Thursday, March 30, 2023

ప్రాకృత, సంస్కృత భాషల మధ్య జరిగిన మత రాజకీయాలు - పార్ట్ 3


(పార్ట్ 2 తరువాయి బాగం)
.
3. సంస్కృత భాషోదయం
శాతవాహనులు ప్రాకృతాన్ని ప్రోత్సహిస్తూ సంస్కృతాన్ని అంతవరకూ తొక్కిపెట్టి ఉంటారని అందుచేతే శాతవాహన సామ్రాజ్యం (CE 3వ శతాబ్దం ) క్షీణించిన తరువాత క్రమక్రమంగా సంస్కృతం శాసనభాషగా కనిపించటం ప్రారంభమైందని Language of the Snakes పుస్తక రచయిత Andrew Ollett అభిప్రాయపడ్డాడు .
నిజానికి శాతవాహనులు పొరుగురాజైన నహాపణుని రాజ్యంలో అప్పటికే సంస్కృతం శాసనభాషగా వాడటాన్ని ప్రారంభించినట్లు – నాశిక్ లో 120 CE లో ఉషవదత్తు వేయించి ఒక శాసనంద్వారా తెలుస్తుంది. మనకు స్పష్టమైన తేదీని కలిగి ఉన్న సంస్కృత శాసనాలలో ఇదే మొదటిది . ఈ శాసనం కూడా పూర్తిగా సంస్కృతభాషలో ఉండదు. ఉషవదత్తును కీర్తించే సగభాగం సంస్కృతంలోను, అతను ఇచ్చిన దానం వివరాలు ప్రాకృతంలోను ఉండటం చూడవచ్చు. శాసనభాషగా ప్రాకృతం క్రమేపీ ప్రాధాన్యతకోల్పోతూ, సంస్కృతం ముందుకు వస్తున్న దశను ఉషవదత్తు వేయించిన ఈ మిశ్రమ శాసనం ప్రతిబింబిస్తుంది. గౌతమిపుత్ర శాతకర్ణి విజయాలను కీర్తిస్తూ అతని తల్లి గౌతమి బాలశ్రీ CE 1వ శతాబ్దంలో ప్రాకృతభాషలో వేయించిన నాసిక్ గుహ శాసనానికి కొద్ది దూరంలోనే CE 3 వ శతాబ్దంలో అగ్నివర్మ కుమార్తె అయిన విష్ణు దత్త ఇచ్చిన ఒక దానశాసనం పూర్తి సంస్కృతంలో ఉంటుంది.
శాతవాహనులవారసులైన ఇక్ష్వాకులు మొదట్లో ప్రాకృతంలో శాసనాలు వేయించినప్పటికీ క్రమేపీ నాలుగో శతాబ్దంలోని ఎహువల శాంతమూల హయాంకి వచ్చేసరికి వీరు కూడా సంస్కృతంలోకి మారిపోయారు. ఒక బౌద్ధ స్తూపంపై శాంతమూలుడు వేయించిన శాసనంలో -అగ్నిహోత్ర, అజితోమ, అశ్వమేధ లాంటి వైదిక క్రతువులను జరిపించినట్లు; పదివేల గోవులను దానమొసగినట్లు ఉండటం- క్రమేపీ బౌద్ధంనుంచి హిందూమతం దిశగా మారుతున్న విశ్వాసాలను ప్రతిబింబిస్తుంది. (EI 31: 63)
పాలకులు అంతవరకూ శాసనభాషగా ఉన్న ప్రాకృతాన్ని పక్కన పెట్టి సంస్కృతాన్ని ముందుకు తీసుకొని రావటం అనేది ధార్మిక విధులకు అవసరమైన సంస్కృతభాషను గుప్పెట్లో పెట్టుకొన్న పండితుల ఆధిపత్యాన్ని అంగీకరించటంగా అర్ధం చేసుకోవాలి.
నాలుగోశతాబ్దం తరువాత ప్రాకృతంలో వేయబడిన ఒక్క రాజ శాసనం కూడా లభించకపోవటాన్ని బట్టి అప్పటికి సంస్కృతం రాజాశ్రయం పొంది తన ప్రాబల్యాన్ని సంపూర్ణంగా స్థాపించుకొందని భావించాలి.
.
4. ఆధిపత్య భాషగా సంస్కృతం
.
సంస్కృతం అందరి భాషా కాదు. దాన్ని నేర్చుకొనే అర్హత కొందరికే ఉండేది. సమాజంలోని కొందరు సంస్కృతంపై మోనోపలి సాగించారు. BCE మూడో శతాబ్దానికి చెందిన మిమాంస సూత్ర (6.1.25–38) లో apasudradhikarana పేరుతో శూద్రుడు సంస్కృతం నేర్వరాదని, వేద విద్యలకు అనర్హుడని నిర్ణయించి భారతీయ సమాజంలో “సంస్కృత మొనోపలి”కి తెరతీసింది. తద్వార మతపరమైన గ్రంధాలకు జనబాహుళ్యం (శూద్రులు) దూరమయ్యారు. బ్రహ్మ సూత్ర (1.3.38), మనుస్మృతి (3.156) శూద్రునికి సంస్కృత వ్యాకరణం ఇతర శాస్త్రాలను బోధించటాన్ని నిషేదించాయి .
లోకాచారం ప్రకారం శూద్రులు నిర్వహించాల్సిన విధులను ఉపదేశిస్తూ CE 1580 లో శేషకృష్ణ రచించిన శూద్రచింతామణి అనే గ్రంధం – శూద్రులకు వేదాలు, సంస్కృతవ్యాకరణం, స్మృతులు, పురాణాలు నిషిద్దమని, శూద్రులు సంస్కృత పదాలను ఉచ్ఛరించటానికే అర్హతలేదని చెప్పింది.
BCE రెండోశతాబ్దానికి చెందిన పతంజలి తన సంస్కృత వ్యాకరణ గ్రంధం “మహాభాష్య” రాసే సమయానికి ప్రాకృతానికి-సంస్కృతానికి మధ్య గట్టి పోటీ నడిచేది. ప్రాకృతం ప్రజలు నిత్యం మాట్లాడుకొనే భాషగా జనబాహుళ్యంలో బాగా చొచ్చుకొని పోయి, సంస్కృతం కంటే చాలా ముందంజలో ఉంది.
ఈ నేపథ్యంలో సంస్కృత వ్యాకరణవేత్తలు ధార్మిక/మత భాషగా సంస్కృతమే ఉండాలని పట్టుపట్టారు. ఆ విధంగా ఒక మతకట్టుబాటు (Religious restriction) ఏర్పాటు చేసారు. లౌకిక వ్యవహారాలను ప్రాకృత భాషలో జరుపుకొన్నా యజ్ఞకర్మలకు తప్పనిసరిగా సంస్కృతాన్నే వినియోగించాలని పతంజలి అన్నాడు. (yajne karmani sa niyamah) .
బ్రాహ్మణ స్త్రీలు ప్రాకృతాన్ని మాట్లాడటం వలన సంస్కృతభాషలోకి అపభ్రంశ ఉచ్ఛారణలు వచ్చి చేరుతున్నాయని పతంజలి ఆరోపించాడు. బ్రాహ్మణుల చుట్టూ నివసించే చండాలురు, శూద్రులకు సంస్కృతంతో పని లేదు. ఆనాటి సమాజంలో వీరందరూ ఇంకా బ్రాహ్మణ స్త్రీలు కూడా ప్రాకృతాన్నే మాట్లాడేవారని పతంజలి మహాభాష్య ద్వార తెలుస్తుంది. దీనిని బట్టి అప్పట్లో సంస్కృతం మాతృభాష కాదని, బ్రాహ్మణ పురుషులు మాత్రమే దీన్ని ఒక ద్వితీయభాషగా (ప్రధమ భాష ప్రాకృతం) బ్రతికించుకొంటూ ఉండేవారని అవగతమౌతుంది.
అత్యధిక శాతం ప్రజలు సంస్కృతేతర స్థానిక భాషలను మాట్లాడేవారు. (Sanskrit and Prakrit: Sociolinguistic issues by Madhav M. Deshpande)
అయినప్పటికీ భారతదేశ సంస్కృతి, విజ్ఞానం, సంప్రదాయాలకు సంస్కృత భాష నేటికీ ప్రాతినిధ్యం వహించటం ఒక చారిత్రిక వైరుధ్యం. దీన్ని రెనో ఒక ఫ్రెంచి ఇండాలజిస్ట్ ప్రతిపాదించాడు కనుక ఈ వైరుధ్యాన్ని Renou’s “paradox” అంటారు. అనాదిగా సంస్కృతానికి ఇతర స్థానీయభాషలకు మధ్య ఘర్షణలు జరిగి ఉండాలి. సంస్కృతాన్ని మతపరమైన క్రతువులకు తప్పనిసరి చేసి, దాన్ని బ్రాహ్మణేతరులకు దూరం చేయటం ద్వారా సమాజంలో బ్రాహ్మణిజపు ఆధిపత్యానికి తెరలేపటం జరిగింది.
***
5. సంస్కృత భాషా పరిణామం
2000-1500 BCE : హరప్ప నాగరికత పతనానికి రుగ్వేద రచనకు మధ్య కాలమిది. ఈ కాలంలోనే Proto Indo European Language అనే మూలభాషనుంచి సంస్కృతం, Mycenaean Greek, Ancient Greek, Hittite లాంటి భాషలు రూపుదిద్దుకొని ఉంటాయని భాషా పండితుల అభిప్రాయం.
అలా అవతరించిన సంస్కృతభాష ప్రాచీన భారతదేశంలో విస్తృతమైన మార్పులకు గురయ్యి వైదిక సంస్కృతంగా కావ్యభాషా రూపాన్ని పొందింది.
1500 - 500 BCE : ఈ కాలంలో సంస్కృతభాష పరిపక్వత పొంది వైదిక సంస్కృతంగా నిలిచింది. దీనిలో మానవేతిహాసపు అత్యంత ఉత్కృష్టమైన రుగ్వేద రచన జరిగింది. కానీ దీనికి సంబంధించిన రాతపూర్వక ఆధారాలు ఇప్పటివరకూ లభించలేదు. ఇవన్నీ ఎక్కువగా మత సంప్రదాయాలకు సంబంధించిన శ్లోకాలు కనుక అవి మౌఖికంగా ఒక తరం నుండి మరో తరానికి అందించబడిఉండొచ్చు.
500-400 BCE : బుద్ధుడు, మహావీరుడు తమ మత బోధనలను అప్పటికే మతభాషగా స్థిరపడిన సంస్కృతంలో కాక ప్రాకృతభాషలలో చేయసాగారు. దీనికి - ప్రాకృతం ప్రజల భాష అని భావించటం; ఏమత క్రతువులనైతే తాము వ్యతిరేకిస్తున్నామో, ఆ మతవ్యవహారాలను నిర్ధేశించే సంస్కృతాన్ని, దాన్ని గుప్పెట్లో పెట్టుకొన్న బ్రాహ్మణిజపు ఆధిపత్యాన్ని బద్ధలు కొట్టాలనుకోవటం కారణాలు కావొచ్చు.
బౌద్ధమతాన్ని స్థాపించిన బుద్ధుడు, జైన మతస్థాపకుడైన మహావీరుడు క్షత్రియవర్ణానికి చెందిన వ్యక్తులు. బౌద్ధసాహిత్యంలో వర్ణక్రమంలో బ్రాహ్మణులు క్షత్రియులు కంటే తక్కువవారని పదే పదే చెప్పబడింది. బౌద్ధ, జైన మత ఉత్థానపతనాలను బ్రాహ్మణ క్షత్రియ వర్ణాల మధ్య ఆధిపత్యపోరుగా అభివర్ణిస్తారు కొందరు చరిత్రకారులు.
300 BCE : అశోకుడు బౌద్ధధర్మ ప్రచారంలో భాగంగా తన రాజ్యంపొడవునా ప్రాకృతబాషల్లో సుమారు 84 వేల రాతిశాసనాలను, స్తూపాలను ఏర్పాటు చేసాడు.
200 BCE -7 CE: సంస్కృతభాష రాజాదరణ పొంది, నాగరీకుల భాషగా గౌరవం దక్కించుకోసాగింది. అంతవరకూ ప్రాకృతభాషలో వేయబడిన రాజశాసనాల స్థానంలో సంస్కృత శాసనాలు- భారతదేశంలోనే కాక వియత్నాం, కాంబోడియా, ఇండోనేషియా లాంటి దేశాలలో కూడా వేయబడుతున్నాయి. ఈ నేపథ్యంలో బౌద్ధ జైనాలు కూడా తమ బోధనలను సంస్కృతభాషలో చేయటం మొదలుపెట్టక తప్పలేదు.
మొదట్లో పాలి భాషలో లిఖించబడిన బౌద్ధ సాహిత్యం క్రమేపీ సంస్కృతీకరించబడటం మొదలైంది. ఒకటవ శతాబ్దపు అశ్వఘోషుడు బుద్ధచరితను సంస్కృతంలో రచించాడు. ఏడవశతాబ్దంలో హ్యుయాన్ త్సాంగ్ నలందవిశ్వవిద్యాలయంలో బౌద్ధ సాహిత్యాన్ని సంస్కృత భాషలోనే నేర్చుకొన్నాడు.
జైనం మాత్రం సంస్కృతాన్ని ఏడో శతాబ్దం వరకూ కూడా మతభాషగా అంగీకరించలేదు. ఈ విషయంలో జైనం సంస్కృతబాషకన్నా ప్రాకృతభాష సొబగైనదని, అది ప్రజల భాష అని నమ్ముతూ సైద్ధాంతికంగా బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది. ఏడవశతాబ్దంలో సిద్ధసేన దివాకరుడు రాసిన "సన్మతితర్క" అనే గ్రంధం సంస్కృతంలో వెలువడిన మొదటి జైన సాహిత్యం.
***
ప్రాకృతభాష సంస్కృతంతో పోటీ పడలేక వెనుకబడినప్పుడు, దానిలో ఉన్న సాహిత్యం సహజంగానే మరణించాలి. కానీ చిత్రంగా సంస్కృత పండితులు ప్రాకృతసాహిత్యంలోని ముఖ్యవిషయాలను సంస్కృతకావ్యాలలోకి తీసుకొని వచ్చారు. ఈ అంశంపై V.M. Kulkarni విస్తృతంగా పరిశోధన చేసి "Prakrit Verses in Sanskrit Works on Poetics" పుస్తకాన్ని రచించాడు. దీనిలో వివిధ సంస్కృత ఆలంకారికులు, గ్రంథకర్తలు ప్రాకృత సాహిత్యంలోని కొన్ని వేల వర్ణనలను తమ రచనలలో ఎలా స్వీకరించారో/ఉటంకించారో విపులంగా చర్చించాడు
ఉదాహరణకు
ఐదో శతాబ్దానికి చెందిన కాళిదాసు కుమారసంభవం కావ్యంలో ఒక శ్లోకం ఇలా ఉంటుంది
రతిక్రీడాసమయంలో శివుడు పార్వతీదేవి వస్త్రములను లాగివేయగా ఆమె సిగ్గుతో శివును రెండు నేత్రాలను తన చేతులతో కప్పివేసినది. అయినప్పటికీ శివుడు తన మూడవనేత్రంతో ఆమె శరీర అందాలను చూస్తూండటంతో తన ప్రయత్నం వృధా అయినందుకు పార్వతీదేవి మిక్కిలి దుఃఖించినదట. (కుమారసంభవం-VIII-7)
దాదాపు ఇదే వర్ణన ఒకటో శతాబ్దపు ప్రాకృత గాథాసప్తశతిలో ఇలా ఉంది
శివపార్వతుల సంగమ సమయంలో
వలువలు తొలగగా సిగ్గిల్లిన పార్వతీదేవి
రెండుచేతులతో విభుని రెండు కళ్లూ మూసి
మూడవకంటిని ముద్దాడింది. – 455
ఆనందవర్ధనుడు తన ధ్వన్యాలోక ఆలంకార శాస్త్ర గ్రంథంలో వాక్పతిరాజు రచించిన గౌదావహో అనే ప్రాకృత కావ్యం నుంచి ఈ వర్ణనను - సర్వం కోల్పోయిన స్థితిని ధ్వన్యాత్మకంగా చెప్పటానికి ఒక ఉదాహరణగా వాడుకొన్నాడు.
ఆకాశంలో మబ్బులు సోలిపోయి తూలుతూ తిరుగుతున్నాయి
కుండపోతగా కురుస్తున్న వర్షపుధారలకు అర్జున వృక్షాలు వణికిపోతున్నాయి
చంద్రుని గర్వం అణిగిపోయింది, చీకటిరాత్రులు వెంటాడుతున్నాయి. (గౌదావహో 416 – ప్రాకృత కవి వాక్పతిరాజు)
***
6. ముగింపు
ఏది ఏమైనప్పటికీ సంస్కృత బాష- మతక్రతువులపై తన సంపూర్ణ ఆధిపత్యం ద్వారా; రాజాదరణ పొందటం ద్వారా; ఒక సామాజిక వర్గానికి తప్ప మిగిలినవారికి అందుబాటులో లేనికారణంగా - కాలానుగుణంగా భిన్న భాషల మధ్య, భిన్న మతాల మధ్యా మనుగడకోసం జరిగిన పోరాటంలో తాను విజేతగా నిలవటమే కాక, తనకు ప్రాపకం కల్పించిన హిందూ ధర్మానికి కూడా విజయాన్ని అందించింది.
.
బొల్లోజు బాబా
.
సంప్రదించిన పుస్తకాలు
1. Andrew Ollett, Language of the Snakes
2. Language of the Gods in the world of Men, Sheldon Pollock
3. Sanskrit and Prakrit: Sociolinguistic issues by Madhav M. Deshpande
4. ప్రాకృత గ్రంథ కర్తలూ, ప్రజాసేవాను – పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి
5. Andrew Ollett, Language of the Snakes
6.Classical Buddhism, Neo Buddhism and the question of Caste, Pradeep P. Gokhale
7. V.M. Kulkarni "Prakrit Verses in Sanskrit Works on Poetics"
8. గాథాసప్తశతి వ్యాసాలు - బొల్లోజు బాబా
9. GAUDAVAHO by VAKPATIRAJA Prof. N. G. SURU.
10. A HISTORY OF INDIAN LITERATURE EDITED BY JAN GONDA
11. Contribution of Jainas to Sanskrit and Prakrit Literature, Dr. K.R. Chandra Commemoration Volume
12. Ideology and Status of Sanskrit Edited by Jan E.M. Houben
13. Wikipedia

Wednesday, March 29, 2023

ప్రాకృత, సంస్కృత భాషల మధ్య జరిగిన మత రాజకీయాలు - పార్ట్ 2

(పార్ట్ 1 తరువాయి బాగం)
.
ఏ మతమైనా వ్యాప్తిలోకి రావాలంటే ప్రజల భాషలో దాని బోధనలు ఉండాలి. ఈ సూక్ష్మాన్ని ఎరిగిన జైన బౌద్ధమతాలు తమ బోధనలను ప్రాకృతభాషలో ప్రచారం చేసుకొన్నాయి. ఈ క్రమంలో జైనం ధార్మిక బోధనలే కాక ఇతర శాస్త్ర, సాహిత్య విషయాలను కూడా సామాన్య ప్రజల/ స్థానిక భాషల్లో లిఖించటం ద్వారా సమాజంపై తన ముద్రను బలంగా వేసింది. దక్షిణభారతదేశ చరిత్రలో జైన వాజ్ఞ్మయాన్ని విస్మరించలేము. జైనంతో పాటు వారి వాజ్ఞ్మయం కూడా చాలామట్టుకు నాశనం చేయబడింది. ఈ క్రమంలో తమిళనాట జైనుల నిర్మూలనం జరిగినప్పటికీ వారి వాజ్ఞ్మయాన్ని మాత్రం సంగం సాహిత్యంగా తమిళులు భద్రపరచుకోవటం వల్ల నేడు వారిది అతి ప్రాచీనభాష, ప్రాచీన సంస్కృతి అంటూ ప్రకటించుకొనే వీలు కలిగింది. తెలుగు నాట మాత్రం జైనంతో పాటు జైన వాజ్ఞ్మయం కూడా ధ్వంసమైంది . దీనివల్ల నన్నయకు పూర్వం శతాబ్దాల పాటు గొప్ప సాహిత్యం ఉన్నప్పటికీ (ముఖ్యంగా జైన వాజ్ఞ్మయం) నన్నయను ఆదికవిగా ప్రతిష్టించుకోవలసి వచ్చింది.
.
2. పామరుల భాష అని నిరాదరణకు గురైన ప్రాకృతం
.
ఏడవ శతాబ్దానికి చెందిన సంస్కృత కవి దండి - సంస్కృతం, ప్రాకృతం, అపభ్రంశ (Mixed) అని మూడు భాషలను గుర్తించాడు. పదవ శతాబ్దపు సంస్కృత ఆలంకారికుడైన రాజశేఖరుడు ఈ మూడింటికి పైశాచి భాషను కలిపి నాలుగు భాషలను ప్రస్తావించాడు. అంతే కాక కావ్యపురుషునికి సంస్కృతం శిరస్సుగా, ప్రాకృతం చేతులుగా, అపభ్రంశం నడుముగా, పైశాచి భాష పాదాలుగా ఉంటాయని వర్ణించాడు (Language of snakes by Andrew Ollett ). ఈ వర్ణన ద్వారా భాషలు చాతుర్వర్ణాల వలె భిన్న స్థానాలలో ఒకనాడు ఎలా ఉంచబడ్డాయో అర్ధమౌతుంది.
పైశాచిని మృతుల భాష అంటారు. బహుశా ఇది అనార్యుల మాతృభాష కావొచ్చు. దండి, ఇంకా సంస్కృత వ్యాకరణకారులైన కాత్యాయన, పతంజలి వంటివారు సంస్కృతం కానిదంతా అపభ్రంశమేనని తీర్మానించారు.
ఇదే సమయంలో పాలి, పైశాచి, మగధి, మహారాష్ట్రి, కామరూపి, అపభ్రంశ, శౌరసేని, గాంధారి లాంటి అనేకరూపాలలో ప్రాకృతభాష ప్రజల భాషగా ఉంటూ సమాంతరంగా సహజీవనం చేస్తూ, గొప్ప సాహిత్యాన్ని ఉత్పత్తి చేసింది.
ప్రాకృతభాషలో వ్రాయబడిన గ్రంధాలలో గాథాసప్తశతి (1వ శతాబ్దం), సర్వశేనుని హరి విజయ (4వ శతాబ్దం), ప్రవరసేనుడి సేతుబంద (5వ శతాబ్దం) ఉద్ద్యోతనుని కువలయమాల (8 వ శతాబ్దం), వాక్పతి రాజు గౌదావహ (8 వ శతాబ్దం), కౌతూహలుని లీలావాయి (8వ శతాబ్దం), జినేశ్వరుని గాథాకోశః (12 వ శతాబ్దం) మొదలగునవి ముఖ్యమైనవి.
ప్రాకృతభాష పట్ల పండితవర్గాలలో చులకన భావం ఉండేది అనటానికి దుష్టాంతంగా కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి.
గుణాడ్యుడు
హాల చక్రవర్తి (1 వ శతాబ్దం) వ్యవహార భాష ప్రాకృతం. ఒకరోజు హాలుడు తన రాణితో జలక్రీడలాడుతున్నప్పుడు, నీటిని తనపై జల్లుతూంటే “దేవా మోదకైస్తాడయ” (సంస్కృతంలో-మా+ఉదకై+తాడయ=నీళ్ళతో కొట్టొద్దు) అన్నదట రాణి. అది విన్న రాజు ఆ మాటను (ప్రాకృతభాషలో మోదకాలు = లడ్డులు) తప్పుగా అర్ధం చేసుకొని లడ్డూలు తెప్పించి వాటిని రాణిపై విసిరాడట వేడుకగా. ఈ చర్యకు రాణి నవ్వి, సంస్కృతం రాకపోవటం పట్ల అవమానకరంగా మాట్లాడటంతో సిగ్గుపడిన హాలుడు, సభఏర్పాటు చేసి తనకు సంస్కృతం ఎవరు నేర్పుతారు అని సభాసదులను అడుగగా, గుణాడ్యుడు అనే పండితుడు నేను మీకు ఆరేండ్లలో సంస్కృతం నేర్పగలను అన్నాడట. శర్మవర్మ అనే మరో పండితుడు నేను ఆరునెలల్లో నేర్పగలను ప్రభూ, అనగా గుణాడ్యుడు దానిని అవమానంగా భావించి- శర్మవర్మతో “నీవు ఆరునెలలలో నేర్పగలిగితే, నేను సంస్కృత భాషను వదులుకొంటాను అని ప్రతిజ్ఞచేశాడట.
శర్మవర్మే ఈ పంతంలో గెలవటంతో, గుణాడ్యుడు సంస్కృత భాషను వదిలేసి పైశాచీ భాష నేర్చుకొని ఏడులక్షల శ్లోకాలతో కూడిన బృహత్కథను రచించాడు.
గుణాడ్యుడు ఈ రచనను హాలునికి సమర్పించమని తన శిష్యులకిచ్చి పంపగా, పైశాచీ భాషా! ఏడు లక్షల శ్లోకాలా! అంటూ హేళనగా హాలుడు వారిని తిప్పిపంపించగా గుణాడ్యుడు ఆ వార్త విని మిక్కిలి దుఃఖించి కావ్యంలోని ఒక్కో శ్లోకాన్ని అడవిలో ఉండే మృగాలకు, పక్షులకు వినిపించి చాలామట్టుకు కావ్యాన్ని అగ్నికి ఆహుతి చేసాడట. శిష్యుల కోరికపై లక్షశ్లోకాల భాగం మాత్రం మిగిల్చాడట గుణాడ్యుడు. (హాలుడే తప్పుతెలుసుకొని వచ్చి అభ్యర్ధించినట్లు మరో కథనం కలదు). దాన్నే సోమదేవసూరి సంస్కృతంలోకి కథాసరిత్సాగరం పేరుతో అనువదించాడు. బృహత్కథలో నేటికి మిగిలి ఉన్న ఒక కథాభాగం అది.
ఇలాంటిదే మరో ఉదంతం
ఆచార్య హేమచంద్రుడు జైన మతానికి చెందిన పదకొండవ శతాబ్దపు కవి పండితుడు. ఇతను కుమారపాలుడనే రాజు చరిత్రను ప్రాకృతభాషలో రచించి, దానిని ఆయనకు వినిపిద్దామని రాజసభకు వెళ్ళాడు. ఇతని రాకను ముందే గ్రహించిన మంత్రి ఆ రాజుతో “ఈ జైనులు బౌద్ధులు, ప్రాకృతం చదువుతూంటారు. అంతా పామర విషయాలు. సంస్కృతం దేవతల భాష, ప్రాకృతం పిశాచాల భాష. దేవరవారు పొద్దుటే సంస్కృతం వింటే శుభస్కరం, అదే ప్రాకృతం వినటం అశుభం” అని నూరిపోసి హేమచంద్రునికి రాజదర్శనం జరగకుండా అడ్డుపడ్డాడట. (ప్రాకృత గ్రంథ కర్తలూ, ప్రజాసేవాను – పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి)
మరో ప్రాకృత కథ ఇలా సాగుతుంది. ఉజ్జయినీ నగరంలో సిద్ధసేనుడు అనే ఒక జైన యువకుడు తన చుట్టూ సంస్కృతానికి గౌరవమూ, మన్ననా ఉండటము, ప్రాకృతానికి ఆదరణ లేకపోవటాన్ని గమనించి “మీరు అనుమతి ఇస్తే జైన గ్రంధాలను సంస్కృతంలోకి మార్చుతాను” అని తన మఠాధిపతిని అభ్యర్ధించాడు. అలా చేయటం మహాపాపం అని దానికి ప్రాయశ్చిత్తంగా ఆ యువకుడిని పన్నెండేళ్ళపాటు జైన సంఘం నుండి వెలివేసారట. దీంతో అతను ప్రాకృతాన్ని వదిలిపెట్టి సంస్కృతం లో చేరిపోయాడట.
సంస్కృతం నాగరీక భాషగా స్థిరీకరణ జరుగుతున్న సమయంలో సంస్కృతానికి దక్కిన గౌరవం, ఇతర ప్రాకృత/స్థానిక/ సంస్కృతేతర భాషలకు దక్కలేదని అవి ఏ రకంగా నిరాదరణకు గురయ్యాయో పై ఉదంతాలద్వారా అర్ధమౌతుంది.
.
3. సంస్కృత భాషోదయం
శాతవాహనులు ప్రాకృతాన్ని ప్రోత్సహిస్తూ సంస్కృతాన్ని అంతవరకూ తొక్కిపెట్టి ఉంటారని అందుచేతనే..........
(ఇంకా ఉంది)

బొల్లోజు బాబా



Monday, March 27, 2023

ప్రాకృత, సంస్కృత భాషల మధ్య జరిగిన మత రాజకీయాలు


ప్రాకృతభాష BCE 3వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం వరకూ మనుగడలో ఉండిన ప్రాచీన భారతీయ భాష. ప్రాకృతభాష ప్రజల భాష అని, ఇదే సంస్కరించబడి సంస్కృతభాషగా పరిణామం చెందిందని ఒక అభిప్రాయం కలదు. ప్రాకృతభాషనుండి సంస్కృతం వచ్చిందా, సంస్కృత భాష యొక్క అపభ్రంశరూపమే ప్రాకృతమా అనేది చర్చనీయాంశం.

ప్రాకృత భాష కాశ్మీరు నుండి తమిళనాడువరకూ, బెంగాలు నుండి సింధు వరకు భారతదేశ నలుమూలల విస్తరించిన ఒకనాటి భాష. పాలి, పైశాచి భాషలు ప్రాకృతం యొక్క భిన్నరూపాలలో ప్రముఖమైనవి.

బౌద్ధ, జైనాలు సామాన్య ప్రజలకు చేరాలని ప్రాకృతభాషలో తమ బోధనలు సాగించాయి. ఆవిధంగా ప్రాకృతభాష హైందవేతర భాషగా, హిందూమత భాషైన సంస్కృతానికి పరోక్ష ప్రత్యర్థిగా సాగించిన ప్రయాణం ఆసక్తికరమైనది.

ఒక భాషయొక్క పరిణామక్రమం మతవిశ్వాసాలతో తద్వారా రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక అంశాలతో ముడిపడి ఉండటం చరిత్రలో ఒక అరుదైన ఘటన. ప్రాకృతభాషాపరిణామాన్ని అర్ధం చేసుకోకుండా ప్రాచీన భరతఖంఢపు రాజకీయ సాంస్కృతిక సామాజిక స్వరూపం అర్ధం కాదు. అయినప్పటికీ తమిళ, తెలుగు, మళయాళ భాషలకు దక్కినట్లుగా ప్రాకృతభాషకు ఏరకమైన ప్రాచీన హోదా నేడు లేదు ఎందుకంటే భాషా పరంగా, భౌగోళికంగా, మతపరంగా ప్రాకృతం నేడు ఒక అనాథ. జైనమత పరిభాషగా ప్రాకృతాన్ని గుర్తించినప్పటికీ అది సంపూర్ణం కాదు.
సంస్కృతం వేదకాలం నుంచి ఉన్న అతి ప్రాచీన భాష. BCE 6-4 శతాబ్దానికి చెందిన పాణిని వ్యాకరణం సంస్కృతభాషను క్రమబద్దీకరించింది. ఆ విధంగా సంప్రదాయకమైన రూపాన్ని సంతరించుకొన్న సంస్కృతం పండితుల భాషగా ఆదరణ పొందటం మొదలైంది.

గుప్తులు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల CE 4 వశతాబ్దం నుండి సంస్కృతం భరతఖంఢంలో నలుమూలలకు విస్తరించ సాగింది. అంతవరకూ క్రతువులకు, మతసంబంధరచనలకు పరిమితమై ఉన్న సంస్కృతం ఒక్కసారిగా రాజాశ్రయం పొంది రాజకీయభాషగా, సాహిత్యభాషగా మారటం దక్షిణ ఆసియా చరిత్రలో కీలక రాజకీయ, సామాజిక పరిణామంగా The Language of Gods అనే పుస్తకంలో by Sheldon Pollock అభిప్రాయపడ్డాడు. అలా సంస్కృతభాష రాజకీయ ప్రాపకం పొంది మతపరమైన, సంస్కృతిపరమైన ఆధిపత్యాన్ని పొందటాన్ని Sanskrit Cosmopolis అంటాడు పొల్లొక్.

హిందూ రాజులు అధికార కాంక్ష కలిగిన వారని; వీరితో పండితులు జతగూడి సంస్కృతాన్ని ఆధిపత్యభాషగా చేసి దాన్ని సమాజంలోని కొన్ని వర్గాలవారికే అందుబాటులో ఉండేలా చేయటంతో సమాజం వివిధ హెచ్చుతగ్గుల అంతస్థులుగా విడిపోయిందని; హిందూ మతంలోని ఈ నిచ్చెనమెట్లను, క్రతువులను బౌద్ధ, జైన మతాలు ప్రశ్నించి, హిందూ సంస్కృతికి వ్యతిరేకంగా (ప్రాకృత భాషలతో) ప్రత్యామ్నాయ సమాజాన్ని నిర్మించటానికి ప్రయత్నించాయని; దీనికి ప్రతిగా హిందూమత ఆధిపత్యవర్గాలు మరింత బలంగా బౌద్ధ, జైన మతాలను, ఆ మతబోధనలు రాసుకొన్న ప్రాకృతభాషలను నిర్వీర్యం చేసాయని అంటూ పొల్లక్ కొన్ని చర్చనీయ ప్రతిపాదనలు చేసాడు.
.
1. ప్రాకృతభాష ప్రాచీనత
.
BCE 3 వ శతాబ్దానికి చెందిన అశోకుని శాసనాలు, అదే కాలానికి చెందిన తమిళనాడులో దొరికిన తమిళబ్రహ్మి లిపి లో ఉన్న శాసనాలు, ఆంధ్రప్రదేష్ భట్టిప్రోలులో లభించిన భట్టిప్రోలు బ్రహ్మిలిపిలో ఉన్న శాసనాలు భారతదేశపు అతి పురాతనమైన శాసనాలుగా గుర్తించారు. ఈ శాసనాలన్నీ ప్రాకృతభాషలో (బ్రహ్మిలిపి) వేయించిన శాసనాలు కావటం గమనార్హం.
అశోక చక్రవర్తి తన రాజ్యం అంతటా 84,000 రాతిశాసనాలను, స్తూపాలను ఏర్పాటు చేసాడు. ఈ శాసనలలో భాష ప్రధానంగా ప్రాకృతం. ఈ బృహత్కార్యం ద్వారా భారతదేశంలో “లేఖన యుగం” ప్రారంభమైంది. అంతకుపూర్వం దేవభాషగా సంస్కృతం ఉన్నప్పటికీ శాసనాలలో ఎక్కడా ప్రతిబింబించలేదు. సింధులోయలో దొరికిన రాత, ఏదో భాషకు సంబంధించిన లిపి కాకపోవచ్చని అవి సంజ్ఞలు కావొచ్చని ఆధునిక అవగాహన. సింధు నాగరికతకు అశోకునికి (BCE 1756-260) మధ్య ఉన్న వెయ్యేళ్ళ కాలంలో ఏ రకమైన వ్రాతకు సంబంధించిన ఆధారాలు లభించని కారణంగా చారిత్రికంగా అశోకునితోనే భారతదేశంలో వ్రాతయుగం మొదలైందని భావించవచ్చును.

సంస్కృతం వేదకాలం నుంచీ మనుగడలో ఉన్నప్పటికీ, శాసనరూపంలో ప్రతిబింబించటంలో ప్రాకృతం కంటే వెనుకపడటం ఆలోచించాల్సిన విషయం.
రెండువేల సంవత్సరాల క్రితం పశ్చిమ తీరానికి చెందిన నానేఘాట్ గుహలో భారతదేశ చరిత్రలోనే అంతవరకూ లేని విధంగా రాజుల విగ్రహాలతో (నేడు కానరావు), వారి విజయాలు, దండయాత్రలు, చేసిన దానాలతో కూడిన సుదీర్ఘమైన ఒక శాసనం లభించింది. దానిలోని భాష ప్రాకృతం. శైలి కవిత్వశైలి. ఆ రాజులు శాతవాహనులు. వారి రాజ్యం దక్షిణాపథంలో విస్తరించి ఉంది.

దాదాపు ఇదేకాలంలో తూర్పుతీరంపై కళింగరాజు ఖారవేలుడు కూడా తన విజయాలు, దండయాత్రలు, దానాలతో కూడిన గొప్ప శాస నాన్ని ప్రాకృతభాషలో వేయించుకొన్నాడు. నానెఘాట్ శాసనం లో శాతవాహన రాజును “అప్రతిహత చాకస (whose wheels are unstoppable ) అని వర్ణిస్తే, ఖారవేలుని శాసనంలో ఖారవేలుడిని అప్రతిహత చాక వాహన బలో (“whose wheels, mounts, and forces are unstoppable” అని వర్ణించటం గమనించవచ్చు. సుమారు 1500 కిలోమీటర్ల దూరంలో విస్తరించిన; ఏమాత్రం ఒకరితో ఒకరికి సంబంధం లేని ఇద్దరు రాజ్యాధినేతల ప్రశస్థి శాసనాలలో ఒకే రకమైన కావ్యభాష ఉండటం ఆశ్చర్యం కలిగించక మానదు.
ఇది ప్రాకృతభాష వ్యాప్తికి, ప్రామాణీకరణకు (standardization) ఉదాహరణగా నిలుస్తుంది.

ఏ మతమైనా వ్యాప్తిలోకి రావాలంటే ప్రజల భాషలో దాని బోధనలు ఉండాలి. ఈ సూక్ష్మాన్ని ఎరిగిన జైన బౌద్ధమతాలు తమ బోధనలను ప్రాకృతభాషలో ప్రచారం చేసుకొన్నాయి. ఈ క్రమంలో జైనం ధార్మిక బోధనలే కాక ఇతర శాస్త్ర, సాహిత్య విషయాలను కూడా సామాన్య ప్రజల/ స్థానిక భాషల్లో లిఖించటం ద్వారా సమాజంపై తన ముద్రను బలంగా వేసింది. దక్షిణభారతదేశ చరిత్రలో జైన వాజ్ఞ్మయాన్ని విస్మరించలేము. జైనంతో పాటు వారి వాజ్ఞ్మయం కూడా చాలామట్టుకు నాశనం చేయబడింది. ఈ క్రమంలో తమిళనాట జైనుల నిర్మూలనం జరిగినప్పటికీ వారి వాజ్ఞ్మయాన్ని మాత్రం సంగం సాహిత్యంగా తమిళులు భద్రపరచుకోవటం వల్ల నేడు వారిది అతి ప్రాచీనభాష, ప్రాచీన సంస్కృతి అంటూ ప్రకటించుకొనే వీలు కలిగింది. తెలుగు నాట మాత్రం జైనంతో పాటు జైన వాజ్ఞ్మయం కూడా ధ్వంసమైంది . దీనివల్ల నన్నయకు పూర్వం శతాబ్దాల పాటు గొప్ప సాహిత్యం ఉన్నప్పటికీ (ముఖ్యంగా జైన వాజ్ఞ్మయం) నన్నయను ఆదికవిగా ప్రతిష్టించుకోవలసి వచ్చింది.
.
2. పామరుల భాష అని నిరాదరణకు గురైన ప్రాకృతం
.
ఏడవ శతాబ్దానికి చెందిన సంస్కృత కవి దండి - సంస్కృతం, ప్రాకృతం, అపభ్రంశ (Mixed) అని మూడు భాషలను గుర్తించాడు. పదవ శతాబ్దపు సంస్కృత ఆలంకారికుడైన రాజశేఖరుడు ఈ మూడింటికి పైశాచి భాషను కలిపి నాలుగు భాషలను ప్రస్తావించాడు. అంతే కాక కావ్యపురుషునికి సంస్కృతం శిరస్సుగా, ప్రాకృతం చేతులుగా, అపభ్రంశం నడుముగా, పైశాచి భాష పాదాలుగా ఉంటాయని వర్ణించాడు (Language of snakes by Andrew Ollett ). ఈ వర్ణన ద్వారా భాషలు చాతుర్వర్ణాల వలె భిన్న స్థానాలలో ఒకనాడు ఎలా ఉంచబడ్డాయో అర్ధమౌతుంది.
పైశాచిని మృతుల భాష అంటారు. బహుశా ఇది అనార్యుల మాతృభాష కావొచ్చు. దండి, ఇంకా సంస్కృత వ్యాకరణకారులైన కాత్యాయన, పతంజలి వంటివారు సంస్కృతం కానిదంతా అపభ్రంశమేనని తీర్మానించారు.

ఇదే సమయంలో పాలి, పైశాచి, మగధి, మహారాష్ట్రి, కామరూపి, అపభ్రంశ, శౌరసేని, గాంధారి లాంటి అనేకరూపాలలో ప్రాకృతభాష ప్రజల భాషగా ఉంటూ సమాంతరంగా సహజీవనం చేస్తూ, గొప్ప సాహిత్యాన్ని ఉత్పత్తి చేసింది.

ప్రాకృతభాషలో వ్రాయబడిన గ్రంధాలలో గాథాసప్తశతి (1వ శతాబ్దం), సర్వశేనుని హరి విజయ (4వ శతాబ్దం), ప్రవరసేనుడి సేతుబంద (5వ శతాబ్దం) ఉద్ద్యోతనుని కువలయమాల (8 వ శతాబ్దం), వాక్పతి రాజు గౌదావహ (8 వ శతాబ్దం), కౌతూహలుని లీలావాయి (8వ శతాబ్దం), జినేశ్వరుని గాథాకోశః (12 వ శతాబ్దం) మొదలగునవి ముఖ్యమైనవి.
ప్రాకృతభాష పట్ల పండితవర్గాలలో చులకన భావం ఉండేది అనటానికి దుష్టాంతంగా కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి.

గుణాడ్యుడు

హాల చక్రవర్తి (1 వ శతాబ్దం) వ్యవహార భాష ప్రాకృతం. ఒకరోజు హాలుడు తన రాణితో జలక్రీడలాడుతున్నప్పుడు, నీటిని తనపై జల్లుతూంటే “దేవా మోదకైస్తాడయ” (సంస్కృతంలో-మా+ఉదకై+తాడయ=నీళ్ళతో కొట్టొద్దు) అన్నదట రాణి. అది విన్న రాజు ఆ మాటను (ప్రాకృతభాషలో మోదకాలు = లడ్డులు) తప్పుగా అర్ధం చేసుకొని లడ్డూలు తెప్పించి వాటిని రాణిపై విసిరాడట వేడుకగా. ఈ చర్యకు రాణి నవ్వి, సంస్కృతం రాకపోవటం పట్ల అవమానకరంగా మాట్లాడటంతో సిగ్గుపడిన హాలుడు, సభఏర్పాటు చేసి తనకు సంస్కృతం ఎవరు నేర్పుతారు అని సభాసదులను అడుగగా, గుణాడ్యుడు అనే పండితుడు నేను మీకు ఆరేండ్లలో సంస్కృతం నేర్పగలను అన్నాడట. శర్మవర్మ అనే మరో పండితుడు నేను ఆరునెలల్లో నేర్పగలను ప్రభూ, అనగా గుణాడ్యుడు దానిని అవమానంగా భావించి- శర్మవర్మతో “నీవు ఆరునెలలలో నేర్పగలిగితే, నేను సంస్కృత భాషను వదులుకొంటాను అని ప్రతిజ్ఞచేశాడట.
శర్మవర్మే ఈ పంతంలో గెలవటంతో, గుణాడ్యుడు సంస్కృత భాషను వదిలేసి పైశాచీ భాష నేర్చుకొని ఏడులక్షల శ్లోకాలతో కూడిన బృహత్కథను రచించాడు.
గుణాడ్యుడు ఈ రచనను హాలునికి సమర్పించమని తన శిష్యులకిచ్చి పంపగా, పైశాచీ భాషా! ఏడు లక్షల శ్లోకాలా! అంటూ హేళనగా హాలుడు వారిని తిప్పిపంపించగా గుణాడ్యుడు ఆ వార్త విని మిక్కిలి దుఃఖించి కావ్యంలోని ఒక్కో శ్లోకాన్ని అడవిలో ఉండే మృగాలకు, పక్షులకు వినిపించి చాలామట్టుకు కావ్యాన్ని అగ్నికి ఆహుతి చేసాడట. శిష్యుల కోరికపై లక్షశ్లోకాల భాగం మాత్రం మిగిల్చాడట గుణాడ్యుడు. (హాలుడే తప్పుతెలుసుకొని వచ్చి అభ్యర్ధించినట్లు మరో కథనం కలదు). దాన్నే సోమదేవసూరి సంస్కృతంలోకి కథాసరిత్సాగరం పేరుతో అనువదించాడు. బృహత్కథలో నేటికి మిగిలి ఉన్న ఒక కథాభాగం అది.

ఇలాంటిదే మరో ఉదంతం

ఆచార్య హేమచంద్రుడు జైన మతానికి చెందిన పదకొండవ శతాబ్దపు కవి పండితుడు. ఇతను కుమారపాలుడనే రాజు చరిత్రను ప్రాకృతభాషలో రచించి, దానిని ఆయనకు వినిపిద్దామని రాజసభకు వెళ్ళాడు. ఇతని రాకను ముందే గ్రహించిన మంత్రి ఆ రాజుతో “ఈ జైనులు బౌద్ధులు, ప్రాకృతం చదువుతూంటారు. అంతా పామర విషయాలు. సంస్కృతం దేవతల భాష, ప్రాకృతం పిశాచాల భాష. దేవరవారు పొద్దుటే సంస్కృతం వింటే శుభస్కరం, అదే ప్రాకృతం వినటం అశుభం” అని నూరిపోసి హేమచంద్రునికి రాజదర్శనం జరగకుండా అడ్డుపడ్డాడట. (ప్రాకృత గ్రంథ కర్తలూ, ప్రజాసేవాను – పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి)
మరో ప్రాకృత కథ ఇలా సాగుతుంది. ఉజ్జయినీ నగరంలో సిద్ధసేనుడు అనే ఒక జైన యువకుడు తన చుట్టూ సంస్కృతానికి గౌరవమూ, మన్ననా ఉండటము, ప్రాకృతానికి ఆదరణ లేకపోవటాన్ని గమనించి “మీరు అనుమతి ఇస్తే జైన గ్రంధాలను సంస్కృతంలోకి మార్చుతాను” అని తన మఠాధిపతిని అభ్యర్ధించాడు. అలా చేయటం మహాపాపం అని దానికి ప్రాయశ్చిత్తంగా ఆ యువకుడిని పన్నెండేళ్ళపాటు జైన సంఘం నుండి వెలివేసారట. దీంతో అతను ప్రాకృతాన్ని వదిలిపెట్టి సంస్కృతం లో చేరిపోయాడట.

సంస్కృతం నాగరీక భాషగా స్థిరీకరణ జరుగుతున్న సమయంలో సంస్కృతానికి దక్కిన గౌరవం, ఇతర ప్రాకృత/స్థానిక/ సంస్కృతేతర భాషలకు దక్కలేదని అవి ఏ రకంగా నిరాదరణకు గురయ్యాయో పై ఉదంతాలద్వారా అర్ధమౌతుంది.
.
3. సంస్కృత భాషోదయం

శాతవాహనులు ప్రాకృతాన్ని ప్రోత్సహిస్తూ సంస్కృతాన్ని అంతవరకూ తొక్కిపెట్టి ఉంటారని అందుచేతే శాతవాహన సామ్రాజ్యం (CE 3వ శతాబ్దం ) క్షీణించిన తరువాత క్రమక్రమంగా సంస్కృతం శాసనభాషగా కనిపించటం ప్రారంభమైందని Language of the Snakes పుస్తక రచయిత Andrew Ollett అభిప్రాయపడ్డాడు .

నిజానికి శాతవాహనులు పొరుగురాజైన నహాపణుని రాజ్యంలో అప్పటికే సంస్కృతం శాసనభాషగా వాడటాన్ని ప్రారంభించినట్లు – నాశిక్ లో 120 CE లో ఉషవదత్తు వేయించి ఒక శాసనంద్వారా తెలుస్తుంది. మనకు స్పష్టమైన తేదీని కలిగి ఉన్న సంస్కృత శాసనాలలో ఇదే మొదటిది . ఈ శాసనం కూడా పూర్తిగా సంస్కృతభాషలో ఉండదు. ఉషవదత్తును కీర్తించే సగభాగం సంస్కృతంలోను, అతను ఇచ్చిన దానం వివరాలు ప్రాకృతంలోను ఉండటం చూడవచ్చు. శాసనభాషగా ప్రాకృతం క్రమేపీ ప్రాధాన్యతకోల్పోతూ, సంస్కృతం ముందుకు వస్తున్న దశను ఉషవదత్తు వేయించిన ఈ మిశ్రమ శాసనం ప్రతిబింబిస్తుంది. గౌతమిపుత్ర శాతకర్ణి విజయాలను కీర్తిస్తూ అతని తల్లి గౌతమి బాలశ్రీ CE 1వ శతాబ్దంలో ప్రాకృతభాషలో వేయించిన నాసిక్ గుహ శాసనానికి కొద్ది దూరంలోనే CE 3 వ శతాబ్దంలో అగ్నివర్మ కుమార్తె అయిన విష్ణు దత్త ఇచ్చిన ఒక దానశాసనం పూర్తి సంస్కృతంలో ఉంటుంది.

శాతవాహనులవారసులైన ఇక్ష్వాకులు మొదట్లో ప్రాకృతంలో శాసనాలు వేయించినప్పటికీ క్రమేపీ నాలుగో శతాబ్దంలోని ఎహువల శాంతమూల హయాంకి వచ్చేసరికి వీరు కూడా సంస్కృతంలోకి మారిపోయారు. ఒక బౌద్ధ స్తూపంపై శాంతమూలుడు వేయించిన శాసనంలో -అగ్నిహోత్ర, అజితోమ, అశ్వమేధ లాంటి వైదిక క్రతువులను జరిపించినట్లు; పదివేల గోవులను దానమొసగినట్లు ఉండటం- క్రమేపీ బౌద్ధంనుంచి హిందూమతం దిశగా మారుతున్న విశ్వాసాలను ప్రతిబింబిస్తుంది. (EI 31: 63)

పాలకులు అంతవరకూ శాసనభాషగా ఉన్న ప్రాకృతాన్ని పక్కన పెట్టి సంస్కృతాన్ని ముందుకు తీసుకొని రావటం అనేది ధార్మిక విధులకు అవసరమైన సంస్కృతభాషను గుప్పెట్లో పెట్టుకొన్న పండితుల ఆధిపత్యాన్ని అంగీకరించటంగా అర్ధం చేసుకోవాలి.
నాలుగోశతాబ్దం తరువాత ప్రాకృతంలో వేయబడిన ఒక్క రాజ శాసనం కూడా లభించకపోవటాన్ని బట్టి అప్పటికి సంస్కృతం రాజాశ్రయం పొంది తన ప్రాబల్యాన్ని సంపూర్ణంగా స్థాపించుకొందని భావించాలి.
.
4. ఆధిపత్య భాషగా సంస్కృతం
.
సంస్కృతం అందరి భాషా కాదు. దాన్ని నేర్చుకొనే అర్హత కొందరికే ఉండేది. సమాజంలోని కొందరు సంస్కృతంపై మోనోపలి సాగించారు. BCE మూడో శతాబ్దానికి చెందిన మిమాంస సూత్ర (6.1.25–38) లో apasudradhikarana పేరుతో శూద్రుడు సంస్కృతం నేర్వరాదని, వేద విద్యలకు అనర్హుడని నిర్ణయించి భారతీయ సమాజంలో “సంస్కృత మొనోపలి”కి తెరతీసింది. తద్వార మతపరమైన గ్రంధాలకు జనబాహుళ్యం (శూద్రులు) దూరమయ్యారు. బ్రహ్మ సూత్ర (1.3.38), మనుస్మృతి (3.156) శూద్రునికి సంస్కృత వ్యాకరణం ఇతర శాస్త్రాలను బోధించటాన్ని నిషేదించాయి .

లోకాచారం ప్రకారం శూద్రులు నిర్వహించాల్సిన విధులను ఉపదేశిస్తూ CE 1580 లో శేషకృష్ణ రచించిన శూద్రచింతామణి అనే గ్రంధం – శూద్రులకు వేదాలు, సంస్కృతవ్యాకరణం, స్మృతులు, పురాణాలు నిషిద్దమని, శూద్రులు సంస్కృత పదాలను ఉచ్ఛరించటానికే అర్హతలేదని చెప్పింది.

BCE రెండోశతాబ్దానికి చెందిన పతంజలి తన సంస్కృత వ్యాకరణ గ్రంధం “మహాభాష్య” రాసే సమయానికి ప్రాకృతానికి-సంస్కృతానికి మధ్య గట్టి పోటీ నడిచేది. ప్రాకృతం ప్రజలు నిత్యం మాట్లాడుకొనే భాషగా జనబాహుళ్యంలో బాగా చొచ్చుకొని పోయి, సంస్కృతం కంటే చాలా ముందంజలో ఉంది.

ఈ నేపథ్యంలో సంస్కృత వ్యాకరణవేత్తలు ధార్మిక/మత భాషగా సంస్కృతమే ఉండాలని పట్టుపట్టారు. ఆ విధంగా ఒక మతకట్టుబాటు (Religious restriction) ఏర్పాటు చేసారు. లౌకిక వ్యవహారాలను ప్రాకృత భాషలో జరుపుకొన్నా యజ్ఞకర్మలకు తప్పనిసరిగా సంస్కృతాన్నే వినియోగించాలని పతంజలి అన్నాడు. (yajne karmani sa niyamah) .

బ్రాహ్మణ స్త్రీలు ప్రాకృతాన్ని మాట్లాడటం వలన సంస్కృతభాషలోకి అపభ్రంశ ఉచ్ఛారణలు వచ్చి చేరుతున్నాయని పతంజలి ఆరోపించాడు. బ్రాహ్మణుల చుట్టూ నివసించే చండాలురు, శూద్రులకు సంస్కృతంతో పని లేదు. ఆనాటి సమాజంలో వీరందరూ ఇంకా బ్రాహ్మణ స్త్రీలు కూడా ప్రాకృతాన్నే మాట్లాడేవారని పతంజలి మహాభాష్య ద్వార తెలుస్తుంది. దీనిని బట్టి అప్పట్లో సంస్కృతం మాతృభాష కాదని, బ్రాహ్మణ పురుషులు మాత్రమే దీన్ని ఒక ద్వితీయభాషగా (ప్రధమ భాష ప్రాకృతం) బ్రతికించుకొంటూ ఉండేవారని అవగతమౌతుంది.

అత్యధిక శాతం ప్రజలు సంస్కృతేతర స్థానిక భాషలను మాట్లాడేవారు. (Sanskrit and Prakrit: Sociolinguistic issues by Madhav M. Deshpande)

అయినప్పటికీ భారతదేశ సంస్కృతి, విజ్ఞానం, సంప్రదాయాలకు సంస్కృత భాష నేటికీ ప్రాతినిధ్యం వహించటం ఒక చారిత్రిక వైరుధ్యం. దీన్ని రెనో ఒక ఫ్రెంచి ఇండాలజిస్ట్ ప్రతిపాదించాడు కనుక ఈ వైరుధ్యాన్ని Renou’s “paradox” అంటారు. అనాదిగా సంస్కృతానికి ఇతర స్థానీయభాషలకు మధ్య ఘర్షణలు జరిగి ఉండాలి. సంస్కృతాన్ని మతపరమైన క్రతువులకు తప్పనిసరి చేసి, దాన్ని బ్రాహ్మణేతరులకు దూరం చేయటం ద్వారా సమాజంలో బ్రాహ్మణిజపు ఆధిపత్యానికి తెరలేపటం జరిగింది.
***

5. సంస్కృత భాషా పరిణామం

2000-1500 BCE : హరప్ప నాగరికత పతనానికి రుగ్వేద రచనకు మధ్య కాలమిది. ఈ కాలంలోనే Proto Indo European Language అనే మూలభాషనుంచి సంస్కృతం, Mycenaean Greek, Ancient Greek, Hittite లాంటి భాషలు రూపుదిద్దుకొని ఉంటాయని భాషా పండితుల అభిప్రాయం.
అలా అవతరించిన సంస్కృతభాష ప్రాచీన భారతదేశంలో విస్తృతమైన మార్పులకు గురయ్యి వైదిక సంస్కృతంగా కావ్యభాషా రూపాన్ని పొందింది.

1500 - 500 BCE : ఈ కాలంలో సంస్కృతభాష పరిపక్వత పొంది వైదిక సంస్కృతంగా నిలిచింది. దీనిలో మానవేతిహాసపు అత్యంత ఉత్కృష్టమైన రుగ్వేద రచన జరిగింది. కానీ దీనికి సంబంధించిన రాతపూర్వక ఆధారాలు ఇప్పటివరకూ లభించలేదు. ఇవన్నీ ఎక్కువగా మత సంప్రదాయాలకు సంబంధించిన శ్లోకాలు కనుక అవి మౌఖికంగా ఒక తరం నుండి మరో తరానికి అందించబడిఉండొచ్చు.

500-400 BCE : బుద్ధుడు, మహావీరుడు తమ మత బోధనలను అప్పటికే మతభాషగా స్థిరపడిన సంస్కృతంలో కాక ప్రాకృతభాషలలో చేయసాగారు. దీనికి - ప్రాకృతం ప్రజల భాష అని భావించటం; ఏమత క్రతువులనైతే తాము వ్యతిరేకిస్తున్నామో, ఆ మతవ్యవహారాలను నిర్ధేశించే సంస్కృతాన్ని, దాన్ని గుప్పెట్లో పెట్టుకొన్న బ్రాహ్మణిజపు ఆధిపత్యాన్ని బద్ధలు కొట్టాలనుకోవటం కారణాలు కావొచ్చు.

బౌద్ధమతాన్ని స్థాపించిన బుద్ధుడు, జైన మతస్థాపకుడైన మహావీరుడు క్షత్రియవర్ణానికి చెందిన వ్యక్తులు. బౌద్ధసాహిత్యంలో వర్ణక్రమంలో బ్రాహ్మణులు క్షత్రియులు కంటే తక్కువవారని పదే పదే చెప్పబడింది. బౌద్ధ, జైన మత ఉత్థానపతనాలను బ్రాహ్మణ క్షత్రియ వర్ణాల మధ్య ఆధిపత్యపోరుగా అభివర్ణిస్తారు కొందరు చరిత్రకారులు.

300 BCE : అశోకుడు బౌద్ధధర్మ ప్రచారంలో భాగంగా తన రాజ్యంపొడవునా ప్రాకృతబాషల్లో సుమారు 84 వేల రాతిశాసనాలను, స్తూపాలను ఏర్పాటు చేసాడు.

200 BCE -7 CE: సంస్కృతభాష రాజాదరణ పొంది, నాగరీకుల భాషగా గౌరవం దక్కించుకోసాగింది. అంతవరకూ ప్రాకృతభాషలో వేయబడిన రాజశాసనాల స్థానంలో సంస్కృత శాసనాలు- భారతదేశంలోనే కాక వియత్నాం, కాంబోడియా, ఇండోనేషియా లాంటి దేశాలలో కూడా వేయబడుతున్నాయి. ఈ నేపథ్యంలో బౌద్ధ జైనాలు కూడా తమ బోధనలను సంస్కృతభాషలో చేయటం మొదలుపెట్టక తప్పలేదు.

మొదట్లో పాలి భాషలో లిఖించబడిన బౌద్ధ సాహిత్యం క్రమేపీ సంస్కృతీకరించబడటం మొదలైంది. ఒకటవ శతాబ్దపు అశ్వఘోషుడు బుద్ధచరితను సంస్కృతంలో రచించాడు. ఏడవశతాబ్దంలో హ్యుయాన్ త్సాంగ్ నలందవిశ్వవిద్యాలయంలో బౌద్ధ సాహిత్యాన్ని సంస్కృత భాషలోనే నేర్చుకొన్నాడు.

జైనం మాత్రం సంస్కృతాన్ని ఏడో శతాబ్దం వరకూ కూడా మతభాషగా అంగీకరించలేదు. ఈ విషయంలో జైనం సంస్కృతబాషకన్నా ప్రాకృతభాష సొబగైనదని, అది ప్రజల భాష అని నమ్ముతూ సైద్ధాంతికంగా బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది. ఏడవశతాబ్దంలో సిద్ధసేన దివాకరుడు రాసిన "సన్మతితర్క" అనే గ్రంధం సంస్కృతంలో వెలువడిన మొదటి జైన సాహిత్యం.
***

ప్రాకృతభాష సంస్కృతంతో పోటీ పడలేక వెనుకబడినప్పుడు, దానిలో ఉన్న సాహిత్యం సహజంగానే మరణించాలి. కానీ చిత్రంగా సంస్కృత పండితులు ప్రాకృతసాహిత్యంలోని ముఖ్యవిషయాలను సంస్కృతకావ్యాలలోకి తీసుకొని వచ్చారు. ఈ అంశంపై V.M. Kulkarni విస్తృతంగా పరిశోధన చేసి "Prakrit Verses in Sanskrit Works on Poetics" పుస్తకాన్ని రచించాడు. దీనిలో వివిధ సంస్కృత ఆలంకారికులు, గ్రంథకర్తలు ప్రాకృత సాహిత్యంలోని కొన్ని వేల వర్ణనలను తమ రచనలలో ఎలా స్వీకరించారో/ఉటంకించారో విపులంగా చర్చించాడు

ఉదాహరణకు
ఐదో శతాబ్దానికి చెందిన కాళిదాసు కుమారసంభవం కావ్యంలో ఒక శ్లోకం ఇలా ఉంటుంది
రతిక్రీడాసమయంలో శివుడు పార్వతీదేవి వస్త్రములను లాగివేయగా ఆమె సిగ్గుతో శివును రెండు నేత్రాలను తన చేతులతో కప్పివేసినది. అయినప్పటికీ శివుడు తన మూడవనేత్రంతో ఆమె శరీర అందాలను చూస్తూండటంతో తన ప్రయత్నం వృధా అయినందుకు పార్వతీదేవి మిక్కిలి దుఃఖించినదట. (కుమారసంభవం-VIII-7)

దాదాపు ఇదే వర్ణన ఒకటో శతాబ్దపు ప్రాకృత గాథాసప్తశతిలో ఇలా ఉంది
శివపార్వతుల సంగమ సమయంలో
వలువలు తొలగగా సిగ్గిల్లిన పార్వతీదేవి
రెండుచేతులతో విభుని రెండు కళ్లూ మూసి
మూడవకంటిని ముద్దాడింది. – 455

ఆనందవర్ధనుడు తన ధ్వన్యాలోక ఆలంకార శాస్త్ర గ్రంథంలో వాక్పతిరాజు రచించిన గౌదావహో అనే ప్రాకృత కావ్యం నుంచి ఈ వర్ణనను - సర్వం కోల్పోయిన స్థితిని ధ్వన్యాత్మకంగా చెప్పటానికి ఒక ఉదాహరణగా వాడుకొన్నాడు.

ఆకాశంలో మబ్బులు సోలిపోయి తూలుతూ తిరుగుతున్నాయి
కుండపోతగా కురుస్తున్న వర్షపుధారలకు అర్జున వృక్షాలు వణికిపోతున్నాయి
చంద్రుని గర్వం అణిగిపోయింది, చీకటిరాత్రులు వెంటాడుతున్నాయి. (గౌదావహో 416 – ప్రాకృత కవి వాక్పతిరాజు)
***

6. ముగింపు

ఏది ఏమైనప్పటికీ సంస్కృత బాష- మతక్రతువులపై తన సంపూర్ణ ఆధిపత్యం ద్వారా; రాజాదరణ పొందటం ద్వారా; ఒక సామాజిక వర్గానికి తప్ప మిగిలినవారికి అందుబాటులో లేనికారణంగా - కాలానుగుణంగా భిన్న భాషల మధ్య, భిన్న మతాల మధ్యా మనుగడకోసం జరిగిన పోరాటంలో తాను విజేతగా నిలవటమే కాక, తనకు ప్రాపకం కల్పించిన హిందూ ధర్మానికి కూడా విజయాన్ని అందించింది.
.
బొల్లోజు బాబా
.
సంప్రదించిన పుస్తకాలు
1. Andrew Ollett, Language of the Snakes
2. Language of the Gods in the world of Men, Sheldon Pollock
3. Sanskrit and Prakrit: Sociolinguistic issues by Madhav M. Deshpande
4. ప్రాకృత గ్రంథ కర్తలూ, ప్రజాసేవాను – పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి
5. Andrew Ollett, Language of the Snakes
6.Classical Buddhism, Neo Buddhism and the question of Caste, Pradeep P. Gokhale
7. V.M. Kulkarni "Prakrit Verses in Sanskrit Works on Poetics"
8. గాథాసప్తశతి వ్యాసాలు - బొల్లోజు బాబా
9. GAUDAVAHO by VAKPATIRAJA Prof. N. G. SURU.
10. A HISTORY OF INDIAN LITERATURE EDITED BY JAN GONDA
11. Contribution of Jainas to Sanskrit and Prakrit Literature, Dr. K.R. Chandra Commemoration Volume
12. Ideology and Status of Sanskrit Edited by Jan E.M. Houben
13. Wikipedia





Wednesday, March 22, 2023

atherosclerosis



కలలు, కన్నీళ్ళు
రక్తనాళాల గోడలపై పేరుకొంటాయి
ఇరుకుసందులలోంచి
జీవితం
భారంగా కదులుతూంటుంది
తననీడల్లోకే కూలిపోయే
పాట
.
బొల్లోజు బాబా

తెలుగు పదానికి పట్టం కట్టిన నీటు పాట


Tango, Swing, Flamenco లాంటి పాశ్చాత్య నృత్యరీతులు మీకేమైనా తెలుసా అని హీరో ధ్వయాన్ని ఒక బ్రిటిష్ అధికారి ఎద్దేవా చేసినప్పుడు మా ఆట పాట దేశివాళీ నాటు టైపు అని చెప్పటం ఈ పాట సందర్భం.
ఇది సంప్రదాయ నృత్యంరూపకం కాదు. భరతనాట్యమో, కూచిపూడో బాక్ గ్రౌండ్ గా ఉండటానికి. ఫక్తు గ్రామీణ నేపథ్యంతో సాగే నాటు వ్యక్తీకరణ. దర్శకుని ఊహలో ఈ సందర్భంలో నృత్యం ఇలా ఉండాలని ఒక ఊహ ఉండే ఉంటుంది. దానికి తగ్గట్టుగా సంగీత దర్శకుని వద్ద పాట బాణీ కట్టించుకొని ఉంటాడు. తదనుగుణంగా గీతరచన సాగింది.
నేడు ఈ గీతరచనకు ఆస్కార్ రావటం అనేది తెలుగుభాషకు దక్కిన అత్యంత అరుదైన గొప్ప గౌరవం. ఈ నేపథ్యంలో గీతరచయిత శ్రీ చంద్రబోస్ గారికి అభినందనలు, శుభాకాంక్షలు.
***
పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు
పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు
కిర్రు సెప్పులేసుకుని కర్రసాము సేసినట్టు
మర్రిసెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు
ఎర్రజొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు
పోట్లగిత్త, పోతరాజు, కర్రసాము కుర్రగుంపు, మిరప తొక్కు ఇవన్నీ ఒక అనియతమైన శక్తికి, ఆవేశానికి, ఉద్రేకానికి ప్రతీకలు. అక్కడ హీరో ధ్వయం కూడా అలాంటి అపరిమితమైన కట్టుబడని బలిమికి, సామర్ధ్యానికి సంకేతమని చెబుతున్నాడు కవి. పోట్లగిత్త, పోతరాజు, కిర్రుసెప్పులు, పోలేరమ్మ జాతర, కర్రసాము, జొన్నరొట్టె, మిరపతొక్కు తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నాలు. వీటి ద్వారా స్థానికత యొక్క ప్రాధాన్యాన్ని, చాటుతున్నాడు కవి.
పచ్చి మిరప లాగ పిచ్చ నాటు
నాటు నాటు నాటు
విచ్చు కత్తి లాగ వెర్రి నాటు
గుండెలదిరిపోయేలా డండనకర మోగినట్టు
సెవులు సిల్లు పడేలా కీసు పిట్ట కూసినట్టు
ఏలు సిటికెలేసేలా యవ్వారం సాగినట్టు
కాలు సిందు తొక్కేలా దుమారం రేగినట్టు
ఒల్లు సెమటపట్టేలా వీరంగం సేసినట్టు
హీరో ధ్వయం పాడే పాట ఆడే ఆట-పచ్చిమిరపలా ఘాటైనదని, విచ్చుకత్తిలా పదునైనదని, భీకరంగా డండనకర అంటూ కదంతొక్కుతుందని, చెవులు మోతెక్కించే కూత అని, చిటికలేయించే యవ్వారమని, చిందులేయించే దుమారమని, చమటపట్టించే వీరంగమని వివిధ ఉపమానాలతో వాటి బాహ్య అంతఃస్వరూపాలను కళ్ళకు కట్టిస్తాడు కవి.
యవ్వారం, వీరంగం, పచ్చిమిరప, కాలుసిందు లాంటివి స్వచ్ఛమైన తెలుగు పల్లె పదాలు. వీటిని అంతర్జాతీయ వేదికపైకి ఎక్కించటం గొప్ప గౌరవపాత్రమైన విషయం.
భూమి దద్దరిల్లేలా వొంటిలోని రగతమంతా రంకెలేసి ఎగిరేలా
దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా
దుముకు దుముకులాడేలా దూకేయరో సరాసరి
ఇవి చివరి పంక్తులు. పాటలోని ఉద్వేగాన్ని పతాకస్థాయికి తీసుకెళ్ళే వాక్యాలు. భూమి దద్దరిల్లాలట. రక్తమంతా రంకెలెయ్యాలట. దుమ్ముదులిపేలా దూకేయ్యాలట. నిజానికి ఆ పాట చిత్రీకరణ ఈ మూడు మాటల ఇరుసుపై ఆధారపడి నడవటం గమనించవచ్చు.
ఇది చిత్ర దర్శకుడు, సంగీత దర్శకుడు ముందుగానే సిద్ధంచేసిన గీత ఆత్మస్వరూపం కావొచ్చు.
నీకు నాట్యమేం తెలుసు అని సవాలు విసిరిన బ్రిటిష్ అధికారికి- మా ఆటపాట సాల్టు పెప్పరు చల్లుకొనే చప్పిడి కూడు కాదు - మా ఆట పాట వీరంగం ఆడే పోట్లగిత్త, విసిరిన విచ్చుకత్తి, రంకెలేసే రక్తం, మిరపతొక్కులా ఊరనాటు అంటూ సమాధానం ఇవ్వటం - అత్యంత ప్రతిభావంతంగా చిత్ర కథ ఆత్మలో గీతాన్ని మిశ్రితము చేయటమే. ఇది గీతరచయిత ప్రతిభ.
నేడు ఏ అంశానికైనా పరస్పరవిరుద్ధమైన వాదనలు రావటం సహజంగా మారిపోయింది. ఈ పాట ఆస్కార్ అందుకోవటం పట్ల కూడా - లాబీయింగ్ పనిచేసిందని, సినీ గీతంలో సాహిత్యం ఏముంటుందని, తెలుగులో ఇంతకన్న ఎన్నో గొప్పపాటలున్నాయని వివిధ సన్నాయి నొక్కులు వినిపిస్తున్నాయి.
ఏది ఏమైనా చరిత్ర "గమ్యాలను" మాత్రమే రికార్దు చేస్తుంది.
తెలుగు సినీ సాహిత్యానికి అంతిమ గమ్యమైన ఆస్కార్ అవార్డును దక్కింపచేసిన శ్రీ చంద్రబోస్ చరితార్ధుడు.
ఆయనకు అభినందనలు, శుభాకాంక్షలు
బొల్లోజు బాబా

తొలి ప్రేమ




మిట్టమధ్యాహ్నం
ఇంటిలో అందరూ కునుకు తీసేవేళ
కోతి ఒకటి
వంటింట్లో చొరబడి
అన్నంకుండను ఎత్తుకొని పోయి
చూరుకిందకు చేరి
కొన్ని మెతుకులు కతికి
అక్కడే విడిచి ఎటో వెళిపోయింది
కోతేమో యవ్వనమట
అన్నంకుండ తొలి ముద్దట….
.
బొల్లోజు బాబా
13/3/23

తమసోమా ……..


కొండపైన ఒక పెద్ద మర్రి చెట్టు
దానినీడలో నాలుగురాతి స్తంభాల నడుమ
చిన్న శిథిలాలయం
ప్రాంగణంలో గంట, నందీ.
నీలాకాశంలో కదిలే కొంగల వెనుక
కదలని మెత్తని మేఘాలు
అన్నిటి మధ్యా శ్రావ్యమైన అన్యోన్యత
దూరంగా పశ్చిమంలోకి
ఒంటరిగా జారిపోయే సూరీడు

ఏటవాలు కిరణాలు పడిన
ప్రతీదీ ఆ ఒంటరితనంలోకి కూలుతుంది.

ఇక ఒంటరి కొండ
ఒంటరి మర్రిచెట్టు
ఒంటరి శిథిలాలయం
కొంగల గుంపు
మేఘాలు మిగులుతాయి.

సూర్యుడు మరలా ఉదయించేవరకూ
ఈ ప్రపంచం ఏకాకితనాన్ని తొడుక్కొని
రాత్రికలుగులో దాక్కొని తమస్సునుంచి వెలుగువైపు
నడిపించమని తపస్సు చేస్తుంది.
శిథిలాలయపు శివుడు కూడా
తన అర్ధభాగంలో దేహాన్ని దాచుకొంటాడు
.
బొల్లోజు బాబా

Abandoned parents…..


చలికి ఒణికే దేహంతో అతను
చేతులు చాతీచుట్టూ కప్పుకొని ఆమె
నిన్నటివరకూ దారికి చెరో వైపు
నడుచుకొంటూ వెళ్ళిన ఆ అపరిచితులు
నేడు
ఒకరిచేతుల్లో ఒకరు వేళ్లు పెనవేసుకొని
శరీరాలు దగ్గరగా చేర్చి నడుస్తున్నారు
చలి గాలులకు నాని
ఉబ్బిపోయిన మెత్తని చీకటి
నాలుగువైపుల నుండీ కమ్ముకొనే వేళ
మనిషిని మనిషిలోకి తెరిచే
సహజీవనమనే కావ్యాన్ని
వాళ్ళిద్దరూ కలిసి ఆవిష్కరించుకొన్నారు

బొల్లోజు బాబా

పై కవితను హిందీలోకి అనువదించారు శ్రీ గణేష్ రామ్ గారు.  వారికి ధన్యవాదములు

त्यक्त पितर

शीत के मारे कांपते शरीर से वह

हाथों से वक्ष आवलयित कर वह

कल तक रास्ते के दोनों तरफ चलते जा रहे 
वे दोनों अजनबी
आज
एक दूसरे के हाथों की उंगलियों को   समेटकर

तन बदन को पास  सटाकर चल रहे हैं

ठंडी हवाओं में भीगकर
फूली नर्म मुलायम अंधियारी
चारो तरफ से उमड़ आने की बेला

उन दोनों ने मिल जुलकर
इंसान को इंसान के अंदर खोलनेवाला
सहजीवन काव्य आविष्कृत किया 

బొల్లోజు బాబా గారి Abonded parents కి హిందీ అనువేదం

సమూహం లోకి వారిని స్వాగతిస్తూ

Sunday, March 19, 2023

అశోకుడు – ఏకపాత్రాభినయం, రచన శ్రీ అద్దంకి కేశవరావు, పుస్తక పరిచయం



ఈ రోజు కొత్తపేటలో కళాసాహితి వారి ఆధ్వర్యంలో ఉగాది సాహిత్య సభజరిగింది. ఈ సభలో కీ.శే. శ్రీ అద్దంకి కేశవరావు గారు రచించిన అశోకుడు ఏకపాత్రాభినయ పుస్తకపరిచయం చేసాను. తదనంతరం జరిగిన కవిసమ్మేళనంలో కవితచదివాను. ఈ కార్యక్రమాన్ని శ్రీ గిడ్డి సుబ్బారావుగారు నిర్వహించారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, ప్రసంగ పాఠము.
.
అశోకుడు – ఏకపాత్రాభినయం, రచన శ్రీ అద్దంకి కేశవరావు, పుస్తక పరిచయం
.
భారతదేశ ప్రాచీనచరిత్ర స్పష్టంగా లభించదు. ప్రజలందరూ సమాన హక్కులతో, కలిసిమెలసి, భిన్నవిశ్వాసాలను పరస్పరం గౌరవించుకొంటూ అహింసామార్గంలో జీవించాలని చెప్పిన బౌద్ధాన్ని హిందూ, ముస్లిమ్ మతాలు సంపూర్ణంగా విస్మరించాయి. పంతొమ్మిదో శతాబ్దపు ప్రారంభంలో James Prinsep, Vincent Smith, Alexander Cunningham లాంటి బ్రిటిష్ చరిత్రకారులు బౌద్ధ మత అవశేషాలను తవ్వి వెలికితీసే వరకూ అశోకుడు ఎవరు, ఎలాంటి వ్యక్తి, ఏంబోధించాడు లాంటి సమాచారం ఉండేది కాదు .
ఇరవయ్యోశతాబ్దప్రారంభం నుంచీ బౌద్ధం గురించి, అశోకుడి గురించి రచనలు రావటం మొదలైంది. అలా తెలుగులో బౌద్ధంపై రచనలు చేసిన తొలితరం రచయితలలో శ్రీ అద్దంకి కేశవరావు గారు ముఖ్యులు. నిజానికి కోనసీమలో అశోకుని పాలనలోనే బౌద్ధమతం వెల్లివిరిసింది. దీనికి అశోకుని కుమార్తె సంఘమిత్రచే నిర్మించినదిగా చెప్పబడే ఆదుర్రు స్తూపం ప్రముఖ సాక్ష్యంగా నిలుస్తుంది.
.
1. ఇతివృత్తం
.
ఒకే నటుడు ఒకే పాత్రను రంగస్థలంపై అభినయించే ప్రక్రియను ఏకపాత్రాభినయం అంటారు. అశోక చక్రవర్తి కళింగయుద్ధ సమయంలో జరిగిన ఘోర రక్తపాత దృశ్యాలను చూసి హృదయం ద్రవించి బౌద్ధమతాన్ని స్వీకరించటాన్ని ఇతివృత్తంగా తీసుకొని శ్రీ అద్దంకి కేశవరావు అశోకుడు ఏకపాత్ర రచించారు.
ఒక చక్రవర్తి యుద్ధం వల్ల కలిగే భీభత్సాన్ని గుర్తించి అహింసవైపు నడవటం అనేది మానవజాతి చరిత్రలో అత్యంత గొప్ప మానవీయ విలువలు కలిగిన ఉదంతం.
ఈ మొత్తం ఘట్టం BCE 260 లో వేయించబడిన అశోకుని 13 వ రాతి శాసనంలో విపులంగా ఉంది. ఇవి శాసనవాక్యాలు
.
"కళింగ యుద్ధంలో లక్షమంది చంపబడ్డారు. లక్షన్నరమంది బందీలుగా తరలించబడ్డారు. ఇంకా ఎంతో మంది చనిపోయారు. రాజ్యాన్ని జయించే క్రమంలో లక్షలమంది ప్రజలు బలవంతంగా చంపబడటం, తరలించబడటం, చనిపోవటం దేవానాం ప్రియుని బాధించాయి.
తమకు అత్యంతప్రియులగు స్నేహితులు, పరిచితులు, సహచరులు, బంధువులకు కలిగే బాధ తమకును బాధయే అగునట్లు దేవానాం ప్రియుడు కూడా మిక్కిలి శోకించుచున్నాడు. ఇతరులకు బాధకలిగించకూడదని, వారిని చంపకూడదని దేవానాంప్రియుడు కోరుకొనుచున్నాడు. ఇంతకుముందు కలిగిన జయముచాలును. క్రొత్తదేశములను జయింపనక్కరలేదు. ఈ సంగతి నా పుత్రులు, పౌత్రులు పాటిస్తారని ఈ శాసనమును లిఖింపచేయుచున్నాను"
కళింగయుద్ధం వలన విరాగియై అశోకచక్రవర్తి బౌద్ధదమ్మాన్ని స్వీకరించాడనటానికి పై శిలాశాసనం గొప్ప చారిత్రిక ఆధారం.
.
భారతదేశ చరిత్రను మలుపుతిప్పిన ఘటనకు కళారూపమే శ్రీ అద్దంకి కేశవరావు రచించిన అశోకుడు-ఏకపాత్ర.
.
2. సంవిధానం
ఈ ఏక పాత్రను మూడు అంకాలుగా విభజించుకొనవచ్చును. (క్షతగాత్రుడు, ఉపగుప్తుడు పాత్రలు తెరవెనుకనుంచి వాయిస్ ఓవర్ గా వచ్చే పాత్రలు)
మొదటి అంకంలో కళింగయుద్ధానంతరం ఆ యుద్ధంలో గాయపడిన ఒక కళింగవీరుడు అశోకుని వద్దకు వచ్చి-అశోకభూపతీ నీ రణపిపాస ఫలితంగా ఏర్పడిన పీనుగుల పెంటలను చూసుకొని ఆనందించు ... ఆనందించు…. అని నిందిస్తూ నిష్క్రమిస్తుంది. ఈ పాత్ర అశోకుని మనస్సులో అంతర్మధనాన్ని కలిగిస్తుంది.
రెండవ అంకంలో - యుద్ధభీభత్సం పట్ల అశోకునికి కలిగిన అశాంతి, నిర్వేదం అద్భుతంగా పలికిస్తారు రచయిత శ్రీ అద్దంకి కేశవరావు. ఉదాహరణకు ఈ వాక్యాలు చూడండి....
//ఎచ్చటచూచినను నెత్తుటిమడుగులు, తెగిపడిన హస్తములు! పాదములు! ముంజేతులు! మొండెములు! తొళ్ళెములు! శీర్షంబులు!....ఎంతభీకరముగనున్నదీ రణరంగము!
పై దృశ్యాలనుచూసాకా అశోకునిలో అపరాధనాభావన పెల్లుబికి ఈ యుద్ధం ద్వారా తానెంత ఘోరకార్యానికి ఒడికట్టాడో అర్ధమౌతుంది. ఆ సందర్భంలో రచయిత పలికించిన మాటలు మొత్తం ఏకపాత్రకే ఆయువుపట్టుగా ఉంటాయి. చక్కని అభినయం, గంభీరమైన వాచకం ఉన్న నటుడి చేతిలో ఈ వచనం పడితే అద్భుతంగా రాణిస్తుంది.
// నాయొక్క కీర్తి కొరకు.... నాయొక్కని వంశ ప్రతిష్టకొరకు.... నాయొక్కని జాత్యున్నతి కొరకు...ఎందరినెన్ని విధముల హింసించితినో..... వీరోత్తంసులు, ధీరోదాత్తులు స్వాజాత్యభిమానులు, స్వదేశభక్తులు, స్వారాజ్య స్వతంత్ర రక్షణ దీక్షా పరతంత్రులు నైన కళింగులను తుదముట్టించితిని కదా.... ఎందుకు ఈ పీనుగుల పెంటనేలుటకా... ఈ శ్మశాన రాజ్యపట్టాభిషిక్తుండనై కులుకుటకా!
- ఇంతటి విచక్షణా రహితంగా ఇన్ని లక్షల ప్రాణాలను పొట్టన పెట్టుకొన్న నీకు ప్రాయశ్చిత్తం లేదు, నీకు సద్గతులు లేవు, నీవు నశింపవలసినదే .... నశింపవలసినదే అంటూ తనలో తాను తర్కించుకొంటూ అశోకచక్రవర్తి తూలి స్పృహతప్పి పడిపోతాడు.
ఇక మూడవ అంకంలో అప్పటికే ప్రసిద్ధుడయిన బౌద్ధావలంబి ఉపగుప్తుని ఆశ్రమంలో కళ్ళుతెరిచి ఆ బుద్ధభగవానుని శరణుజొచ్చెద అంటూ బౌద్ధాన్ని స్వీకరించటంతో ఏకపాత్ర ముగుస్తుంది.
ఈ రచన ఆద్యంతం గంభీరమైన వచనంతో, ప్రౌఢమైన భాషా పటిమతో, ఒడలు జలదరించే సన్నివేశ చిత్రణలతో ఎంతో ఆర్థ్రంగా సాగుతుంది.
***
భారతదేశ చరిత్రలో అశోకుని పాత్ర చాలా గొప్పది. చారిత్రికంగా అశోకునితోనే భారతదేశంలో వ్రాత యుగం మొదలైంది. (అంతకు మునుపు సింధులోయనాగరికతలో ఒక లిపి ఉన్నప్పటికీ దానిని ఇప్పటికీ ఎలా చదవాలో తెలియదు.) అశోకుడు దేశం నలుచెరగులా సుమారు ఎనభైవేల వివిధ శాసనాలను ప్రాకృత బ్రహ్మి లిపి లో వేయించాడు.
బ్రహ్మి లిపిని James Prinsep డీకోడ్ చేసాకా ఒక గొప్ప ప్రాచీన ప్రపంచం మనముందు ఆవిష్కృతమైంది. బౌద్ధ, జైన వాజ్ఞ్మయాలు ద్వారా భారతదేశ నిజమైన ప్రాచీనచరిత్ర తెలిసింది. అశోకుడు వేయించిన శాసనాలు భారతదేశపు- తూర్పున నేటి బంగ్లాదేష్, పశ్ఛిమాన నేటి ఆఫ్ఘనిస్తాన్, ఉత్తరాన కాశ్మీరు దక్షిణాన ఆంధ్రప్రదేష్, కర్ణాటకల వరకూ విస్తరించి ఉన్నాయి. అశోకుని శాసనాలు దొరికినంతమేరా ఒకప్పడు బౌద్ధం పరిఢవిల్లిన నేలగా గుర్తించవచ్చు. ఆ విధంగా అశోకునికి భారతదేశ చరిత్రలో ఉన్న స్థానం చెరపలేనిది.
నేడు భారతదేశంలో బౌద్ధమతం పునరుత్తేజం పొందుతున్నది. మేధావులు బుద్ధుని బోధనలోని అంతఃస్సారాన్ని గ్రహించారు. అసంఖ్యాకమైన దళితబహుజనులు తమ మూలాలు బుద్ధిజంలో ఉన్నాయని గ్రహిస్తున్నారు.
ఈ రచన 50 ఏళ్ల క్రితం రచించబడినదని రచయిత కుమారుడు శ్రీ అద్దంకి బుద్ధ చంద్రదేవ్ ఈ పుస్తకానికి రాసిన ముందుమాటలో అన్నారు.
అప్పటికి తెలుగులో బుద్ధిజంపట్ల నేడు ఉన్నంత విస్తృతమైన అవగాహన లేదు. ఆ రోజుల్లోనే- బౌద్ధం యొక్క విశిష్టతను గుర్తించి, ప్రచారంచేసిన కేశవరావు చరితార్ధులు. చిరస్మరణీయులు.
ఈ నేపథ్యంలో కేశవరావు రచించిన ఈ పుస్తకాన్ని పునర్ముద్రించటం ఎంతైనా ముదావహం. అభినందనీయం.
.
పుస్తకం లభించు చోటు
శ్రీ అద్దంకి బుద్ధ చంద్రదేవ్, ఫోన్: 9989244202
.
బొల్లోజు బాబా
18/3/2023







Saturday, March 11, 2023

Puranaanuru - 186


ధాన్యం ప్రాణం కాదు
నీరూ కాదు
ఈ సువిశాల ప్రపంచానికి
రాజే ప్రాణం
"నేనే ఈ ప్రపంచానికి ప్రాణం"
అనే తెలుసుకొనే బాధ్యత కూడా రాజుదే -
.
Puranaanuru Tamil sangam literature – Number 186 – BCE 1st centuary
బొల్లోజు బాబా

ఫ్రాగ్మెంట్


ఈ నిస్సారమైన ఖాళీతనాన్ని
ఏది పూరించగలదు?
పదాలు, కలలు, కన్నీళ్ళు?
అకస్మాత్తుగా
ఈ రికామీతనపు లోయలోంచి
ఒక తెల్లపావురం పైకి లేచింది
దాని ముక్కున
ఆకుపచ్చని ఒలివాకొమ్మలాంటి
కవితా వాక్యం
బొల్లోజు బాబా

పురనానూరు 181


నా ఇంటి స్తంభాన్ని ఆనుకొని నిలిచి
“నీ కొడుకు ఎక్కడ” అని అడుగుతున్నావు
వాడెక్కడ ఉన్నాడో నాకు తెలియదు
అతనికి జన్మనిచ్చిన ఈ గర్భం ఒక కొండ గుహ
పులి కొంతకాలం ఇక్కడ నివసించి వెళిపోయింది
ఎక్కడో ఏదో యుద్ధభూమిలో అతను నీకు దొరుకుతాడు
.
Puranaanuru Tamil sangam literature – Number 86 – BCE 1st centuary
బొల్లోజు బాబా