ఆకుల వలనుంచి
తప్పించుకొన్న కాంతి‚
చేతికిచిక్కని నీడల పొడల్ని
నేలపై చిత్రిస్తూంది.
అనంత జీవనానుభూతుల మధ్య
దొరక్కుండా ఆడించే
ఒకటో రెండో స్వప్నాల్లా.
నువ్వైనా నేనైనా
గుప్పెడు స్వప్నాలమే!
లేకుంటే పిడికెడు జ్ఞాపకాలము.
తుమ్మచెట్టు గుండా వీచే గాలికి
చర్మం నిండా ముళ్ల గాయాలే! పాపం
ఒంటరితనాన్ని గుర్తుచేసే
రాత్రి మళ్లా వచ్చేసింది.
పగటి కన్నీటి చారికల్ని
నిదుర వాన కడిగేసింది.
కనులు తెరచి సూర్యోదయాన్ని
నూత్న శిశువులా ఆహ్వానిద్దాం.
బొల్లోజు బాబా
Friday, April 24, 2009
Saturday, April 18, 2009
ఫ్రాగ్మెంట్స్ 3
1.
ఇక ఇప్పుడు
సంభాషణ అంటే
సెల్ పోను డిస్ప్లేలో
నంబరుచూసుకొని
టాక్ బటను నొక్కడమే!
నాగరికతా
నరకాన్ని ప్రేమిస్తాను
కొలిమిలోకి ఒంటరిగా సాగనీ.
******
2.
రాత్రినుంచి వానచినుకులు
మంత్రాల్ని జపిస్తూ,
ఆకులతో వల్లె వేయిస్తూన్నాయి.
వానచినుకుల
చుంబనాలతో అలసిన
తడితడి పూలపెదవులపై
వేకువ వెండివెలుగై పరచుకుంది.
*****
3
నీ నిష్క్రమణ
తరువాత రోజులన్నీ
ఒకేలా ఉన్నాయి.
మరోసారి
ఏడవటం తప్ప
మరేం చేయగలను చిన్నమ్మా!
*****
4
అలంకరణ అద్దం
ఆమె అందాన్నంతా
తిరిగిచ్చేసింది.
బొల్లోజు బాబా
ఇక ఇప్పుడు
సంభాషణ అంటే
సెల్ పోను డిస్ప్లేలో
నంబరుచూసుకొని
టాక్ బటను నొక్కడమే!
నాగరికతా
నరకాన్ని ప్రేమిస్తాను
కొలిమిలోకి ఒంటరిగా సాగనీ.
******
2.
రాత్రినుంచి వానచినుకులు
మంత్రాల్ని జపిస్తూ,
ఆకులతో వల్లె వేయిస్తూన్నాయి.
వానచినుకుల
చుంబనాలతో అలసిన
తడితడి పూలపెదవులపై
వేకువ వెండివెలుగై పరచుకుంది.
*****
3
నీ నిష్క్రమణ
తరువాత రోజులన్నీ
ఒకేలా ఉన్నాయి.
మరోసారి
ఏడవటం తప్ప
మరేం చేయగలను చిన్నమ్మా!
*****
4
అలంకరణ అద్దం
ఆమె అందాన్నంతా
తిరిగిచ్చేసింది.
బొల్లోజు బాబా
Posted by
బొల్లోజు బాబా
at
12:40 AM
6
comments
Labels:
కవిత్వం,
ఫ్రాగ్మెంట్స్,
సాహిత్యం
Links to this post
Monday, April 13, 2009
ఏమంటావూ?
సోక్రటిస్ తాతా!
చావు, బతుకు లలో ఏది ఉత్తమ మార్గమో?
అంటూ గొప్ప సందేహాన్ని
మా మొహాలపై చల్లి పోయావు.
ఆ ప్రశ్నకు జవాబింకా దొరక లేదు.
కాల మౌన గిలిటిన్ అతిసున్నితంగా
తనపని చేసుకుపోతోంది తప్ప
ఇప్పటిదాకా నోరు విప్పనే లేదు.
ఏ ఒక్క ఆత్మా తిరిగొచ్చి
"ఇదీ సంగతి" అని చెప్పిన పాపానా పోలేదు.
మృత్యు పాత్రిక ఒంపులలో జీవితం
సుబ్బరంగా ఇమిడిపోతూనే ఉంది.
కొత్త అనుభవాలను, ఆలోచనలనూ
యాచించే బిక్ష పాత్ర
రోజూ ఉదయిస్తూనే ఉంది.
స్వప్నాల హంసలు ఖాళీ గాలిలోకి
అలా అదృశ్యమౌతూనే ఉన్నాయి.
తాతా
కొంపతీసి అంతా మిథ్యే నంటావా?
అన్నీ ఇక్కడే నంటావా?
బొల్లోజు బాబా
చావు, బతుకు లలో ఏది ఉత్తమ మార్గమో?
అంటూ గొప్ప సందేహాన్ని
మా మొహాలపై చల్లి పోయావు.
ఆ ప్రశ్నకు జవాబింకా దొరక లేదు.
కాల మౌన గిలిటిన్ అతిసున్నితంగా
తనపని చేసుకుపోతోంది తప్ప
ఇప్పటిదాకా నోరు విప్పనే లేదు.
ఏ ఒక్క ఆత్మా తిరిగొచ్చి
"ఇదీ సంగతి" అని చెప్పిన పాపానా పోలేదు.
మృత్యు పాత్రిక ఒంపులలో జీవితం
సుబ్బరంగా ఇమిడిపోతూనే ఉంది.
కొత్త అనుభవాలను, ఆలోచనలనూ
యాచించే బిక్ష పాత్ర
రోజూ ఉదయిస్తూనే ఉంది.
స్వప్నాల హంసలు ఖాళీ గాలిలోకి
అలా అదృశ్యమౌతూనే ఉన్నాయి.
తాతా
కొంపతీసి అంతా మిథ్యే నంటావా?
అన్నీ ఇక్కడే నంటావా?
బొల్లోజు బాబా
Posted by
బొల్లోజు బాబా
at
11:56 AM
6
comments
Labels:
కవిత్వం,
జీవితం,
సాహిత్యం,
సోక్రటిస్
Links to this post
Wednesday, April 8, 2009
ఆవకాయ.కాం లో నా ఇంటర్వ్యూ
అంతర్జాల తెలుగు సాహిత్యరంగంలో ఆవకాయ.కాం యొక్క పాత్ర అందరికీ సుపరిచితమే.
ఉత్తమమైన ప్రమాణాలు కలిగిన సాహిత్యాన్ని అందించటంలో ఈ వెబ్ పత్రిక ప్రముఖ పాత్రవహిస్తున్నది. దీనికి ఉత్తమాభిరుచిగల పాఠకులు, నిశిత సద్విమర్శలు చేయగలిగిన విమర్శకులు ఉన్నారు. ఈ పత్రికలో కామెంటాలంటే ముందుగా రిజిస్టరు చేసుకోవటం తప్పని సరి.
ఆ పత్రిక ఎడిటర్ గారికి నాకు జరిగిన ఆన్ లైన్ ఇంటర్వ్యూ ను ఇక్కడ చదవండి.
http://www.scribd.com/doc/14064115/Avakaaya-Interview-With-Sri-Bolloju-Baba
భవదీయుడు
బొల్లోజు బాబా
ఉత్తమమైన ప్రమాణాలు కలిగిన సాహిత్యాన్ని అందించటంలో ఈ వెబ్ పత్రిక ప్రముఖ పాత్రవహిస్తున్నది. దీనికి ఉత్తమాభిరుచిగల పాఠకులు, నిశిత సద్విమర్శలు చేయగలిగిన విమర్శకులు ఉన్నారు. ఈ పత్రికలో కామెంటాలంటే ముందుగా రిజిస్టరు చేసుకోవటం తప్పని సరి.
ఆ పత్రిక ఎడిటర్ గారికి నాకు జరిగిన ఆన్ లైన్ ఇంటర్వ్యూ ను ఇక్కడ చదవండి.
http://www.scribd.com/doc/14064115/Avakaaya-Interview-With-Sri-Bolloju-Baba
భవదీయుడు
బొల్లోజు బాబా
Posted by
బొల్లోజు బాబా
at
10:06 AM
11
comments
Labels:
ఆవకాయ.కాం,
ఇంటర్వ్యూ,
కవిత్వం,
బొల్లోజు బాబా,
సాహిత్యం
Links to this post
Sunday, April 5, 2009
పాబ్లో నెరుడా "ONLY DEATH" తెలుగులో......
పాబ్లో నెరుడా (1904-1973) చిలీ దేశానికి చెందిన కవి. ఇరవయ్యవ శతాబ్ధపు సాహిత్యాన్ని ప్రకాశింపచేసిన ప్రముఖ కవిగా నెరుడా సుప్రసిద్దుడు. ఈతని సాహిత్యకృషికి, 1971 లో నోబుల్ ప్రైజు ఇవ్వటం జరిగింది.
నెరుడా కవిత్వం అద్బుతమైన మిస్టిక్ నెస్ తో గొప్ప ప్రతీకలతో నిండిఉంటుంది. కొన్ని కవితలు అధివాస్తవిక ధోరణులతో ఉంటాయి. ఇతడు సమకాలీనులచే ఇరవయ్యవశతాబ్ధపు ఉత్తమ కవిగా" కీర్తింపబడ్డాడు. నెరుడా వ్యక్తిగతంగా చిలియన్ కమ్యూనిష్టు పార్టీ తరపున పని చేసాడు. రాజకీయకారణాల వల్ల కొంతకాలం అజ్ఞాతంగా కూడా జీవించవలసివస్తుంది. ఈతని కవిత్వంలో కమ్యూనిష్టు పోకడలు పెద్దగా ఉండవు. నెరుడా కవిత్వంలో కరుణ, మానవత్వం తొంగిచూస్తుంటాయి. తన మెటఫర్ల్ లతో నెరుడా చదువరిని మరోలోకంలోకి తీసుకుపోతాడు. అతని పద్యం ఒక కలలా పాఠకుని వెంటాడేలా చేస్తాడు.
నెరుడా కవిత్వం అనేక ప్రపంచభాషలలోకి అనువదింపబడింది.
నెరుడా వ్రాసిన Only Death అనే పద్యానికి నేచేసిన అనువాదం ఇది.
మృత్యువు మాత్రమే
మూగ ఎముకలు నిండిన గోరీలతో
ఏకాకి స్మశానాలవిగో.
సొరంగం గుండా హృదయ యానం
నీడలు.... నీడలు.... నీడలు.
మనలోకే కూలిపోయే ఓడలా
మనం చనిపోతూంటాం.
హృదయంలోకే మునిగిపోయినట్లుగా
చర్మంనుండి ఆత్మదాకా
అనంతంగా జారిపోయినట్లుగా
మనం చనిపోతూంటాం.
గవ్వలు పేరుకొన్న శిలలపాదాలవిగో
అక్కడంతా మృతదేహాలు.
స్వచ్చమైన శబ్ధంలా ఎముకలలో మృత్యువుంది.
ఏ కుక్కా లేకుండా వినిపించే మొరుగులా
గంటలనుంచో, గోరీలనుంచో జనిస్తో, తేమలో ఉబ్బుతో
ఒక ఏడ్పులానో లేక వానలానో మృత్యువు శబ్దిస్తోంది.
ఒంటరిగా ఒక్కోసారి నేను చూస్తుంటాను
తెరచాప నీడలో శవపేటికల్ని.
మృతుల, మృత జడల జవ్వనుల
తెల్లని దేవదూతల్లాంటి వంటవాళ్ల,
గుమస్తాలను పెండ్లాడిన శోక యవ్వనిల
లంగరు బరువును మోస్తోన్న
శవపేటికలను చూస్తూంటాను.
నిలువెత్తు మృత్యునదిలో
ఎర్రగా ఒరిసిపోయిన ఆ నదిలో
ప్రవాహానికి ఎదురొడ్డుతూ
మృత్యు సంగీతపు అలలతో శ్రుతి కలుపుతూ
మృత్యు మౌన కెరటాల సవ్వడితో జతకలుపుతూ
శవపేటికలు ఎగప్రాకటం
ఒక్కోసారి నేను గమనిస్తూంటాను.
మృత్యువు కనిపించదు, దాని శబ్ధమే నడిపిస్తూంటుంది.
పాదం కనిపించని బూటులా, దేహం అగుపించని సూటులా.
రాతితో కానీ, చేతితో కానీ చేయబడని
గణగణ మనే ఘంటారావం లా మృత్యువు వినిపిస్తుంది.
మృత్యువుకు నోరు లేదు, నాలుక లేదు, గొంతుకా లేదూ,
కానీ, మృత్యు పిలుపు వినిపిస్తూంటుంది.
సందేహం లేదు, నీవు మృత్యు పదఘట్టనలని
దాని దుస్తుల రెపరెపల్నీ, ఒక వృక్షంలా మౌనంగా వినగలవు.
మృత్యువు మాయా తివాచీపై కూర్చొని
నేలను నాకుతూ, మృతులకై వెతుకుతూ
భూమిని చుడుతూ ఉంటుంది.
మాయా తివాచీయే మృత్యువు.
దాని మృత్యు నాలిక మృతులను వెతుకుతూంటుంది.
తివాచీ నేసుకోవటానికి దారాలను వెతుక్కొంటూంది.
నాకు తెలియదు
నాకు కొంచెమే అర్ధమయింది
దృశ్యం అస్పష్టంగానే ఉంది, కానీ
మృత్యు గీతం అనేది తడిచిన నల్లకలువల వర్ణమని
నేను నమ్ముతున్నాను.
అవును
మట్టికి అలవాటు పడిన నల్లకలువ వర్ణమే!
ఎందుకంటే
మృత్యువు యొక్క ముఖం ఆకుపచ్చన.
ఎందుకంటే
నల్లకలువ దళపు పదునైన తడితోనూ
దాని గంభీరవర్ణపు శీతాకాల అసహనంతోనూ సారించే మృత్యువు యొక్క తీక్షణ చూపులు ఆకుపచ్చనే మరి.
మంచాలపై మృత్యువుంది
మెత్తని పరుపులపై, నల్లని దుప్పట్లలోనూ ఉంది.
దుస్తుల మడతలలో మృత్యువు విస్తరించి
అకస్మాత్తుగా పేలుతుంది.
దుప్పట్ల మధ్య నల్లటి శబ్ధం వ్యాపిస్తుంది.
మంచాలు ఓడరేవుకై ప్రయాణం సాగిస్తూంటాయి.
అక్కడ
యుద్దఓడల అధిపతి దుస్తులు ధరించిన
మృత్యువు ఎదురుచూస్తుంటుంది.
బొల్లోజు బాబా
ఆశక్తి ఉన్నట్లయితే అంతర్జాలంలో ఈ క్రింది లింకులలోని నెరుడా కవితల అనువాదాల్ని కూడా చదవండి బాగున్నాయి.
http://prajakala.org/mag/2008/02/pablo_neruda1
http://www.eemaata.com/em/issues/200209/595.html
http://www.pranahita.org/2007/08/nee_navvu/
Posted by
బొల్లోజు బాబా
at
3:08 PM
9
comments
Labels:
అనువాదం,
నెరుడా Only Death కు తెలుగ్ అనువాదం,
పాబ్లో కవిత్వం,
సాహిత్యం
Links to this post
Subscribe to:
Posts (Atom)

