.
బొల్లోజు బాబా

Saturday, August 21, 2021

తెరిగాథ –బౌద్ధ భిక్షుణిల ప్రాకృత గాథలు - పార్ట్ 5

 తెరిగాథ –బౌద్ధ భిక్షుణిల ప్రాకృత గాథలు - పార్ట్ 5

.
రెండున్నరవేల ఏండ్ల క్రితం కొద్దిమంది స్త్రీలు స్వేచ్ఛగా , స్వైరిణిలుగా, సన్యాసినులుగా సంచార జీవనం సాగించినప్పటికీ అధికశాతం మంది వైవాహిక జీవితంలో ఉన్నారు. తధాగతుడు ఒక సందర్భంలో ఆదర్శవంతమైన భార్య తన భర్త కు తల్లిలా, సోదరిలా, స్నేహితురాలిలా, పరిచారికలా ఉండాలి అని చెప్పాడు .
పై లక్షణాలన్నీ కలిగి ఉన్నప్పటికీ వైవాహిక జీవితంలో విఫలమై సన్యసించిన ఇసిదాసి అనే అనే భిక్షుణి చెప్పిన గాథ ఆసక్తికరంగా ఉంటుంది.
ఇసిదాసి ఉజ్జయినిలో ఒక సంపన్న వర్తకుని ఇంట జన్మించింది. ఇసిదాసికి యుక్తవయసు వచ్చాక ఆమె తండ్రి సాకేతపురికి చెందిన మరో సంపన్న వర్తకుని కుమారుడికి ఇచ్చి వివాహం చేసాడు. ఇక అక్కడినుంచి ఇసిదాసి జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో ఓ గాథలో ఇలా చెప్పుకొంది.
.
నేను ప్రతిరోజు నా అత్తమామల పాదాలను
కళ్ళకద్దుకొని దినచర్య ప్రారంభించే దానిని
నా భర్త తరపువాళ్ళను చూడగానే
ఒణికిపోతూ లేచి నా స్థానాన్ని వారికి ఇచ్చేదానిని
వారికి నచ్చిన రుచికరమైన వంటకాలు వండిపెట్టేదానిని
ఉదయాన్నే నిద్రలేచి,
నా భర్తకు తలదువ్వి, అలంకరించేదానిని
స్వయంగా ఒండిన అన్నాన్ని తినిపించేదానను
తల్లి బిడ్డను సాకినట్లు నా భర్తను సాకేదానిని
ఇన్ని చేసినా నా భర్తకు నేను నచ్చలేదు
ఇసిదాసి తో కలిసి ఉండలేను అని నన్ను
మా పుట్టింటికి పంపించివేసాడు.
కొడుకుని పొందాను కానీ సౌభాగ్యాన్ని కోల్పోయాను
నా తండ్రి భారీ కట్నకానుకలిచ్చి
మరో ధనికుడైన వ్యాపారితో నాకు రెండో పెళ్ళి చేసాడు
ఇతను కూడా ఒక నెల కాపురం చేసి
నన్ను మా పుట్టింటికి పంపించివేసాడు
మా ఇంటికి భిక్షకు వచ్చిన ఒక సన్యాసికిచ్చి
నాకు మూడో పెళ్ళిచేసాడు మా తండ్రి
ఇతను కూడా ఒక నెల కాపురం చేసి
ఇసిదాసి తో కలిసి ఉండలేను అని నన్ను విడిచి వెళ్ళిపోయాడు.
ఇంతజరిగాక నేను చనిపోదామని నిశ్చయించుకొన్నాను
ఒక రోజు మా ఇంటికి జ్ఞానవంతురాలైన ఒక భిక్షుణీ వచ్చింది
ఆమె బోధనలతో నేను ఆథ్యాత్మిక మార్గాన్ని తెలుసుకొని
బౌద్ధదీక్ష తీసుకొని ధమ్మమార్గంలో ప్రయాణిస్తున్నాను (403-450 సంక్షిప్తరూపం)
.
థెరీ గాథలు ఆనాటి స్త్రీ జీవితాలను ప్రతిబింబిస్తాయి. దుర్భరమైన వైవాహిక బంధంలో ఇమడలేని ఇసిదాసి జీవితాన్ని తీసుకొన్నప్పుడు- అనాదిగా ఎంతటి విషాదం, దుఃఖం, నిస్సహాయతలు స్త్రీల జీవితాలతో పెనవేసుకొని ఎంతమందిని కబళించి ఉంటాయో ఊహింపశక్యం కాదు. ఇన్నిశతాబ్దాల తరువాత కూడా ఈ విషాదం పరిష్కృతమైందని చెప్పలేం. ఇలాంటి స్త్రీలకు కుటుంబం, మతం తప్ప ఎవరు ఓదార్చారు చరిత్రలో. ఇలాంటి విధివంచితుల కన్నీళ్ళని తుడవటంలో మతం పాత్రను విస్మరించలేం. ఇసిదాసి గాథద్వారా అప్పట్లో స్త్రీ పునర్వివాహం పట్ల సమాజానికి ఏ పట్టింపులులేవని తెలుస్తున్నా, రెండు మూడవ వివాహాలలో ఎక్కువ కట్నము, అయోగ్యుడైన భర్త లాంటి అంశాలు కూడా గమనించదగినవి.
***
.
1. థెరికా
థెరికా క్షత్రియకుటుంబంలో జన్మించింది. ఒకనాడు ఈమె బుద్ధుని బోధనలు విని ఆకర్షితురాలై, సంఘంలో చేరాలని నిర్ణయించుకొంది. భర్త అందుకు అంగీకరించని కారణంగా థెరికా గృహస్తుగా సంసారిక బాధ్యతలు నిర్వర్తిస్తూ తథాగతుని బోధనలు మననం కొంటూ జీవనం సాగించసాగింది. ఒకనాడు వంటింట్లో మంటలు చెలరేగగా థెరికాకు ప్రాణాపాయం తప్పింది. ఆ క్షణంలో మానవ జీవితం ఎంత అశాశ్వతమో అర్ధమై, భర్తను ఒప్పించి బౌద్ధ భిక్షుణిగా దీక్ష తీసుకొంటుంది. ఒకనాడు బుద్ధుడు ఈమెతో ఇలా అన్నాడట
.
థేరికా
ఇప్పుడు నీవు థేరీలలో కలిసావు
నీకు చిన్నప్పుడు పెట్టిన పేరు ఇన్నాళ్ళకు నిజమైంది
నీవు స్వయంగా కుట్టుకొన్న దుస్తులను కప్పుకొని
హాయిగా నిదురించు
నీ వాంఛలన్నీ కుండలో దాచిన ఆకుకూరల్లా
వడలి ఎండి పోతాయి ఇక. (1)
.
2. ముత్త
ముత్త (ముక్త) పేద బ్రాహ్మణకుటుంబంలో జన్మించింది. దుర్భరదారిద్ర్యం కారణంగా ఆమె తల్లిదండ్రులు ఈమెను ఒక గూనివానికిచ్చి వివాహం జరిపించారు. అనాకారితో వివాహం కన్నా వైవాహిక జీవితంలో ఎదురైన కష్టాలు ముత్త ను కృశింపచేసాయి. భర్త అనుమతితీసుకొని ఆమె బౌద్ధ ఆరామంలో చేరింది. నియమనిష్టలతో జీవనం సాగించి సంఘంలో భిక్షుణి హోదాను పొందింది.
నేను స్వేచ్ఛనొందాను
మూడు కుటిల విషయాలనుండి
నా భర్త, రోలు, రోకలి
నేను స్వేచ్ఛనొందాను
మూడు కుటిల విషయాలనుండి
జననం, మరణం, పునర్జన్మ
నేను స్వేచ్ఛనొందాను (11)
.
3.
దంతిక
కోసల రాజు వద్ద మంత్రిగా పనిచేస్తున్న ఒక బ్రాహ్మణుని కూతురు దంతిక. ఈమె యుక్తవయసులోనే బౌద్ధసన్యాసినిగా ప్రజాపతి గౌతమి శిష్యురాలిగా బౌద్ధదీక్ష తీసుకొన్నది. పరిపరివిధాల ప్రవహించే మనసుని స్వాధీనపరచుకోవటానికి సాధన చేయటమే మార్గమని, కఠోరసాధన ద్వారా ఎంతటి మృగప్రాయ చిత్తమైన మచ్చికకాక తప్పదని గొప్ప దుష్టాంతంద్వారా దంతిక తన గాథలో ఇలా చెప్పింది.
.
గృద్ధకూట పర్వతంపై ధ్యానం కొరకు వెళ్ళాను
అక్కడ ఒక ఏనుగు
నదిలోంచి నడుచుకొంటూ బయటకు వస్తోంది
పురుషుడొకడు ఆ ఏనుగును ఆపి
దానికి అంకుశాన్ని చూపాడు
అది ముంగాలు ముందుకు చాచింది
ఆ పురుషుడు దానిని అధిరోహించాడు
ఒక అడవి మృగం నా కళ్ళముందే
మానవునిచే మచ్చికకాబడింది
అది చూసాకా నాకు నమ్మకం వచ్చింది
అడవిలోకి వెళ్ళి సాధన మొదలుపెట్టాను. (48-50)
(ఇంకా ఉంది)
గాథల అనువాదం, వ్యాఖ్యానం
బొల్లోజు బాబా
.
Ref.
Poems of the first Buddhist women by Charles Hallsey
THE FIRST BUDDHIST WOMEN By Susan Murcot
No photo description available.
Gopal Sunkara, Marni Janakiram Chowdary and 74 others
10 comments
3 shares
Like
Comment
Share

Friday, August 20, 2021

#సంతకం #కవిత్వపరామర్శ

Thank you so much Vinodini Madasu gaaru for choosing my Book.
Eagerly awaiting the event.
Bolloju Baba
May be an image of Vinodini Madasu and text
#సంతకం #కవిత్వపరామర్శ
....................................................................
“ అస్తిత్వం అనేది
గొనె సంచిలో తీసుకెళ్ళి ఊరిచివర విడిచినా
తోకూపుకుంటూ వచ్చిచేరే పిల్లి పిల్ల లాంటిది
దాన్ని ప్రేమించటం నేర్చుకో
ఎన్ని కష్టాలు ఎదురైనా దాన్ని నిలుపుకో
ఈ ప్రపంచం
నిన్నెలా చూడాలనుకుంటుందో
అలా వేషం కట్టి
ఆత్మ లోకంలో అమ్ముడుపోకు
అబద్ధపు వేషం పదే పదే కట్టి
నువ్వే ఓ నిలువెత్తు అబద్ధంగా మారిపోకు
ఈ ప్రపంచం
ఏవి నీకు ఉండకూడదని ఆశిస్తుందో
అదే నీ అస్తిత్వం వాటిని కోల్పోకు
కర్ణుడు కవచ కుండలాలని కోల్పోయినట్లు.
ఇంకొకరి అభిప్రాయంగా ఉండేకన్నా
నువ్వే ఓ సిద్ధాంతంలా మారు ”
..................................................................................................
#వినోదినిమాదాసు #21_08_2021 #శనివారం రాత్రి 8 గంటలకు